breaking news
tennetipark
-
వర్ష బీభత్సం: కొట్టుకొచ్చిన భారీ నౌక
సాక్షి, విశాఖటపట్నం : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలం అవుతోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి ఓ భారీ నౌక కొట్టుకుని వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన మర్చంట్ వెసల్ నౌక భారీ ఈదురు గాలులకు కొట్టుకువచ్చింది. గాలితీవ్రత ఎక్కవగా వుండటంతో ప్రతికూల పరిస్ధితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్ల పొడవాటి నౌక పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా.. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ కోల్పోవడంతో ఏర్పడిన సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నౌకను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుంటున్నారు. (భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం) (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
‘గీతం’ స్వచ్ఛభారత్
సాగర్నగర్ ః స్థానిక కైలాసగిరి సమీపంలోని తెన్నేటిపార్కులో గీతం విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్), గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగం వలంటీర్ల ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 50మంది విద్యార్థినీ, విద్యార్థులు తెల్లవారుజామున నుంచి కార్యక్రమంలో పాల్గొని తెన్నేటిపార్కు పరిరాలను శుభ్రం చేశారు. పార్కులో వ్యర్థాలను తెలగించి మొక్కలకు నీరు అందే విధంగా పాదులు సరిచేయడంతోపాటు సందర్శకులకు పరిశుభ్రత పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసాద్, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.స్వామి, విద్యార్థి వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ కె. వీరభద్రం, డైరెక్టర్ ఎన్ఎస్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.