-
రన్నరప్ సిరిల్ వర్మ
మాల్దీవ్స్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ షట్లర్ సిరిల్ వర్మ రన్నరప్గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో అతను 13–21, 18–21తో భారత్కే చెందిన కౌశల్ ధర్మామర్ చేతిలో వరుస గేముల్లో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. డబుల్స్ అన్ని విభాగాల్లో ఫైనల్కు చేరిన భారత షట్లర్లు... చివరి అడ్డంకిని మాత్రం దాటలేకపోయారు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి జోడి 10–21, 21–17, 12–21 సయక హొబర– నత్సుకి సోనె (జపాన్) జంట చేతిలో, పురుషుల డబుల్స్లో అరుణ్ జార్జ్– సన్యం శుక్లా జంట 9–21, 20–22తో కిచిరో ముత్సుయ్– యొషినోరి తకెచి (జపాన్) ద్వయం చేతిలో, మిక్స్డ్ డబుల్స్లో సాయి ప్రతీక్ కృష్ణ ప్రసాద్– అశ్విని భట్ జోడీ 11–21, 15–21తో చరోంకితమరోన్– చసినీ కొరెపాప్ (తైవాన్) జంట జోతిలో ఓడి రన్నరప్గా నిలిచారు. -
సిరిల్ వర్మకు సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు సిరిల్ వర్మ సత్తా చాటాడు. కేరళలోని కోజికోడ్లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో సిరిల్ వర్మ విజేతగా నిలిచి టైటిల్ను హస్తగతం చేసుకున్నాడు. ఫైనల్లో పదమూడో సీడ్ సిరిల్ వర్మ 21–17, 13–21, 21–8తో కిరణ్ జార్జ్ (కేరళ)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో మాల్విక బన్సోద్ (ఏఏఐ) చాంపియన్గా నిలిచింది. మరోవైపు డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు పొదిలే శ్రీకృష్ణ సాయికుమార్కు నిరాశ ఎదురైంది. పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరిన శ్రీకృష్ణ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఏపీ) ద్వయం 20–22, 5–14తో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రోహన్ కపూర్ (ఎయిరిండియా)–రుతుపర్ణ పండా (ఒడిశా) జంట 21–19, 21–14తో శ్రీకృష్ణ సాయికుమార్–కనిక కన్వల్ (రైల్వేస్) జోడీపై గెలుపొంది చాంపియన్గా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా (ఆర్బీఐ)–రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 21–18, 21–13తో టాప్ సీడ్ అపర్ణ బాలన్ (పెట్రోలియం)–ప్రజక్తా సావంత్ (ఎయిరిండియా) జోడీకి షాకిచ్చింది. -
క్వార్టర్స్లో రాహుల్, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ ముందంజ వేశారు. కేరళలోని కోజికోడ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ రాహుల్ యాదవ్ 21–14, 21–9తో మునావర్ మొహమ్మద్ (కేరళ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్లో పదమూడో సీడ్ సిరిల్ వర్మ (తెలంగాణ) 21–13, 21–15తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై నెగ్గాడు. ఏపీ ప్లేయర్ జశ్వంత్ 23–21, 13–21, 9–21తో మిథున్ (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్లో ఏపీ క్రీడాకారిణి నిషిత వర్మ, తెలంగాణ ప్లేయర్ కేయూర మోపాటి ప్రిక్వార్టర్స్లో ఓడిపోయారు. నిషిత వర్మ 16–21, 12–21తో నమిత పథానియా (ఢిల్లీ) చేతిలో, కేయూర (తెలంగాణ) 21–19, 14–21, 10–21తో ఎనిమిదో సీడ్ ఐరా శర్మ (హరియాణా) ఓడింది. పురుషుల డబుల్స్లో శ్రీకృష్ణ సాయి కుమార్ జంట క్వార్టర్స్కు చేరుకోగా... కృష్ణ ప్రసాద్ జోడీ రెండో రౌండ్లో అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఏపీ) జంట 21–8, 21–13తో మధుసూదన్ (కర్ణాటక)–సంజీత్ (రైల్వేస్) జోడీపై గెలుపొందింది. రెండోసీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 21–16, 21–11తో అక్షయ్–అనిరుద్ధ మయేకర్ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్లో శ్రీకృష్ణ–కనిక కన్వల్ జోడీ, హేమనాగేంద్ర బాబు–శ్రీవిద్య గురజాడ జంటలు క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ప్రిక్వార్టర్స్లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–కనిక కన్వల్ (రైల్వేస్) జంట 21–17, 22–24, 21–17తో టాప్ సీడ్ గౌస్ షేక్ (ఏపీ)–మనీషా (ఆర్బీఐ) జోడీకి షాకిచ్చింది. మరో మ్యాచ్లో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్)–శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) జంట 16–21, 21–6, 21–19తో ప్రతీక్ రనడే–అక్షయ వరంగ్ (మహారాష్ట్ర) జోడీపై నెగ్గింది. -
మెయిన్ ‘డ్రా’కు సిరిల్
లక్నో: సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్ –300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ పురుషుల సింగిల్స్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో సిరిల్ వర్మ 24–22, 21–18తో చిరాగ్ సేన్ (భారత్)పై, 21–16, 21–13తో కెవిన్ అల్టర్ (భారత్)పై విజయం సాధించాడు. సిరిల్తోపాటు భారత్కే చెందిన హర్షీల్ డాని కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మహిళల సింగిల్స్లో తెలుగమ్మాయి మామిళ్లపల్లి తనిష్క్తోపాటు రితిక, శ్రుతి ముందాడ, అమోలిక సింగ్ సిసోడియా కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్)తో చుక్కా సాయి ఉత్తేజిత రావు; రసిక రాజేతో తనిష్క్; యిమాన్ జాంగ్ (చైనా)తో గుమ్మడి వృశాలి; ప్రాషి జోషితో శ్రీకృష్ణప్రియ; శ్రుతితో ఐరా శర్మ; కేట్ ఫూ కునె (మారిషస్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో సమీర్ వర్మ (భారత్)తో సిరిల్ వర్మ; తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్లాండ్)తో పారుపల్లి కశ్యప్; మిలాన్ లుడిక్ (చెక్ రిపబ్లిక్)తో రాహుల్ యాదవ్; సెర్గీ సిరాంట్ (రష్యా)తో సాయిప్రణీత్; పెర్సన్ (జర్మనీ)తో గురుసాయిదత్ ఆడతారు. -
విజేతలు సిరిల్వర్మ, అభిలాష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సిరిల్వర్మ (మెదక్), ఎ. అభిలాష (హైదరాబాద్) సత్తా చాటారు. కోదాడలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండోసీడ్ సిరిల్ వర్మ 21–17, 21–16తో టాప్సీడ్ సి. రాహుల్ యాదవ్ (హైదరాబాద్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్సీడ్గా బరిలోకి దిగిన అభిలాష ఫైనల్లో 21–18, 21–17తో మూడోసీడ్ కె. వైష్ణవిని ఓడించి తన స్థాయిని ప్రదర్శించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సృష్టి జూపూడి మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్సీడ్ సాహితి బండి (మెదక్)– సృష్టి జంట 21–12, 21–11తో శ్రీవిద్య– వై. సాయిప్రియ (మెదక్) జోడీపై... మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో టాప్సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– సృష్టి ద్వయం 21–18, 21–18తో మూడో సీడ్ బి. నవనీత్– సాహితి (మెదక్) జోడీపై విజయం సాధించాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండోసీడ్ బి. నవనీత్ (మెదక్)– సిద్ధార్థ్ (రంగారెడ్డి) జంట 21–11, 16–21, 24–22తో టాప్సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– పి. విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) జోడీకి షాకిచ్చింది. 65 ఏళ్ల కేటగిరీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో పి. రాయలింగు (ఆదిలాబాద్) 21–5, 21–16తో దస్తగిరి (నల్లగొండ)పై, 70 ఏళ్ల పురుషుల సింగిల్స్ తుదిపోరులో వీవీఆర్ రావు (మెదక్) 21–6, 17–21, 21–17తో సి. విజయ్ కుమార్ (హైదరాబాద్)పై విజయం సాధించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement