breaking news
temporary structures
-
ప్రారంభోత్సవం రోజునే పరాభవం... హఠాత్తుగా కుప్పకూలిన వంతెన: వీడియో వైరల్
Bridge collapsed immediately after an official cut the ribbon to inauguration: డెమొక్రెటిక్ రిపబ్లక్ ఆఫ్ కాంగో(డీర్సీ)లో ఒక వంతెన ప్రారంభోత్సవంలో అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. వాస్తవానికి కాంగ్లోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పైగా పెద్ద ఎత్తున్న అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్ కటింగ్ చేస్తుండగా... హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు, పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే ఈ వంతెనను మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో... స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదీగాక ఈ వంతెనకు ముందు ఉన్న తాత్కాలికా నిర్మాణం తరుగచుగా కూలిపోతుంటుందని ఒక స్థానిక వార్త సంస్థ పేర్కొనడం గమనార్హం. (చదవండి: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ) -
గోదావరి పుష్కరాలకు రూ.13.48 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కర ఏర్పాట్ల నిమిత్తం రూ.13.48 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఐదు జిల్లాల్లో మొత్తం 174 పనులను చేపట్టాలని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గ్రామీణ నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించింది. తాగునీటి సదుపాయం కోసం శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు, మరుగుదొడ్ల సదుపాయాలను పుష్కర ఘాట్ల వద్ద చేపట్టనున్నారు.