-
ఆర్చర్లు అద్భుతం చేసేనా?
టోక్యో ఒలింపిక్స్ క్రీడల మూడో రోజు తొమ్మిది క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే మూడింటిలో (ఆర్చరీ, షూటింగ్, ఫెన్సింగ్) మాత్రమే మనోళ్లు పతకాల కోసం పోటీపడనున్నారు. పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ రాయ్లతో కూడిన భారత బృందం తొలి రౌండ్లో కజకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంటుంది. 1988 సియోల్ ఒలింపిక్స్లో తొలిసారి టీమ్ ఈవెంట్ మొదలయ్యాక దక్షిణ కొరియా పురుషుల జట్టు ఐదుసార్లు స్వర్ణ పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కొరియాపై భారత్ అద్భుతం చేస్తే సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకం రేసులో నిలుస్తుంది. పురుషుల టీమ్ విభాగం తొలి రౌండ్: భారత్ x కజకిస్తాన్ (ఉదయం గం. 6 నుంచి) -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు ‘టోక్యో’ బెర్త్
ఎస్–హెర్టోగెన్బాష్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా భారత పురుషుల రికర్వ్ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. తరుణ్దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్లతో కూడిన భారత బృందం ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–3తో కెనడా జట్టును ఓడించింది. మరోవైపు దీపిక, బొంబేలా దేవి, కోమలికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–6తో బెలారస్ చేతిలో ఓడింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
‘పసిడి’ రేసులో భారత జట్లు
ప్రపంచకప్ ఆర్చరీ వ్రోక్లా (పోలండ్): వ్యక్తిగత విభాగాలలో అంతగా ఆకట్టుకోలేకపోయినా... టీమ్ ఈవెంట్స్లో భారత ఆర్చరీ జట్లు అలరించాయి. ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నమెంట్లో పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన టీమ్ ఎలిమినేషన్ రౌండ్స్లో భారత జట్లు నిలకడగా రాణించాయి. అతాను దాస్, తరుణ్దీప్ రాయ్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో 5-4 (55-57, 57-55, 53-54, 57-52; టైబ్రేక్ 29-27) స్కోరుతో చైనాను ఓడించింది. సెట్ గెలిచిన వారికి రెండు పాయింట్లు లభిస్తాయి. నిర్ణీత నాలుగు రౌండ్ల తర్వాత రెండు జట్లు 4-4 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి టైబ్రేక్ను నిర్వహించగా... భారత బృందం పైచేయి సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికోతో టీమిండియా తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో భారత్ 5-1తో స్పెయిన్పై; క్వార్టర్ ఫైనల్లో 5-4తో నెదర్లాండ్స్పై నెగ్గింది. మరోవైపు మహిళల విభాగంలో దీపిక కుమారి, లక్ష్మీరాణి, బొంబేలా దేవిలతో కూడిన భారత బృందం సెమీఫైనల్లో 6-2 (51-50, 56-48, 52-54, 54-53) స్కోరుతో జార్జియాపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికోతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో టీమిండియా 6-0తో పోలండ్పై; క్వార్టర్ ఫైనల్లో 5-4తో ఉక్రెయిన్పై గెలిచింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement