breaking news
stashed
-
మూలుగుతున్న గూడేలు..
జ్వరాలతో విలవిలలాడుతున్న ఏజెన్సీ రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య డాక్టర్ల కొరత.. అంతంతమాత్రంగానే మందులు స్థానికంగా ఉండని వైద్యులు.. గిరిజనుల అవస్థలు జిల్లాలోని పలు పీహెచ్సీలను పరిశీలించిన ‘సాక్షి’ విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. ప్రబలుతున్న జ్వరాలు.. గిరిజన గూడేలు.. పల్లెల్లో ఎక్కడ చూసినా మంచంపట్టిన ఆదివాసీలు.. మలేరియా, టైఫాయిడ్, ఇతర జ్వరాలతో మూలుగుతున్నారు.. చికిత్స కోసం పీహెచ్సీలకు వెళ్తున్నా.. అందుబాటులో డాక్టర్లు లేక.. ఉన్నా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో సకాలంలో వైద్యం అందని పరిస్థితి.. ముక్కుతూ మూలుగుతూ ఆస్పత్రుల ఎదుట బారులుదీరుతూ వైద్యం కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందడం లేదు. మంగళవారం జిల్లావ్యాప్తంగా పలు పీహెచ్సీలను ‘సాక్షి’ పరిశీలించగా.. రోగుల ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం జిల్లావ్యాప్తంగా 14 క్లస్టర్ల పరిధిలో 57 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీలు) ఉన్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 2,760 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు 1,422, కాంట్రాక్టు ప్రాతిపదికన 678 మంది పనిచేస్తుండగా.. 659 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ సర్జన్లు 6, ఎస్పీహెచ్ఓలు 7, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు 18, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్లు 61, సెకండ్ ఏఎన్ఎంలు 104, హెల్త్ అసిస్టెంట్లు(మహిళలు) 81, పురుషులు 167, డ్రైవర్లు 17, ఫీల్డ్ వర్కర్లు 27, ఆఫీస్ సబార్డినేట్లు 13.. ఇలా సుమారు 50 రకాల పోస్టులకు మొత్తం 659 భర్తీ చేయాల్సి ఉంది. వర్షాకాలం కావడంతో సాధారణంగా ప్రతి ఏటా ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తాయి. మలేరియా, టైఫాయిడ్ వస్తే.. చికిత్స అత్యవసరంగా చేయించుకోవాల్సిందే. అయితే డాక్టర్ పోస్టులు పీహెచ్సీల్లో ఖాళీగా ఉండటంతో.. అక్కడికి వెళ్లిన రోగులకు వెంటనే వైద్యం అందని పరిస్థితి నెలకొంది. అంతేకాక విషజ్వరాలకు సరైన మందులు కూడా పీహెచ్సీలలో ఉండటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలో అలసత్వం ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ వైద్యంపై అలసత్వం నెలకొంది. ఇక్కడ విషజ్వరాలు వస్తే ఆదివాసీలు, గిరిజనులకు పీహెచ్సీలే దిక్కు. కానీ.. డాక్టర్లు స్థానికంగా ఉండకుండా భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం నుంచి కూడా రాకపోకలు చేస్తుండటంతో సకాలంలో విధులకు హాజరుకావడం లేదు. స్థానికంగా ఉండే స్టాఫ్నర్సులు, అటెండర్లు, వాచ్మన్లే రోగులకు తోచిన వైద్యం చేసి పంపిస్తున్నారు. వందల సంఖ్యలో ఓపీ వస్తున్నా.. పట్టనట్లుగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. అంతేకాక వైద్యం కోసం పీహెచ్సీలో చేరే రోగులకు వసతులు కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లెందు మండలం కొమురారం పీహెచ్సీలో బల్లాలపై పరుపులు లేకపోవడం దీనికి నిదర్శనం. పరుపులున్న చోట చిరిగిపోయి.. దుర్వాసన వెదజల్లుతోంది. మణుగూరు మండలం మొత్తానికి ఒకే పీహెచ్సీ ఉంది. రోజుకు 200 మంది వరకు ఓపీ వస్తుండగా.. కేవలం ఒక్కరే వైద్యుడున్నారు. గుండాల మండలంలో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాగులు, వంకలు పొంగుతుండటంతో జ్వరం వస్తే గూడేల్లోనే మగ్గిపోవాల్సి వస్తోంది. వైద్యం కోసం వాగులు దాటి పీహెచ్సీకి వెళ్లినా మందులు లేక.. సరైన వైద్యం అందడం లేదు. 504 మలేరియా కేసులు జిల్లాలో వందల సంఖ్యలో మలేరియా కేసులు ప్రతి వారం నమోదవుతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్కువగా చూపుతున్నారు. ఇప్పటివరకు 504 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. గత ఏడాది 439 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఏటా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నా.. లెక్కల్లో మాత్రం అధికారులు తక్కువగా చూపుతుండటం గమనార్హం. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేసే పరికరాలు చాలా పీహెచ్సీల్లో లేకపోవడంతో నామమాత్రపు సంఖ్యలో నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీహెచ్సీలకు వచ్చే రోగులకు మొదటి విడత పారాసిటమాల్ తదితర ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. అయితే జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో మళ్లీ మళ్లీ పీహెచ్సీలకు వెళ్తున్నారు. ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. విషజ్వరాల కేసుల నమోదు ఇలా.. మలేరియా 504 డెంగీ 18 -
ఆదేశం.. భారత్ ను మించిపోయింది!
న్యూఢిల్లీః ప్రతివిషయంలో భారత్ తో పోల్చుకొని, అన్నింటా తానే ముందుండాలని ప్రయత్నించే పాకిస్తాన్.. నల్లడబ్బు విషయంలో ఇండియాను మించిపోయిందట. స్విస్ బ్యాంకుల్లో పదివేల కోట్ల వరకూ ఆదేశం నల్లధనం దాచినట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ నల్లధనం దాచడంలో ముందు స్థానంలో ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 లెక్కలతో పోలిస్తే పాకిస్తాన్ స్విస్ బ్యాంకుల్లో దాచిన బ్లాక్ మనీ 16 శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదికల్లో వెల్లడించింది. పాకిస్తాన్ నల్లధనం విలువ పెరగడం వరుసగా ఇది రెండోసారని నివేదికలో తెలిపింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ ఎన్ బి) వెల్లడించిన వివరాలను బట్టి, 2014 లో పాకిస్తాన్ కరెన్సీ సీహెచ్ఎఫ్ 1,301 మిలియన్లుగా ఉన్న నల్లధనం, 2015 పూర్తయ్యేనాటికి 16 శాతం పెరిగి సిహెచ్ ఎఫ్ 1,513 మిలియన్లకు చేరినట్లు తెలిపింది. అయితే భారత్ విషయంలో ఆ విలువలు 33 శాతం పడిపోయి, 2015 చివరికి రూ. 8,392 కోట్ల రూపాయలకు చేరినట్లు ఎస్ ఎన్ బి వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. -
బక్కెట్లకొద్దీ డబ్బు దొరికింది!
ఫ్లోరిడాలో పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. ఓ ఇంట్లో భద్రంగా దాచిన 24 బక్కెట్లలో కోట్ల కొద్దీ డబ్బు కనిపించడంతో షాక్ అయ్యారు. అక్రమ వ్యాపారం నిర్వహించగా వచ్చిన డబ్బును మియామీ ప్రాంతంలోని ఓ వ్యాపారి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన వార్త.. ఇప్పుడక్కడ పెద్ద సంచలనంగా మారింది. అటకమీద ఎవ్వరికీ కనిపించకుండా దాచిన బక్కెట్లనిండా డబ్బుతోపాటు, కొన్ని డ్రగ్స్, ఓ గన్ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికా ఫ్లోరిడాలోని మియామీలోని ఓ ఇంట్లో తన అక్రమ వ్యాపారంతో సంపాదించిన డబ్బును సదరు వ్యాపారి బక్కెట్లలో భద్రంగా దాచుకున్నాడు. ఇంటి అటకమీద 24 బక్కెట్లలో దాచిపెట్టిన 163 కోట్ల రూపాయలను (సుమారు 20 మిలియన్ డాలర్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొమ్ముతోపాటు, అత్యంత ఖరీదైన తుపాకీ, కొన్ని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్న మియామీ పోలీసులు.. వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. 44 ఏళ్ళ లూయిస్ హెర్నాండెజ్ గాంజలెజ్, ఆయన సోదరి 32 ఏళ్ళ సల్మా గాంజలెజ్ లను అక్రమ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేసులో అరెస్టు చేశారు. గార్డెన్ సామాన్లు అమ్మే బిజినెస్ నిర్వహిస్తున్న నిందితులు, అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం కూడ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. వారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లోని అటకపై భద్రంగా దాచిపెట్టిన బక్కెట్ల కొద్దీ డబ్బును, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిద్దరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెర్చ్ వారెంట్ తో నిందితుల ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు అటకపై ఉన్న బక్కెట్లు చూసి షాకయ్యారు. వాటితోపాటు ఎనబాలిక్ స్టెరాయిడ్లు, టీఈసీ-9 పిస్టల్ కనిపించడంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. వెంటనే అలర్టయిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.