breaking news
Trash heap
-
వివాహేతర సంబంధాల వల్లే..
-ఈ ఏడాది జూలై నెల 31న విజయనగరం ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని పొలంలో ఒక రోజు వయసున్న మగశిశువును అట్టపెట్టెలో పెట్టి పడేశారు. దీంతో ఆ శిశువు మృతి చెందాడు. -ఈఏడాది ఆగస్టు 30న గజపతినగరం రోడ్డులో రెండ్రోజుల వయసున్న మగ శిశువును పడేశారు. దీంతో మగశిశువు మృతి చెందాడు. -బొబ్బిలిలో సెప్టెంబర్ నెలలో అప్పుడే పుట్టిన శిశువును కాలువలో పడేయడంతో మృతి చెందాడు. -తాజాగా విజయనగరం జొన్న గుడ్డి ఉప్పరవీ«ధిలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో పడేయడంతో తలను కుక్కలు తినేశాయి. -ఇవే కాదు.. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో శిశువులను చెత్తకుప్పలు, రోడ్డు పాల్జేసిన సంఘటనలు మూడు బయట పడ్డాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: మాతృత్వానికి నోచుకోక ఎంతో మంది మహిళలు అల్లాడుతున్నారు. అలాంటిది చందమామలాంటి పిల్లలను కొందరు నిర్థాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నవమాసాలు గర్భంలో ఉన్న శిశువులు కళ్లు తెరవకముందే హత్య చేసేస్తున్నారు. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఆలయాలు, బస్స్టేషన్, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరైనా చూస్తే వారు బతికి బట్టగడుతున్నారు. లేదంటే వారు కుక్కలు, నక్కలు పాలై మృత్యువాత పడుతున్నారు. అందరూ ఉన్నప్పటికీ అమ్మ, నాన్న పిలుపునకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారు. వివాహేతర సంబంధాల వల్లే.. వివాహేతర సంబంధాల వల్ల గర్భం దాల్చినవారు విషయం బయటపడితే పరువు పోతుందని భయపడి చెత్తకుప్పలు, బావుల్లోనూ పడేస్తున్నట్టు సమాచారం. వివాహం కాకుండా గర్భవతులు అయిన మహిళలు శిశువులను వదిలించుకోవడానికి విక్రయించడం లేదా శిశువులను తుప్పలు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. శిశుగృహకు అప్పగించండి పిల్లలు అవసరం లేదనుకునే వారు శిశుగృహకు అప్పగించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. శిశువులకు అన్ని రకాల వసతి రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాం. శిశువులను చెత్తకుప్పల పాల్జేయడం మంచిది కాదు. – బి.హెచ్.లక్ష్మి, జిల్లా బాలల సంరక్షణాధికారి 1098కి ఫోన్ చేయండి.. పిల్లలు అక్కర్లేకపోతే చైల్డ్లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫోన్ చేసి ఫలానా ప్రాంతంలో శిశువు ఉన్నాడని సమాచారం ఇస్తే చాలు.. క్షణాల్లో రక్షణ కల్పిస్తాం. లేదంటే నేరుగా అందించిన ఫర్వాలేదు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వినియోగించుకోవాలి. అంతే తప్ప పిల్లలను చంపేయడం నేరం. – వి.లక్ష్మణరావు, చైర్మన్, జిల్లా బాలల సంక్షేమ సమితి -
ఎక్కడి చెత్త అక్కడే..
కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిగి : పంచాయతీ కార్మికుల సమ్మెతో పరిగి పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్తా చెదారం పేరుకుపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పరిసరాలు, రోడ్లు, మురికికాలువలు, చెత్త కుండీలు పరిశుభ్రంగా ఉంచే పంచాయితీ కార్మికులు సమ్మె బాటపట్టడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. పట్టణంలో ఉన్న చెత్తకుండీలు పూర్తిగా నిండిపోయాయి. టీచ ర్స్ కాలనీకి వెళ్లే దారిలో, బస్టాండ్ ముందు, కూరగాయాలు విక్రయించే రోడ్ల పై చెత్తకుప్పలు పేరుకుపోయాయి. పరిసరాలు దుర్గంధంతో నిండిపోయాయి. కార్మికులు సమస్యను పరిష్కరించటంలో పాలకులు చిత్తశుద్ధి చూపటం లేదు. ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపించటంలేదు. గ్రామాల్లో నీళ్లు వదలడం, వీధిలై ట్లు ఆన్, ఆఫ్ చేయడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో తాత్కాలి కంగా పనులను వేరేవారికి అప్పగించిన పాపాన పోవడంలేదు. సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన కుప్పలు ఇబ్రహీంపట్నం: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ‘పట్నం’ నగర పంచాయతీలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. అంబేద్కర్ చౌ రస్తా సమీపంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతం, పెట్రోల్బంక్ ప్రాంతం, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి సమీపంలో, పోచమ్మబస్తీ, రాయ్పోల్ రోడ్డులోని పాత పోలీస్స్టేషన్ ప్రాంతం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. తీవ్ర దుర్గంధంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య ఇలాగే ఉంటే.. అంటురోగాలు, విషజ్వరాలు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడకేసిన పారిశుద్ధ్యం తాండూరు: కాంట్రాక్టు కార్మికులు సమ్మె బాట పట్టడంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. నాలుగు రోజులుగా కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో తాండూరు మున్సిపాలిటీలో కాలనీలు, వార్డులు కంపుకొడుతున్నాయి. చెత్తకుప్పలు ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో భరించలేని దుర్గంధంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. అధికారులు, పాలక మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించకపోవడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడంతో దోమల బాధ తీవ్రమైంది. ఇక కాలనీలు, వార్డుల్లో వ్యర్థపదార్థాలు, చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ స్తంభించింది. నాలుగు రోజులుగా సుమారు 160 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లతో అధికారులు, పాలకమండలి చెత్తను ఎందుకు తొలగించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రోజులు ఈ ‘కంపు’ భరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.