Strength and conditioning coach
-
Karimnagar: అగ్రహారం నుంచి బీసీసీఐ దాకా!
క్రికెటర్గా ఎదగడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల్లో చాలా మందికి ఈ కల అందని ద్రాక్ష లాంటిదే. రంజిత్ విషయంలోనూ ఇదే జరిగింది. క్రికెటర్ కావాలన్న ఆశయానికి మధ్యలోనే గండిపడింది. కారణాలు ఏవైనా.. ప్రతిభ ఉన్నా సరే అతడు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు.అయినప్పటికీ క్రికెట్పై ప్రేమను వదులుకోలేకపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సలహా అతడికి కొత్త దారి చూపించింది. ఆట, ఆటగాళ్లతో మమేకమయ్యే వీలు కల్పించింది. హైదరాబాద్ మేటి క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు.. అమన్ రావు వంటి వర్ధమాన క్రికెటర్లకు ఫిట్నెస్ మెళకువలు నేర్పే స్థాయికి చేర్చింది.తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని అగ్రహారం రంజిత్ కుమార్ స్వస్థలం. తల్లిదండ్రులు ఏనుగుల బీరయ్య, ఏనుగుల భాగ్య. వారిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉపాధి నిమిత్తం రంజిత్ తండ్రి హైదరాబాద్కు వలస వచ్చారు. ఓవైపు చదువుకుంటూనే క్రికెట్పై మక్కువ పెంచుకున్న రంజిత్.. తండ్రికి మనసులోని మాట చెప్పాడు.ఎంబీఏ చదివాడుఆర్థికంగా కష్టంగా ఉన్నా కుమారుడి ఆశయానికి ఆయన అడ్డుచెప్పలేదు. జూనియర్ లెవల్లో హైదరాబాద్ తరఫున కొడుకు సత్తా చాటుతుంటే మురిసిపోయారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.. ప్రతిభ ఉన్నా కొన్ని అనుకోని అడ్డంకుల వల్ల క్రికెటర్ కావాలన్న రంజిత్ కల ముగిసిపోయింది.ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టిన రంజిత్.. ఎంబీఏ పూర్తి చేశాడు. అయితే, భవిష్యత్తుపై అప్పుడు అతడికి ఎలాంటి స్పష్టతా లేదు. మనసంతా క్రికెట్ మీదే ఉంది. ఆ సమయంలోనే స్నేహితుడొకరు ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి రంజిత్కు చెప్పాడు. అసలు తనకు ఏమాత్రం అవగాహన లేని రంగంలోకి వెళ్లడం సరైందేనా అని అతడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు.అవగాహన లేని రంగంలోకి వెళ్లి.. సక్సెస్ఏం జరిగినా మన మంచికే అనుకుని రంగంలోకి దిగాడు. కొన్నాళ్లపాటు దారీతెన్నూ లేకుండా రంజిత్ ప్రయాణం సాగింది. అయితే, కఠిన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందంటారు. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న రంజిత్.. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎదిగాడు.ఆటగాళ్ల జీవితంలో అత్యంత కీలక పాత్ర స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్దేనన్న సంగతి తెలిసిందే. ప్లేయర్ల ఫిట్నెస్, బలం, వేగం, చురుకుదనాన్ని పెంచడం.. అదే విధంగా గాయాల బారిన పడకుండా వారి ఆట తీరును మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యతలు.తిలక్ వర్మ, సిరాజ్ వంటి ఆటగాళ్లతోఇక ఒక్కో మెట్టు ఎక్కిన రంజిత్ కుమార్.. హైదరాబాద్ సీనియర్ మెన్స్ జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో తిలక్ వర్మ, సిరాజ్ వంటి ఆటగాళ్లతో నిండిన జట్లకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించాడు. బీసీసీఐ-ఎన్సీఏ అక్రిడేషన్ పొందిన రంజిత్ కుమార్.. ప్రస్తుతం పెర్ఫామెన్స్ కోచింగ్లో మాస్టర్స్ చేస్తున్నాడు. ఇటీవలే BCCI COE అండర్-19 బాయ్స్ క్యాంప్నకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎంపికయ్యాడు.చిన్ననాడు కలలు కన్నట్లుగా తానొక స్టార్ క్రికెటర్ కాలేకపోయినా.. ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్ సజావుగా కొనసాగించేందుకు కోచ్గా రంజిత్ తన ప్రతిభను ఉపయోగిస్తున్నాడు. విధి తనకు ఓ దారి మూసివేసినా.. కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో మరో దారిలో తన గమ్యాన్ని చేరుకున్న రంజిత్ కుమార్ యువతకు ఆదర్శం.చదవండి: హార్దిక్ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్గా తొలగింపు? -
బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!
మహిళల సీనియర్ క్రికెట్ జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా (Strength And Conditioning Coach) నియమించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీతో (Nathan Keilty) బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తై కైలీ భారత మహిళా క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎంపికైతే చరిత్ర అవుతుంది. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి ఓ విదేశీ వ్యక్తి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎంపికైనట్లవుతుంది. ఇప్పటివరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి చెందిన వారు మాత్రమే మహిళల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లుగా పనిచేశారు.ప్రస్తుతం భారత మహిళల జట్టుకు అల్ హర్షా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన అద్భుతంగా పనిచేశారు. కానీ త్వరలో అతనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హర్షా స్థానాన్ని కైలీ భర్తీ చేస్తాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి క్లూ ఇచ్చాడు.కాగా, ఇటీవలికాలంలో క్రికెట్ జట్ల సక్సెస్లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ల పాత్ర క్రియాశీలకంగా మారింది. ప్లేయర్లలో శారీరక సామర్థ్యం, ఫిట్నెస్, గాయాల నివారణ, మానసిక స్థైర్యం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. జట్టులో ప్రతి ప్లేయర్కు వీరు వేర్వురుగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. దేశీయ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ల పోలిస్తే విదేశీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లకు పని అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి సేవల కోసం దాదాపుగా అన్ని జట్లు ఎగబడుతుంటాయి. భారత పురుషుల జట్టు ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రూక్స్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నియమించుకుంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్కు బెదిరింపులు -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక నియామకం
త్వరలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక నియామకం జరిగింది. సోహమ్ దేశాయ్ స్థానంలో టీమిండియా నూతన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా సౌతాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రౌక్స్ నియమితుడయ్యాడు. అడ్రియన్ గతంలో (2002 జనవరి-2003 మే) కూడా భారత జట్టుకు సేవలందించాడు. అడ్రియన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించాడు. క్రికెటేతర ట్రైనింగ్ ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను పెంపొందించడమే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ విధి. ఈ విధిలో అడ్రియన్ నిష్ణాతుడు. క్వాలిఫైడ్ స్పోర్ట్స్ సైంటిస్ట్గా అడ్రియన్కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అడ్రియన్.. ప్రస్తుతం లార్డ్స్లో ఉన్న టీమిండియాతో జతకట్టాడని బీసీసీఐ ఓ వీడియో ద్వారా తెలియజేసింది. అడ్రియన్ పర్యవేక్షణలో టీమిండియా అత్యంత కఠినమైన హై ఇంటెన్సిటి ట్రైనింగ్ తీసుకుంటుంది.2002 నాట్వెస్ట్ ట్రోఫీలో టీమిండియా విజయంలో అడ్రియన్ కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత అతను 2003-2007 వరకు సౌతాఫ్రికా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా పని చేశాడు. అడ్రియన్ ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2019 వరకు కేకేఆర్తో.. ఆతర్వాత పంజాబ్తో పని చేశాడు. అడ్రియన్ 22 ఏళ్ల విరామం తర్వాత కీలకమైన ఇంగ్లండ్ సిరీస్కు ముందు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు.ఇదిలా ఉంటే, జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత ఇదివరకే లండన్లో ల్యాండైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్కు ముందే గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
తప్పుకున్న భారత జట్టు ట్రైనర్!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న శంకర్ బసు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. చెన్నై టెస్టు ముగిసిన తర్వాత ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బీసీసీఐకి లేఖ పంపించారు. గత ఏడాది శ్రీలంకతో సిరీస్కు ముందు జట్టుతో చేరిన బసు కారణంగానే ఇటీవల ఆటగాళ్ల ఫిట్నెస్ అద్భుతంగా మెరుగుపడింది. తమలో మార్పుకు బసునే కారణమంటూ కెప్టెన్ కోహ్లి కూడా తరచుగా ప్రశంసించాడు. అయితే జట్టులో కొంత మంది ఆటగాళ్లు గాయాలపాలు కావడానికి అదే కారణమని విని పించింది. తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా బసు ట్రైనింగ్ చేయించారంటూ కొందరు ఆటగాళ్లు బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శంకర్ బసు రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదంచలేదు.


