breaking news
special increments
-
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తమ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక పెంపుతో 56 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇంద్ర బస్సుల పేర్లను రాజధానిగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ ఇంక్రిమెంట్లు ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
‘సాగర్’ ఉద్యోగులకు అందని వేతనాలు
నాగార్జునసాగర్ :ఉద్యోగులంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రత్యేక ఇంక్రిమెంట్ ఆనందోత్సవాల్లో మునిగి తేలుతుండగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మాత్రం ఆ సంబరాల జాడ కనిపించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మూడు నెలలుగా వేతనాలు అందకపోవడం, ఇప్పటికీ తాము ఎక్కడ విధులు నిర్వహించాలన్న స్పష్టత ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని తెలంగాణ సర్కార్ను కోరుతున్నారు. బదిలీల రద్దు కోసం పోరాటం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో గేట్స్ మెయింటెనెన్స్, వాటర్ వర్క్స్, బిల్డింగ్స్ అండ్ రోడ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో 86 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలోని లింగంగుంట్ల సర్కిల్కు బదిలీ చేశారు. తామంతా తెలంగాణ ప్రాంతవారమని, కావాలనే సీమాంధ్రకు చెందిన ఉన్నతాధికారులు తమను ఆంధ్రాకు బదిలీ చేశారని, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు వెళ్లేది లేదని పేర్కొంటూ 20 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సమస్యలను తెలంగాణ సర్కార్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు ప్రాజెక్టు ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తప్పును సరిదిద్దాలని ఆదేశించారు. ఈ ప్రాంత ఉద్యోగులందరికీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు రద్దయ్యాయి. రూ.50లక్షల మేర బకాయిలు.. ప్రాజెక్టు పరిధిలో 86మంది పనిచేస్తుండగా వీరిలో 20 మంది ఉద్యోగులు ఇటీవల ఆంధ్రప్రదేశ్కు వెళ్లి విధుల్లో చేరారు. కాగా ఉద్యోగుల బదిలీ, ఆందోళన నేపథ్యంలో జూన్ నుంచి వేతనాలు నిలిచిపోయాయి. సుమారు రూ.50లక్షల మేర వేతనాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం బదిలీలు రద్దు కావడంతో ఇక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణ ఉద్యోగులుగా పరిగణించి వెంటనే వేతనాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైల్ శనివారం రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగానికి చేరినట్లు సమాచారం. ఆంధ్రా అధికారుల ఒత్తిడితోనే... ఆంధ్రా అధికారులు స్వార్థంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టు కార్యాలయాన్ని రైట్బ్యాం కు తరలించారు. సిబ్బంది మాత్రం ఇక్కడే విధులు నిర్వహించారు. కార్యాలయం ఒక్కటి అక్కడ ఉండడంతో సబ్డివిజన్ మొత్తాన్ని ఆంధ్రాకు బదలాయించారు. - కనకయ్య, ఏఐటీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవగాహన రాహిత్యంతో ఇబ్బందులు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ అవగాహన రాహిత్యంతో సాగర్ సబ్డివిజన్ను ఆంధ్రప్రదేశ్లోని లింగంగుంట్లకు తరలించారు. అధికారులు చేసిన తప్పిదానికి 86 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. త్వరలో వేతనాలు అందేలా కృషిచేస్తున్నాం. - రామ్మోహన్, డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోసం అవతగమైంది... సబ్ డివిజన్ను ఆంధ్రాకు తరలించి కుడి కాల్వ వెంట ఉన్న గేట్లను మరమ్మతులు చేయించడానికి ఆంధ్రా ఇంజినీర్లు ప్రణాళిక వేశారు. మేము అక్కడకు పోకముందే మరమ్మతుల కు ఆర్డర్లు తయారు చేశారు. వారి మోసం అవగతమైంది. అందుకే మేము అక్కడికి వెళ్లలేదు. - రాజు, వర్క్చార్జ్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు -
పోలీసులకు ప్రత్యేక ఇంక్రిమెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల్లో ఆందోళనల సందర్భంగా పని ఒత్తిడి ఎదుర్కొన్న పోలీసు సిబ్బందికి ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చినట్లు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు తెలిపారు. ఈ డిమాండ్పై శనివారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించగా తగిన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్ఐలకు గెజిటెడ్ హోదా, ప్రతి కానిస్టేబుల్కూ ఇంటి స్థలం, బస్పాస్ ఇవ్వాలని కూడా సీఎంను కోరామన్నారు. సీఎంను కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి, గౌరవాధ్యక్షుడు రాధాకృష్ణ, గౌరవ సలహాదారు జి.ఎస్. రాజు, సీనియర్ ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.