-
ఢిల్లీలో లిక్కర్పై 70% స్పెషల్ కరోనా ఫీజు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్ బాటిల్స్పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం. లాక్డౌన్ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుంది. -
ఆర్టీసీ పండుగ బాదుడు
సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునే సన్నాహాల్లో సంస్థ హైదరాబాద్ నుంచి 100 ప్రత్యేక బస్సులు తిరుగు ప్రయాణానికి విశాఖ నుంచి 45 బస్సులు ఇతర ప్రాంతాలకూ అదనపు బస్సులు వీటిన్నింటిలో 50 శాతం అదనపు చార్జీలు విశాఖపట్నం : సందట్లో సడేమియా అన్నట్లు ఆర్టీసీ సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల అవసరాలను గుర్తించి, రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామంటూనే.. పనిలో పనిగా ప్రత్యేక సర్వీసులకు ప్రత్యేక చార్జీల పేరుతో దండుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. పండుగ సీజన్లో సహజంగానే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దూరతీరాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు రావడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లన్నింటిలో రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. ప్రత్యేక రైళ్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి బస్సులే శరణ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని వందలాది ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సుధేశ్కుమార్ తెలిపారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా నడిపే ఈ ప్రత్యేక సర్వీసుల్లో చార్జీలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో వసూలు చేసే చార్జీలపై 50 శాతం ఎక్కువగా ఈ చార్జీలు ఉంటాయని వివరించారు. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో విశాఖ, తదితర ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలివచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-విశాఖ మధ్య సుమారు 100 బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ బస్సులు జనవరి 8 నుంచి 14వ తేదీ వరకు హైదారబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతాయి. అలాగే సంక్రాంతి పండుగ అనంతరం విశాఖ నుంచి హైదారబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం 45 బస్సులు, విజయవాడకు 50, కాకినాడకు 20, రాజమండ్రికి 30 బస్సులు నడుపుతారు. బెంగుళూరు, చెన్నై తదితర రాష్ట్రేతర ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా ఒక్కో బస్సు అదనంగా వేస్తారు. ఈ బస్సులన్నీ జనవరి 16, 17, 18, 19 తేదీల్లో విశాఖ నగరంలోని ద్వారకా బస్స్టేషన్ నుంచే బయలుదేరుతాయి. రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. జనవరి ప్రారంభం నుంచి లభించే ఈ సౌకర్యాన్ని ఠీఠీఠీ.్చఞటట్టఛి ౌజీౌ.జీ ద్వారా పొందవచ్చు. అలాగే ద్వారకా బస్స్టేషన్ వద్ద, ఇతర అధీకృత ఏజెంట్ల వద్ద కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆర్ఎం సుధేశ్కుమార్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement