breaking news
Syko
-
అమ్మవారి ఎదుట ఆత్మహత్యాయత్నం
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ఓ సైకో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు అమ్మవారి ఎదుట కత్తితో చేయి, గొంతు కోసుకున్నాడు. అమ్మవారి అభిషేకం అనంతరం అలంకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్కు చెందిన ప్రసాద్గౌడ్.. ఆలయ ప్రాంగణంలోని తూర్పు ద్వారం వద్ద స్వీపర్ సుశీల శుభ్రపరుస్తుండగా ఆమెను పక్కకు నెట్టి లోపలికి ప్రవేశించాడు. గుడి లోపలికి చొరబడి వెంట తెచ్చుకున్న కత్తితో పూజారులు చంద్రకాంత్, బాలకృష్ణలను బెదిరించాడు. దీంతో వారు భయపడి బయటికి పరుగులు తీశారు. ఆలయ సిబ్బంది ప్రసాద్గౌడ్ను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, కత్తితో చేయి, గొంతు కోసుకున్నాడు. వెంటనే సిబ్బంది అతడిని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రసాద్కు ఉద్యోగం రాకపోవడం, పెళ్లి కాకపోవడంతో సైకోగా మారాడని తెలిసింది. గతేడాది ఇలాగే ఇదే ఆలయంలో చొరబడి అమ్మవారి ఎదుట బ్లేడ్తో గొంతు, చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
విజయవాడలో సైకో హాల్చల్
-
సైకో సూదిగాడి ఊహాచిత్రం విడుదల
-
ముగ్గురిపై గొడ్డలితో దాడి చేసిన సైకో
ఒంగోలు(ప్రకాశం): ప్రకాశం జిల్లాలోని కంభం మండలం ఎర్రబాలెంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ముగ్గురిపై విచక్షణ రహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. సైకో దాడితో గ్రామస్తులు భయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. సైకో బారినుంచి తమను రక్షించాలంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అందరినీ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. సైకో ఉనికి ఏమాత్రం తెలిసినా తమకు సమాచారం అందించాలని సూచించారు. కాగా, సైకో కోసం గాలిస్తున్నామని సైకోను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.