-
మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిందా? పేటీఎంలో చెక్ చేయండిలా!
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పేటీఎం ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్, బుకింగ్ మూవీ టికెట్స్, పలు రకాలైన సేవల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్ను పేటీఎం తన యాప్లో జత చేసింది. ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో ప్రయాణికులకు ఇకపై సులభం తత్కాల్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్, క్యాన్సిలేషన్పై టికెట్లపై ఇన్స్టంట్ రీఫండ్, ఫ్లాట్ ఫామ్ నెంబర్ను ట్రాక్ చేయడంతో పాటు ఐటీఆర్సీటీసీ బుకింగ్స్ సంబంధించిన అన్నీరకాల సర్వీసుల్ని యూజర్లు వినియోగించుకోవచ్చని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు మీరు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ కన్ఫామ్ లేదా అని తెలిపేలా ప్రిడిక్షన్స్ సైతం చూపిస్తుంది. అదే సమయంలో మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతానికి అదే సమయానికి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. ఉంటే సదరు ట్రైన్లలో సీట్లను కేటాయిస్తామని పేటీఎం హామీ ఇచ్చింది. ఐఆర్సీటీసీ ప్రయాణికులు సైతం పేటీఎం యాప్లో సమీప రైల్వే స్టేషన్లను, ట్రైన్ టికెట్లపై పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ సమయపాలనలో అంతరాయం ఉంటే ముందే చెప్పేస్తుంది. 24*7 పేటీఎం యాప్లో 10 లాంగ్వేజ్లలో సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణికులకు అనుగుణంగా వారికి కావాల్సిన విధంగా టికెట్ ధరల్ని అందిస్తుంది. పేటీఎంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? 👉యాప్ లో పేటీఎంలోకి లాగిన్ అవ్వండి లేదా paytm.com/train-tickets సందర్శించండి 👉మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి 👉ఆ తర్వాత జర్నీ డేట్ ఎంటర్ చేసి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు సెర్చ్ ఆప్షన్పై ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీ ట్రైన్, అందులో సీటు సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకొని మీకు కావాల్సిన సీటు, తరగతి, తేదీని ఎంపిక చేసుకోవాలి. 👉టికెట్లు బుక్ చేసుకోవడానికి బుక్ బటన్ మీద క్లిక్ చేసి, మీ ఐఆర్సీటీసీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. 👉మీకు లాగిన్ ఐడీ లేకపోతే ‘సైన్ అప్ విత్ ఐఆర్సీటీసీ’ ఆప్షన్పై ట్యాప్ చేయడం లేదా, ఐఆర్సీటీసీ ఫర్ గెట్ పాస్వర్డ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఐఆర్సీటీసీ ఐడీని రీసెట్ చేసుకోవచ్చు. 👉తరువాత, ట్రైన్ వివరాల్ని జత చేసి ‘బుక్’ ఆప్షన్మీద ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు చెల్లించండి. 👉మీ బుకింగ్ పూర్తి చేయడానికి ఐఆర్సీటీసీ వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. 👉ధృవీకరించడానికి పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి 👉టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేటీఎం మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి మీ టికెట్ల ఇమెయిల్ కూడా పంపుతుంది. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
ప్యాసింజర్ ట్రైన్లలో తత్కాల్ రిజర్వేషన్ సదుపాయం!
ఎమర్జెన్సీ రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశ్యంతో పలు ప్యాసింజర్లలో తత్కాల్ రిజర్వేషన్ స్కీమ్ రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ మినహా అన్నిరిజర్వుడ్ క్లాసుల్లో తత్కాల్ స్కీమ్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రాజధాని, దురంతో, శతాబ్ది ట్రైన్లతోపాటు మెయిల్స్, ఎక్స్ ప్రెస్ ట్రైన్లలోనే తత్కాల్ స్కీమ్ అందుబాటులో ఉంది. గత ఆర్ధిక సంవత్సరంలో 60 శాతం పైగా ప్రయాణికులు ప్రయాణించిన ప్యాసింజర్ ట్రైన్లలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. అలాంటి పాసింజర్ ట్రైన్లను గుర్తించే పనిని ఆయా జోన్లకే అప్పగించామని రైల్వేశాఖ కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. భోపాల్-ఇండోర్ ప్యాసింజర్, హౌరా-చక్రధర్ ప్యాసింజర్, అగర్తలా-ధరమ్ నగర్, రాజ్ కోట్-వెరివల్ ప్యాసింజర్లలో ఈ స్కీమ్ ను అమలు చేస్తామన్నారు. రైల్వే శాఖలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ స్కీమ్ ను అమలు చేయాలనుకుంటున్నామన్నారు. తత్కాల్ ఛార్జీలను సెకెండ్ క్లాస్ బేసిక్ చార్జీపై 10 శాతం, ఇతర క్లాస్ టికెట్ ధరపై 30 శాతం ఉందని.. సెకండ్ క్లాస్ సిట్టింగ్ పై 10 నుంచి 15 రూపాయలు తత్కాల్ చార్జీలను వసూలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement