breaking news
Shaheen
-
డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా జన్మించింది. గతేడాది జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఈ ఏడాది ఆల్ఫా అనే మూవీలో కనిపించనుంది.అయితే ఆలియా భట్కు పూజా భట్, షాహీన్ భట్ అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన షాహీన్ భట్ ప్రముఖ ఫిట్నెస్ కోచ్ ఇషాన్ మెహ్రాతో డేటింగ్లో ఉన్నారు. ఇవాళ అతని బర్త్ డే కావడంతో షాహీన్ భట్ విషెస్ చెబుతూ అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో అతనితో రిలేషన్లో ఉన్నట్లు అఫీషియల్గా ప్రకటించింది.ఇది చూసిన అలియా భట్ తన సిస్టర్ షాహీన్ భట్కు మద్దతుగా నిలిచింది. ఇషాన్ మెహ్రా పుట్టినరోజు సందర్భంగా అలియా భట్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా షాహీన్ చేసిన పోస్ట్ను అలియా భట్ షేర్ చేసింది. ఈ పోస్ట్పై నీతూ కపూర్, పూజా భట్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అనన్య పాండే, పరిణీతి చోప్రా, బాద్షా,మసాబా గుప్తా సైతం స్పందించారు. షాహీన్ భట్ భాయ్ఫ్రెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. షాహీన్ భట్ గతంలో హాస్యనటుడు రోహన్ జోషితో రిలేషన్ షిప్లో ఉన్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో షాహీన్ భట్.. ఇషాన్తో ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. కానీ అతని ఎవరు అనేది వెల్లడించలేదు. ఈ ఏడాది కపూర్, భట్ కుటుంబాలు న్యూ ఇయర్ సందర్భంగా థాయ్లాండ్ పర్యటనకు వెళ్లాయి. ఇన్స్టాగ్రామ్లోకి షాహీన్ తన ట్రిప్కు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఒక ఫోటోలో ఆమె ఇషాన్ పక్కన నిలబడి పోజులిచ్చింది. మరో చిత్రంలో క్రూయిజ్లో ఉన్నప్పుడు వారిద్దరు కౌగిలించుకున్నారు. అప్పటి నుంచే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
సాక్షి, హైదరాబాద్: కుమార్తె వైవాహిక స్థితిని పరిగణనలోకి తీసుకుని కారుణ్య నియామకానికి అర్హురాలు కాదని చెప్పడం సరికాదని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహమైనా ఆమె అర్హురాలేనని, అయితే దీనికి వారి ఆర్థిక పరిస్థితి సహా పలు అంశాలను పరిశీంచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈమేరకు పిటిషనర్ దరఖాస్తును పునఃపరిశీలించాలని ఆదేశించింది. నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లతో మళ్లీ వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ యూసఫ్ మృతిచెందారు. కారుణ్య నియామకం కింద తన కుమార్తె ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని సీపీ నిరాకరించారంటూ యూసఫ్ భార్య షాహీన్ సుల్తానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు విచారణ చేపట్టారు. ‘షాహీన్కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కుమారుడు కెనడా వెళ్లి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు. కూతురు ఫాతిమానే తల్లిని చూసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యం కూడా అందించలేకపోతోంది’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ‘పిటిషనర్కు కుమారుడు ఉన్నారు. అతను ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే కారుణ్య నియామక విజ్ఞప్తిని సీపీ తిరస్కరించారు. ఫాతిమా, ఆమె భర్త ఆర్థిక పరిస్థితిని షాహీన్ వెల్లడించలేదు’ అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆమె డాక్యుమెంట్లను పునఃపరిశీలన చేసి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
తరుముకొస్తున్న షహీన్
ముంబై: గులాబ్ తుపాను కల్లోలం ముగిసిందో లేదో మరో తుపాను తరుముకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తర్వాత అది తీవ్ర తుపానుగా మారి పాకిస్తాన్లో మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుంది. ఆ తర్వాత 36 గంటల్లో దిశ మార్చుకొని గల్ఫ్ ప్రాంతాలపై వెళ్లి ఆ తర్వాత బలహీనపడుతుంది’’అని వాతావరణ శాఖ వెల్లడించింది. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా ఏర్పడిన షహీన్ తుపానుతో ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
‘నిన్ను చంపేస్తాం.. అత్యాచారం చేస్తాం’
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో బంధుప్రీతి మీద విపరీతమైన చర్చ జరిగింది. ముఖ్యంగా ఖాన్లు, కపూర్ల కుటుంబాలతో పాటు కరణ్ జోహర్ మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీరి వల్ల టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు రాక.. ఎందరో కుంగి పోతున్నారని.. కొందరు సుశాంత్ లాగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజనులు ఆరోపించారు. బాలీవుడ్లో ఓ పెద్ద మాఫియా ఉందని దాని వలనే సుశాంత్ మరణించాడంటూ కంగనాతో పాటు పలువురు.. ఇండస్ట్రీలోని పెద్దలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇన్ని రోజులు మహేష్ భట్, ఆలియా భట్లపై విమర్శలు చేసిన వారు తాజాగా ఆమె సోదరి షాహీన్ భట్ను వేధిస్తున్నారట. (నేను రోబో కాదు) ఆమెను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు షాహీన్. ఇవి తనను ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయడం లేదన్నారు. అంతేకాక ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని సీరియస్గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తు తెలియని సైట్ల నుంచి ఇలాంటి బెదిరింపులు పాల్పడే వారిని ఐపీ అడ్రెస్లతో గుర్తించడం ఖాయమని అంటున్నారు షాహీన్.(కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి) -
రెక్కలున్నాయని పక్షికి తెలియాలి
హైదరాబాద్, పాతబస్తీలోని సుల్తాన్ షాహి ఏరియాలో ఉంది షాహీన్ ఉమెన్స్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్. ఆఫీస్ గదిలోకి వెళ్లగానే జమీలా నిషాత్ చిరునవ్వుతో ఆహ్వానించారు. ఆమె కుర్చీకి వెనుకగా గోడ మీద ఒక పెన్సిల్ డ్రాయింగ్ కనిపించింది. ఒక అరబ్ షేక్ తక్కెడ పట్టుకుని ఉంటాడు. ఆ తక్కెడలో ఒక పక్క అమ్మాయిలు, మరొక పక్క డబ్బు కట్టలు. డబ్బు కట్టల వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది తక్కెడ. ఆ బొమ్మ మీద పెద్ద ఇంటూ గుర్తు ఉంది. ఈ దుర్నీతి ఇంకా కొనసాగరాదని చెప్తోందా చిత్రం. తక్కెడ కింద ఉర్దూలో ఒక క్యాప్షన్.. ‘మమ్మల్ని నోట్ల కట్టల్తో తూచవద్దు, ముసలి వ్యక్తికి అమ్మవద్దు’ అని. 2002. హైదరాబాద్లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్. పోటీలో చిన్న పిల్లలు డ్రాయింగ్ వేస్తున్నారు. పన్నెండేళ్ల షహీదా తదేక దీక్షతో బొమ్మ వేస్తోంది. వేసిన బొమ్మను తనను మార్చి మార్చి చూసుకుంటోంది. ఆ బొమ్మ తనకే నచ్చనట్లుంది. దానిని పక్కన పెట్టి మరో బొమ్మ వేసింది షహీదా. ఇదంతా గమనిస్తున్న జమీలా.. ‘ఏం బొమ్మ వేశావు’ అని షహీదాని అడిగారు. ‘నా బొమ్మ. ఆ బొమ్మలో ఉన్నది నేనే’ అన్నదా అమ్మాయి. ఇంతకీ షహీదా వేసిన బొమ్మలేమై ఉండవచ్చు. ముందు వేసింది రెక్కలు లేని పక్షి బొమ్మ. తర్వాత వేసింది పంజరంలో బందీగా ఉన్న పక్షి బొమ్మ. ‘షాహీన్’ అవిర్భావం వెనుక పన్నెండేళ్ల అమ్మాయి తన పరిస్థితిని ఒక్క బొమ్మలో చెప్పింది. మాటల్లో చెప్పడం చేతకాక కాదు. తాను చెప్పినా వినడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం వల్ల. షహీదా బొమ్మ రూపంగానైనా చెప్పగలిగింది. అలా కూడా చెప్పే అవకాశం లేని షహీదాలెంతమందో ఈ సమాజంలో. వారి ఆవేదన వినడానికి ఒక గుండె కావాలి. ఒక అమ్మ కావాలి. ‘ఆ అమ్మ తనే కావాలి’ అనుకున్నారు జమీలా నిషాత్. ‘పంజరంలో బందీగా ఉన్న పక్షులకు ఆకాశంలో ఎత్తుకి ఎగిరే శక్తినివ్వాలి. అందుకు ఒక వేదిక కావాలి.. అదే షాహీన్’ అన్నారామె. షాహీన్ అంటే.. ఎత్తుకి ఎగరగలిగిన శక్తిమంతమైన పక్షి. షాహీన్ ఉమెన్స్ రీసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు దారి తీసిన సంఘటన.. షహీదా పంజరంలోని పక్షి బొమ్మను గీయడం! పేదరికం వల్లనే ప్రలోభాలకు ‘‘షహీదా అనుభవాన్ని పోలినదే మరో సంఘటన. మహిళలను చైతన్య పరచడానికి ఏర్పాటు చేసిన ఓ వర్క్షాపులో ఓ మహిళ లేచి.. ‘‘ఆడదాన్ని కొట్టడం నిజంగా నేరమా? అయితే నా భర్త ‘భార్యను కొట్టని వాడు అసలు మగవాడు ఎలా అవుతాడు?’ అంటాడేంటి’’ అని అడిగింది అమాయకంగా. ఇవే కాదు, ఇంతకంటే ఘోరాలూ ఉన్నాయి. అభంశుభం తెలియని అమ్మాయిలకు అరబ్బు షేక్లతో పెళ్లి చేయడం వాటిలో ఒకటి. ఒక అమ్మాయికి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా పదిహేడు సార్లు, పదిహేడు మంది షేక్లతో పెళ్లి చేశారు. అంతమంది లైంగిక దాహానికి బలైపోయిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కొందరు క్వాజీలు, పహిల్వాన్లు ఈ విధంగా ఆడపిల్లల తల్లిదండ్రులను మాయమాటలతో మభ్యపెడతారు. వారి మాటల్ని నమ్మి అమ్మాయిల తల్లిదండ్రులు ప్రలోభాలకు లోను కావడానికి కారణం కరడు కట్టిన పేదరికమే. ఆ వలయాన్ని ఛేదించడానికి పోలీసు, మీడియా సహకారంతో మేము అనేక స్టింగ్ ఆపరేషన్లు చేశాం. సమస్యను నివారించాలంటే ముందు ఆ సమస్యను సమాజానికి తెలియచేయాలి. ఈ దురాగతాన్ని రూపుమాపాలంటే... అందుకు దారి తీసిన పేదరికాన్ని నిర్మూలించాలి. అరబ్ షేక్లతో పెళ్లి పేరుతో మోసపోయిన అమ్మాయిలను షాహీన్ రక్షణ కిందకు తీసుకొస్తున్నాం. వాళ్లు తమ కాళ్ల మీద తాము జీవించడానికి కావల్సిన జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నాం. మెహిందీ డిజైన్లు వేయడం, ఎంబ్రాయిడరీ చేయడం, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, గాజుల తయారీ, కంప్యూటర్ కోర్సులు... ఇలా వారి అభిరుచి మేరకు శిక్షణ ఇప్పిస్తున్నాం. చట్టం తెలిసుండాలి ఇస్లాం కుటుంబాల్లో అమ్మాయిలను చదివించడమే గగనంగా ఉంటున్న ప్రాంతాలపై షాహీన్ ప్రధానంగా దృష్టి పెట్టింది. అక్కడి అమ్మాయిల్ని చదివించినా పదో తరగతి దాటనివ్వరు. శారీరకంగా, మానసికంగా తమ జీవితం దోపిడీకి గురవుతోందని వారికి తెలుస్తూనే ఉంటుంది. అయితే ఆ దోపిడీని అరికట్టడానికి తామే చేతులు అడ్డు పెట్టుకోవాలని చెప్పే వాళ్లుండరు. తమకు రక్షణగా చట్టం ఉందని కూడా తెలియదు చాలామందికి. గృహహింస బాధితులతోపాటు ఆ ఇంటి వారికి కూడా మేము కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్లం. చట్టం వచ్చిన తర్వాత గృహహింస నిరోధక చట్టాన్ని (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్, 2005) ఉర్దూలోకి అనువదించి బుక్లెట్ ప్రచురించి, పాతబస్తీలోని ముస్లిం మహిళలకు పంచి పెట్టాం. మహిళల్ని తమ హక్కుల గురించి చైతన్యవంతం చేయడం కోసం వర్క్షాపులు పెట్టినప్పుడు.. మహిళలను మాత్రమే చైతన్యవంతం చేస్తే సరిపోదు, మగవాళ్లను సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలిసింది. ఫోన్లోనే విడాకులు?! ఓ పద్నాలుగేళ్ల అమ్మాయికి అరబ్ షేక్తో పెళ్లయింది. అతడు కొంతకాలం ఇక్కడ గడిపి తిరిగి వాళ్ల దేశానికి వెళ్లి పోయాడు. అతడు వెళ్లాక తెలిసింది ఆ అమ్మాయికి తాను గర్భవతినని. ఆ విషయాన్ని భర్తకు ఫోన్లో తెలియచేసిందామె. అదే ఫోన్ కాల్లో అతడు ఆమెకు విడాకులిచ్చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? అంతకంటే షాకింగ్ ఉంటుందా? జీవితం అగమ్యగోచరం కాక మరేమవుతుంది? అలాంటి కండిషన్ను ఎదుర్కోగలిగిన మానసిక స్థయిర్యం ఉండటానికి... ఆమెకి చదువు లేదు, డబ్బు లేదు. తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేరు. అప్పుడా అమ్మాయి బాధ్యతను షాహీన్ తీసుకుంది. ఆమెకు ప్రసవం అయ్యే వరకు, అయిన తర్వాత కూడా వైద్య సహాయం చేశాం. ఆ తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడామె ఎవరి మీదా ఆధారపడకుండా స్వయంకృషితో జీవిస్తోంది. త్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బాగుంది. అయితే భార్యాభర్తల మధ్య విడాకుల విషయంలో ఏ తీర్పయినా వారిని కలిపి ఉంచేలా, లేదా సామరస్యంగా విడిపోయేలా చేసేందుకు ఉపకరించాలి. నిస్సహాయ స్థితి! కొన్నిసార్లు దోషులు కళ్ల ముందున్నప్పటికీ చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకుంటారు. ఒకమ్మాయి ఉరేసుకుని చనిపోయింది. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేలేదని ఆమెను అత్తమామలు వేధించేవారని, ఆ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందని చుట్టు పక్కల అందరూ చెప్పారు. చనిపోయిన అమ్మాయి తరఫున న్యాయపోరాటం చేయడానికి షాహీన్ సిద్ధమైంది. అయితే ఆమె ఇంట్లో వాళ్ల దగ్గర.. ‘తనకు జీవించాలని లేదని, చనిపోవాలనిపిస్తోందని’ అర్థం వచ్చేట్లుగా రాసి, ఆమె సంతకం చేసిన కాగితం ఒకటి ఉంది. నిజానికి ఏం జరిగిందో మాకందరికీ తెలుçసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కొన్ని రోజుల పాటు కళ్లు మూసుకున్నా, తెరిచినా ఆ అమ్మాయి ముఖమే కనిపించేది. ఇలాంటి సంఘటనలతో ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపాను. ఆ ఆవేదన కవితల రూపంలో కాగితం మీదకు జాలువారేది. అయితే ఆ కవితలు దీనావస్థలో ఉన్న ముస్లిం మహిళ బతుకు చిత్రాన్ని చూపిస్తాయి కానీ, సమస్య నుంచి వారిని బయటకు తెచ్చేదెలా? అనే ప్రశ్న తొలుస్తూనే ఉండేది. చైతన్యం తేవడమే లక్ష్యం లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్లు కుటుంబ జీవితాన్ని గాడిలో పెట్టుకోవడానికి దోహదం చేస్తాయి. అంతకంటే ముందు.. వ్యక్తిగా తమకున్న హక్కుల గురించి వాళ్లకు తెలియాలి. చదువుకునే హక్కు ఉందని తెలియాలి, సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉందనీ తెలుసుకోవాలి. పిల్లల్ని కనడం కోసం అనారోగ్యం పాలు కాకుండా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే హక్కు ఉందని కూడా మహిళలకు తెలియాలి. అవన్నీ తెలియచేయడానికి మేము ఒకసారి వర్క్షాప్ పెట్టి చెప్తే సరిపోదు. వాళ్లు మళ్లీ మళ్లీ చదువుకునేటట్లు సమాచారం వాళ్ల చేతిలోనే ఉంటే తప్ప వారిలో రావాల్సినంత చైతన్యం వచ్చేలా లేదనిపించింది. అందుకే ఈ చట్టాలను ఉర్దూలో ప్రచురించి పంచి పెట్టాం. కౌమారదశలో ఉన్న అమ్మాయిలతోపాటు, అబ్బాయిలను కూడా మా రక్షణలోకి తీసుకుంటున్నాం. లైంగిక దోపిడీకి గురయ్యే వయసును సంరక్షించగలిగితే, వాళ్లే రేపటి రోజున సున్నితమైన సమాజాన్ని స్థాపించడానికి ముందుకు వస్తారు. పంజరంలో చిక్కుకున్న పక్షుల్ని, బంధ విముక్తుల్ని చేసి, స్వేచ్ఛగా ఎగరగలిగిన శక్తిని పెంపొందించాలనేదే షాహీన్ ప్రయత్నం. నేను ఈ సంస్థ స్థాపించడానికి ప్రేరేపించిన అమ్మాయి పంజరంలో చిక్కుకున్న పక్షి బొమ్మ వేసిన షహీదా. ఇప్పుడామె షాహీన్ సంస్థలో కార్యదర్శి, కోశాధికారి విధులు నిర్వర్తిస్తోంది’’. ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి ‘‘ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న మహిళ, తన మీద జరిగే అన్యాయాలను సహిస్తూ కాలం గడపదు. తన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలనే నిర్ణయాన్ని తానే తీసుకోగలుగుతుంది. అందుకోసమే ఆర్థిక కారణాల వల్ల చదువాపేసిన అమ్మాయిలను అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివిస్తున్నాం. ఆర్థిక స్వావలంబన సాధించడానికి వారికి ఇష్టమైన పనుల్లో శిక్షణనిస్తున్నాం. ఐదుగురితో మొదలైన షాహీన్ సంస్థలో ఇప్పుడు 35 మంది సేవలందిస్తున్నారు. ఈ పదిహేనేళ్లలో ఐదు వేలకు పైగా మహిళల జీవితాలను గట్టెక్కించగలిగాం. నా జీవితం కూడా షాహీన్ లేకుండా జమీలా లేదనేంతగా సంస్థతో ముడివడిపోయింది. – జమీలా నిషాత్, కవయిత్రి, సామాజిక కార్యకర్త ఆకాంక్ష తీర్చని ఆంక్షల వలయం అరవై మూడేళ్ల జమీలా నిషాత్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్లో. ఆమె తండ్రి సయీద్ బిన్ ముహమ్మద్ చిత్రకారుడు. జమీలాకి కూడా బొమ్మలు వేయాలని ఉండేది. కానీ వారి సంప్రదాయ కుటుంబంలో ఆంక్షలెదురయ్యాయి. ఆ తీరని ఆకాంక్షను ఆమె సాహిత్యం చదవడం, కవిత్వం రాయడంతో నెరవేర్చుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో కాలేజ్ చదువుతోపాటు కవిత్వాన్ని కొనసాగించారు. పెళ్లి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ ఇంగ్లిష్తోపాటు థియేటర్ ఆర్ట్స్లో డిప్లమో చేశారు. మహిళలను చైతన్యవంతం చేయాలనే సంకల్పంతో సామాజిక కార్యకర్తగా మారారు. -
నలుగురు బాలికలు అదృశ్యం
రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో నలుగురు బాలికలు కనిపించకుండాపోయారు. పుప్పాల్గూడ గ్రామం లంబాడిగడ్డకు చెందిన హసీనా(19), హుస్సేన్ బీ(16), సమీనా(13), షహీన్(10)సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు వెతుకులాడినా ప్రయోజనం కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఇది సామాన్యుడి విజయం
సోషల్ మీడియాకు సంబంధించి పౌరుల భావప్రకటన హక్కును పరిరక్షించే దిశగా అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన మైలురాయి లాంటి తీర్పు ఇదని సోషల్ మీడియా యూజర్లు, హక్కుల ఉద్యమకారులు అభివర్ణిస్తున్నారు. ‘చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి షాహీన్ ఆ వ్యాఖ్య చేయలేదు. అది చాలా సాధారణ వ్యాఖ్య. ఇకనైనా ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం అగిపోతుందని ఆశిస్తున్నా’ - ఫారూఖ్ ధాడ (బాల్ ఠాక్రే మృతి సమయంలో ఫేస్బుక్లో ‘ముంబై షట్డౌన్’ను ప్రశ్నించి, అరెస్టైన షాహీన్ తండ్రి) ‘వెరీ హ్యాపీ. నాకు ఈరోజు న్యాయం జరిగింది. తప్పులకు వ్యతిరేకంగా గళమెత్తేవారికి ఊతమిచ్చే తీర్పు ఇది’ - రీను శ్రీనివాసన్ (షాహీన్ కామెంట్ను లైక్ చేసి అరెస్టైన వ్యక్తి) ‘ఇది సామాన్యుడి భావ ప్రకటన స్వేచ్ఛకు లభించిన విజయం. సోషల్ వెబ్సైట్లను ఉపయోగిస్తున్న చాలామందిలో ఈ సెక్షన్పై పెరుగుతున్న భయాందోళనలు ఇకనైనా సమసిపోతాయని ఆశిస్తున్నా’ - అంబికేశ్ మహాపాత్ర(పశ్చిమబెంగాల్లోని జాధవ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ముఖ్యమంత్రి మమతబెనర్జీని కించపర్చే ఈ మెయిల్లను పలువురికి పంపించాడన్న ఆరోపణలపై ఆయనను కూడా ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు)