breaking news
track maintenance
-
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యేక రైళ్ల పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికం గాను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి 17వ తేదీ వరకు కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268), మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), ఈ నెల 5 నుంచి 18 వరకు గుంటూరు–రాయగడ (17243/17244), బిట్రగుంట–విజయవాడ (07977/07978), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07575), విజయవాడ–గూడూరు (07500), విజయవాడ–గూడూరు (12744), ఈ నెల 4, 5, 6, 8 తేదీలలో విజయవాడ–విశాఖపట్నం (22702), ఈ నెల 9, 11, 12, 13 తేదీలలో విశాఖపట్నం–విజయవాడ (22701), ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు గుంటూరు–విశాఖపట్నం (17239/17240), ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు, అదే విధంగా ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు గూడూరు–విజయవాడ (07458/12743) రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. కాగా, మచిలీపట్నం– విజయవాడ, నర్సాపూర్–విజయవాడ, విజయవాడ–భీమవరం మధ్య రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రత్యేక రైళ్లు పొడిగింపు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాల నుంచి నడుపుతున్న పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు పూర్ణా–తిరుపతి (07609), ఈ నెల 5 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి–పూర్ణా (07610), ఈ నెల 2 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్–నర్సాపూర్ (07631), ఈ నెల 3 నుంచి 31వ తేదీ వరకు నర్సాపూర్–హైదరాబాద్ (07632), ఈ నెల 3 నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–సికింద్రాబాద్ (07481), ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–తిరుపతి (07482), ఈ నెల 1 నుంచి 29వ తేదీ వరకు కాకినాడ టౌన్–లింగంపల్లి (07445), ఈ నెల 2 నుంచి 30వ తేదీ వరకు లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) రైళ్లను పొడిగించారు. -
9, 11న పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఖరగ్పూర్ డివిజన్లోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద జరుగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. హౌరా–మైసూర్ (22817), షాలీమార్–హైదరాబాద్(18045/18046), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (22807), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), ఆగర్తలా–సికింద్రాబాద్ (07029), సిల్ఘాట్ టౌన్–తంబరం (15630), చెన్నై సెంట్రల్–షాలీమార్ (12842), పురులియా–విల్లుపురం (22605) రైళ్లను ఈ నెల 9న రద్దు చేశారు. మైసూర్–హౌరా (22818) రైలును ఈ నెల 11న రద్దు చేశారు. -
గూడూరు-చెన్నై మార్గంలో ట్రాక్ మరమ్మతులు: పలు రైళ్లు ఆలస్యం
నెల్లూరు జిల్లాలోని గూడూరు - చెన్నై మార్గంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ 3 గంటల ఆలస్యంగా నడుస్తుందని తెలిపింది. అలాగే పాట్నా - బెంగళూరు నగరాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ 3.30 గంటల ఆలస్యం అవుతుందని పేర్కొంది. వీటితోపాటు భాగమతి ఎక్స్ప్రెస్ 2.50 గంటల ఆలస్యంగా నడుస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.