-
Ind vs Eng: భార్యతో కలిసి రవీంద్ర జడేజా పూజలు
Ravindra Jadeja - Rivaba Jadeja: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, గుజరాత్ క్రికెటర్ రవీంద్ర జడేజా భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. కచ్లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జడ్డూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సఫారీ పర్యటనలో విఫలం కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20, టెస్టు జట్లకు ఎంపికైన జడేజా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వెన్నునొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఆఖరిదైన రెండో మ్యాచ్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటర్గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో డకౌట్ అయిన జడేజాకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. సతీసమేతంగా అమ్మవారి సన్నిధిలో ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబానికి సమయం కేటాయించిన రవీంద్ర జడేజా భార్య రివాబాతో కలిసి ప్రఖ్యాత ఆశాపుర మాతా ఆలయాన్ని దర్శించాడు. 14వ శతాబ్దంలో కచ్ ప్రాంతంలో నిర్మితమైన.. ఈ గుడిలో జడ్డూ కుటుంబం తాజాగా ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటవైరల్ అవుతున్నాయి. కాగా జడేజా తదుపరి ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సిద్ధం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్కు సంబంధించి తొలి రెండు మ్యాచ్లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కింది. బీజేపీ ఎమ్మెల్యే ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టుల్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి జడ్డూ 29 వికెట్లు పడగొట్టడం విశేషం. కాగా జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్తో టీమిండియా ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. (Rivaba: ఆడపడుచు, మామ అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ ఇదే) చదవండి: Ranji Trophy: కెప్టెన్సీకి విహారీ రాజీనామా! రహానే గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే! -
ఆ విషయంలో నా కుమార్తెకు ధన్యవాదాలు: ఎస్ఎస్ రాజమౌళి
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ను ప్రపంచానికి పరిచయం దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. అయితే ఈ చిత్రానికి సీక్సెల్ కూడా ఉంటుందని ఇటీవలే ప్రకటించారు కూడా. దీనికి సంబంధించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) కానీ అంతకుముందే ప్రిన్స్ మహేశ్బాబుతో రాజమౌళి ఓ చిత్రం చేయనున్నారు. గతంలోనే రాజమౌళి, మహేశ్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది గ్లోబ్ ట్రొటింగ్ సినిమా అని అన్నారు. అడ్వెంచరస్ తరహా స్టోరీ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇలా రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ మాటలు బట్టి చూస్తుంటే ఇది ఇండియానా జోన్స్ తరహా జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు దర్శకధీరుడు. తన కుటుంబంతో కలిసి తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను చుట్టేసినట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. జూన్ నెల చివరివారంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ట్వీట్లో రాస్తూ.. 'చాలా కాలంగా తమిళనాడులో రోడ్ ట్రిప్ వెళ్లాలనుకున్నా. దేవాలయాలను సందర్శించాలనుకున్న నా కుమార్తె ఆలోచనకు ధన్యవాదాలు. మేము జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మదురైకి వెళ్లాం. అద్భుతమైన వాస్తుశిల్పం, ఇంజనీరింగ్, పాండ్యాలు, చోజాస్ నాయకర్లు, అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా నన్ను మంత్రముగ్ధులను చేశాయి. అంతే కాకుండా మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేసినా.. రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్లో భోజనం చేసినా.. ఎక్కడైనా భోజనం అద్భుతంగా అనిపించింది. నేను వారంలోనే 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం తర్వాత.. ఈ హోమ్ ల్యాండ్ టూర్ రిఫ్రెష్గా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి ) Wanted to do a road trip in central Tamilnadu for a long time. Thanks to my daughter who wanted to visit temples, we embarked upon it. Had been to Srirangam, Darasuram, Brihadeeswarar koil, Rameshwaram, Kanadukathan, Thoothukudi and Madurai in the last week of June . Could only… pic.twitter.com/rW52uVJGk2 — rajamouli ss (@ssrajamouli) July 11, 2023 -
అమలాపాల్కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన!
నటి అమలాపాల్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్న సంఘటన స్థానికంగా వివాదస్పమైంది. వివరాలు.. కేరళలోని ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర మతస్తులకు అనుమతి ఉండదు. ఈ క్రమంలో రీసెంట్గా తన స్నేహితులతో అమలాపాల్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎర్నాకుళం ఆలయానికి వెళ్లింది. క్రిస్టయన్ మతస్తురాలైన అమలాను అక్కడ ఆలయ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చదవండి: అరుదైన వ్యాధి.. పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు దీంతో నిరాశ చెందిన ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్లో నోట్ రాసింది. ‘అన్యమతస్థురాలిని అని నాకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదు. నేను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించాను. అమ్మవారి శక్తిని ఫీల్ అయ్యాను. కానీ నన్ను ఆలయంలోకి అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ వివక్షలో త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం రావాలని కోరుకుంటున్నా’ అని అమలా పేర్కొంది. చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా వివాదస్పదంగా మారింది. దీనిపై పలు సామాజికి సంఘాలు, ప్రముఖుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ప్రసూన్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న ప్రోట్కాల్ను మాత్రమే మేం పాటిస్తున్నామన్నారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చింది ఒక సెలబ్రెటి కాబట్టి ఇది వివాదస్పదం అయ్యింది’ అని అన్నారు. -
వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన షారుక్ ఖాన్, వీడియో వైరల్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలె షారక్ మక్కాను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం షారుక్ పఠాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. Shah visited Vaishno Devi Temple ❤️ May Devi Maa fulfill all his wishes 🙏🏻 #ShahRukhKhan𓀠 pic.twitter.com/1XrL82XaCW — 👸Sharania Jhanvi𓀠🌹BesharamRang (@SharaniaJ) December 12, 2022 -
త్వరలో పెళ్లి! మూవీ యూనిట్తో కలిసి అమ్మవారి దర్శనం
నటి హన్సిక పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. కారణం ఈమె పెళ్లికి సిద్ధమవడమే. డిసెంబర్ 4వ తేదీన హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఆదివారం చెన్నైలోని కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంది. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం యూనిట్ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. తాజాగా హన్సిక్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో తన మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఇందులో మెట్రో సిరీష్ , మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ప్రజిత, పవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్? ఈ చిత్రం గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న 10వ చిత్రం ఇది. ఈమె చిత్ర షూటింగ్ను ఆదివారం చెన్నైలో ప్రారంభించారు. ముందుగా హన్సికతో పాటు చిత్ర యూనిట్ కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎమోషనల్తో కూడిన హార్రర్, కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ను నిర్విరామంగా ఈ నెలపాటు నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. #Hansika did Dharshan at the famous #KaligaambaalTemple in Chennai today before shooting for @Dir_kannanR ‘s emotional horror thriller. For the very first time, #Hansika does dual role in this film produced by @MasalaPix @johnsoncinepro pic.twitter.com/tlgEoBIEzp — Ramesh Bala (@rameshlaus) November 13, 2022
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement