breaking news
Sidra Amin
-
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. సరికొత్త వరల్డ్ రికార్డు
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అలనా కింగ్ (Alana King) సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల వన్డే క్రికెట్లో పదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అర్ధ శతకం సాధించిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC World Cup)లో భాగంగా కొలంబోలో పాకిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా అలనా కింగ్ ఈ ఫీట్ నమోదు చేసింది.చాంపియన్లకు తిరుగు ఉంటుందా?క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం బెదరకుండా ఎలా నిలవాలో... ప్రత్యర్థులు పరీక్ష పెడుతున్నా నమ్మకం కోల్పోకుండా ఎలా పోరాడాలో... ఓటమి మేఘాలు కమ్ముకున్నప్పుడు వెలుగుల బాట ఎలా వేసుకోవాలో... ఆస్ట్రేలియా క్రికెట్ జట్లకు బాగా తెలుసని మరోసారి నిరూపితమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్తో పోరులో ప్రతికూల పరిస్థితులను తిప్పికొడుతూ ఆసీస్ ఘనవిజయం సాధించింది.మూనీ సూపర్ సెంచరీ.. అలనా మెరుపు అర్ధ శతకం‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (Beth Mooney- 114 బంతుల్లో 109; 11 ఫోర్లు) ఆణిముత్యం అనదగ్గ సెంచరీతో కదంతొక్కడంతో... బుధవారం జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 107 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఆసీస్ ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకటి వర్షం కారణంగా రద్దుకాగా... మిగిలిన రెండిట్లో గెలిచి 5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.బెత్ మూనీ అసాధారణ ఇన్నింగ్స్కు టెయిలెండర్ అలానా కింగ్ (49 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు హాఫ్సెంచరీ తోడవడంతో ఆసీస్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఒకదశలో 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్ను మూనీ ఆదుకుంది. కిమ్గార్త్ (11)తో కలిసి ఎనిమిదో వికెట్కు 39 పరుగులు జోడించిన మూనీ... తొమ్మిదో వికెట్కు అలానాతో 106 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 77 పరుగులతో కిమ్ గార్త్– ఆష్లే గార్డ్నర్ జోడీ పేరిట ఉన్న రికార్డును మూనీ–కింగ్ జంట సవరించింది.చిత్తుగా ఓడిన పాక్పాకిస్తాన్ బౌలర్లు బంతిబంతికి పరీక్ష పెడుతున్నా... ఏమాత్రం వెరవకుండా పోరాటం కొనసాగించింది. క్రీజులో కుదురుకున్నాక కింగ్ భారీ షాట్లతో సహచరిపై ఒత్తిడి తగ్గించింది. కెప్టెన్ అలీసా హీలీ (20), లిచ్ఫీల్డ్ (10), ఎలీస్ పెర్రీ (5), అనాబెల్ (1), యాష్లే గార్డ్నర్ (1), తహిలా మెక్గ్రాత్ (5) విఫలమయ్యారు.ఇక వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న మూనీ ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటైంది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఫాతిమా సనా, రమీన్ షమీమ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 36.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. సిద్రా అమీన్ (52 బంతుల్లో 35; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ ఫాతిమా సనా (11), సదాఫ్ (5), మునీబా అలీ (3), సిద్రా నవాజ్ (5), నటాలియా పర్వేజ్ (1), ఐమన్ ఫాతిమా (0) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కిమ్ గార్త్ 3... మేగన్ షుట్, అనాబెల్ సదర్లాండ్ చెరో 2 వికెట్లు తీశారు.అలనా కింగ్ అరుదైన ఘనతపాక్తో మ్యాచ్లో 49 బంతులు ఎదుర్కొన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అలనా కింగ్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. తద్వారా పదో స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన మహిళా ప్లేయర్గా రికార్డు సాధించింది. అంతకు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికాకు చెందిన యులాండి వాన్ డెర్ మెర్వే పేరిట ఉండేది. 2000 సంవత్సరంలో భారత మహిళా జట్టుతో మ్యాచ్ సందర్భంగా యులాండి పదో స్థానంలో వచ్చి 42 పరుగులు చేసింది.చదవండి: టీమిండియాలో దక్కని చోటు.. మహ్మద్ షమీ కీలక నిర్ణయం -
IND vs PAK: పాకిస్తాన్ క్రికెటర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ (Sidra Amin)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. భారత్తో మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెను మందలించింది. అదే విధంగా.. ఓ డీమెరిట్ (Demerit Point) పాయింట్ను కూడా సిద్రా ఖాతాలో జమ చేసింది.అసలేం జరిగిందంటే... ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికైన శ్రీలంకలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదులు భారత్- పాక్ మధ్య ఆదివారం (అక్టోబరు 5) కొలంబో వేదికగా తలపడ్డాయి.భారత్ 247 పరుగులకు ఆలౌట్ఆర్.ప్రేమదాస స్టేడియంలో అనుకోని విధంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (31), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 46 పరుగులతో రాణించింది.మిగతా వారిలో జెమీమా రోడ్రిగెస్ (32), దీప్తి శర్మ (25), రిచా ఘోష్ (35 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ ఫాతిమా సనా షేక్, సైదా ఇక్బాల్ చెరో రెండు, రమీన్ షమీమ్, నష్రా సంధూ ఒక్కో వికెట్ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌలర్ల విజృంభణఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్ షమాస్ (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.సిద్రా ఆమిన్ హాఫ్ సెంచరీఐదో నంబర్లో ఆడిన నటాలియా పర్వేజ్ 33 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ ఒంటరి పోరాటం చేసింది. 106 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. అయితే, పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ ఐదో బంతికి స్నేహ్ రాణా బౌలింగ్లో హర్మన్ప్రీత్కు క్యాచ్ ఇవ్వడంతో సిద్రా ఇన్నింగ్స్కు తెరపడింది.అప్పటికే పాక్ ఓటమి దాదాపు ఖరారు కాగా.. సిద్రా తన బ్యాట్ను నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు శిక్ష విధించింది.అందుకే సిద్రాకు పనిష్మెంట్ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్లో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది.అందుకే ఆమెను మందలించడంతో పాటు.. తన క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పిదం కాబట్టి ఇంతటితో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సద్రా తన తప్పును అంగీకరించింది కావున తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని.. ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.ఆధిపత్యం చాటుకున్న భారత్కాగా సిద్రా అర్ధ శతకం వృథాగా పోయింది. భారత బౌలర్ల ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి పాక్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మరోసారి తమ ఆధిపత్యాన్ని (12-0) చాటుకుంది. పాక్తో తాజా మ్యాచ్లో భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. దీప్తి, హర్మన్ రెండు రనౌట్లలో భాగమయ్యారు.స్ప్రే ప్రయోగిస్తూఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో పురుగుల వల్ల భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే ప్రయోగిస్తూ.. పురుగులను వెళ్లగొట్టడం హైలైట్గా నిలిచింది. అంపైర్ల అనుమతితోనే ఆమె ఇలా చేయడం గమనార్హం.చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
సెమీస్లో ఇంగ్లండ్ మహిళలు
ధర్మశాల: ఇంగ్లండ్ జట్టు టి20 మహిళల ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. వెస్టిండీస్తో చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో నెగ్గి మూడో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయినా ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసి... వికెట్ తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేసింది. స్టెఫానీ టేలర్ (35), క్వింటిన్ (25) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 109 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు బ్యూమోంట్ (31), ఎడ్వర్డ్స్ (30) రాణించారు. పాక్ మహిళలకు రెండో విజయం న్యూఢిల్లీ: పాకిస్తాన్ మహిళల జట్టు.... రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై నెగ్గింది. టాస్ గెలిచిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఫర్గానా హక్ (36) రాణించింది. పాకిస్తాన్ 16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (53 నాటౌట్), బిస్మా (43 నాటౌట్) చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా మహిళల గెలుపు ఆస్ట్రేలియా జట్టు కూడా రెండో విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. ఆసీస్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసి నెగ్గింది. విలాని (39 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు), లానింగ్ (53 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో నిలిచారు.