breaking news
FROM TDP
-
అన్నివర్గాల మద్దతుతో జగన్ను సీఎం చేద్దాం
జలుమూరు శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. అందవరం పంచాయతీ రామకృష్ణాపురం ఎస్సీ కాలనీకి చెందిన గౌడ రాజు, గౌడు అప్పన్న, గౌడ మల్లేశ్వరరావు, మూగి తవుడు, వాడాన రాజు, గొండేలు తవుడు, జామాన నాయుడు, జామాన మల్లేశ్వరరావు, మారెల ఎర్రయ్యలతోపాటు, కూర్మానాథపురం జన్మభూమి కమిటీ సభ్యుడు పంగ రమణారావు టీడీపీ వీడారు. ఈ మేరకు కృష్ణదాస్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆయన పార్టీ జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రమణారావు మాట్లాడుతూ పార్టీలో 20 ఏళ్లుగా ఉండి కష్టకాలంలో కూర్మానాథపురంలో పార్టీ మనగడకు కృషి చేస్తే తగిన గుర్తింపు లేదని వాపోయారు. ఇంకా మరింతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రామకృష్ణాపురం నాయకులు మాట్లాడుతూ టీడీపీ కోసం కష్టపడిన వారికి కాకుండా, మోసగాళ్లను గుర్తిస్తున్నారని, అందుకే విసిగివేసారి కృష్ణదాస్ను సమర్థించేందుకు స్వచ్ఛందంగా చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, తంగి మురళీకృష్ణ,వాన గోపి, ధర్మాన జగన్, తవిటినాయుడు, శ్యామ్, గోవిందరావు, పిట్ట ప్రసాద్, రామారావు, ఆదిబాబు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక
కొయ్యేటిపాడు (పెనుమంట్ర) : ఆచంట నియోజకవర్గవ్యాప్తంగా మరింత మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సాఆర్ కాంగ్రెస్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ అన్నారు. పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో బుధవారం జరిగిన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నేతల దానయ్య, పమ్మి శ్రీనివాసు, కుసుమే స్వామి, లూథర్, జి.నరసింహరావు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్, జిల్లా నాయకులు దాట్ల త్రిమూర్తిరాజు, పెనుమంట్ర, పెనుగొండ, మండలాల పార్టీ కన్వీనర్లు కర్రి వేణుబాబు, దంపనబోయిన బాబూరావు, కర్రి సత్యనారాయణరెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు వెలగల వెంకట రమణ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దొంగ దుర్గాప్రసాద్, ఉన్నమట్ల మునిబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రా రవికుమార్, అల్లం బులిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.