-
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ–హాస్టల్–భోజన వసతితో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్ట లేషన్, సర్వీసు కోర్సుకు 6 నెలల శిక్షణ, దీనికి ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్డ్బ్యాగ్స్ కోర్సుకు 6 నెలలు శిక్షణ, దీనికి 8వ తరగతి పాసై ఉండాలని తెలిపారు. అర్హతలు ► వయసు 18–25 ఏళ్ల లోపు వారై ఉండాలి ► ప్రస్తుతం చదువుకుంటున్న వారు అర్హులు కాదు. ► అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్, పాస్పోర్ట్ ఫొటోలు, ఆధా, రేషన్కార్డులు ఆసక్తి, అర్హతలున్న గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు ఈనెల 13న ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని తమ సంస్థకు రావాలని స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థ డైరెక్టర్ కిశోర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: బస్పాస్ చార్జీలు భారీగా పెంపు?) -
మహిళాభివృద్ధికి రూ.500 కోట్లు
మొయినాబాద్: జిల్లాలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం సమావేశ మందిర భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. సమావేశ మందిరంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని మహిళాసంఘాలకు రూ.500 కోట్లు బ్యాంకులింకేజీ రుణాలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో 37 వేల సంఘాలలోని 4 లక్షల మందికి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు తీసుకున్న రుణాల రికవరీ 98 శాతం ఉందని, దాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తి చేయడానికి రూ.40 లక్షలు జిల్లా పరిషత్ నుంచి మంజూరు చేయిస్తామన్నారు. తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. 19న సమగ్ర సర్వే... ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఈ సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. అధికారులు సైతం సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా చేయాలన్నారు. మన ఊరు-మన ప్రణాళిక ద్వారా అభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక సిద్ధమయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్ను జిల్లా కేంద్రంగా చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఐటీ కంపెనీలు, సంస్థలు రావడానికి అవకాశం ఉందని, మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేయించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి: ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొయినాబాద్లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని, మంజీరా నీళ్లు అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు 111 జీవోతోపాటు ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్యకు రూ.13.51 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రి చేతులు మీదుగా అందజేశారు. ప్రాంగణం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ పద్మమ్మ, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జేడీఎం హమీద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శకుంతల, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్ గంగాధర్, ఏఈలు భాస్కర్రెడ్డి, బల్వంత్రెడ్డి, నాగరాజు, సర్పంచ్లు సంగీత, సుధాకర్, మల్లేష్, నవీన్, రాంచంద్రయ్య, ఎంపీటీసీలు సహదేవ్, పెంటయ్య, మాణిక్రెడ్డి, రాంరెడ్డి, నాయకులు అనంతరెడ్డి, గోపాల్రెడ్డి, కొండల్గౌడ్, హన్మంత్రెడ్డి, శ్రీహరియాదవ్, సంజీవరెడ్డి, రమేష్, హన్మంత్యాదవ్, దర్శన్, రవీందర్రెడ్డి, నీలకంఠం, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement