-
దారుణం: ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి
షాహ్దోల్: మధ్యప్రదేశ్లోని షాహ్దోల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు మృత్యు వాతపడ్డారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము మధ్యన ఈ దుర్జటన చోటు చేసుకుంది. ఐసీయూలో తగినంత ఒత్తిడితో ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో ఊపిరి అందక ఈ అరుగురు మృతి చెందారని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డీన్ డాక్టర్ మిలింద్ షిరాల్కర్ ఆదివారం తెలిపారు. ఐసీయూలో మొత్తం 62 మంది పేషెంట్లు ఉండగా... మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని వివరించారు. శనివారం సాయంత్రం నుంచే ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోవడంతో పదేపదే సరఫరా దారులను సంప్రదించామని, అర్ధరాత్రికి గాని ఆక్సిజన్ సిలిండర్లు రాలేదని తెలిపారు. అయితే షాహ్దోల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ... పరిస్థితి విషమించే ఈ ఆరుగురు మరణించారని అన్నారు. ఒకవేళ ఆక్సిజన్ స్థాయి తగ్గితే మిగతా పేషెంట్లు కూడా ఇబ్బంది పడాలి కదా? అని ప్రశ్నించారు. చదవండి: లాక్డౌన్ పై నిర్మలా సీతారామన్ మరోసారి క్లారిటీ -
తాపీగా నకిలీ రూ.2000 నోట్లు ప్రింట్ చేస్తూ..
భోపాల్: ఎన్ని హెచ్చరికలు వచ్చినా, పోలీసుల తనిఖీలు జరుగుతున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఏం చక్కా కొత్త నోట్లను ముద్రిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కిపోయారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చుయంత్రాన్ని ఓ స్కానర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం రూ.2000 నోట్లను మధ్యప్రదేశ్లోని షాడోల్లో ఓ ప్రాంగణంలో ముద్రిస్తున్నారు. ఇప్పటికే చాలా నోట్లను ముద్రించారు కూడా. పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లలో అప్పుడే దొంగనోట్లు వస్తున్నాయని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గతంలో నకిలీ నోట్లను ముద్రిస్తూ పట్టుబడిన వారి సహాయంతో గాలింపులు చేపడుతున్న పోలీసులు చివరకు ఓ ఇద్దరు వ్యక్తులను షాడోల్లో అరెస్టు చేశారు. వీరి వెనుక ఎవరైనా ఉండి ఉంటారా అనే వివరాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
Advertisement