breaking news
senior journalist jyothirmai day
-
జోతిర్మయి డే హత్య కేసు..చోటా రాజన్ దోషి
-
జే డే కేసులో ఛోటా రాజన్కు జీవిత ఖైదు
సాక్షి, ముంబై : ఏడేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రముఖ జర్నలిస్టు జే డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసులో ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు(బుధవారం) తీర్పు వెలువరించింది. ఈ కేసులో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ని దోషిగా తేల్చిన కోర్టు ...అతడితో పాటు మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ముంబైకి చెందిన జే డే.. మిడ్ డే పత్రికలో క్రైమ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2011 జూన్11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఆయనపై మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జే డేని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ అయిన జే డే ముంబైలో నేరచరిత్ర కలిగిన 20 మంది గ్యాంగ్స్టర్ల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అతను హత్యకు గురయ్యారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు తొలుత మరో జర్నలిస్టు జిగ్నా వోరాను ఈ కేసులో నిందితురాలిగా అనుమానించి విచారణ చేపట్టారు. వృత్తి రీత్యా ఏర్పడిన శత్రుత్వంతోనే వోరా ఈ హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు ఆమె వద్ద నుంచి మరింత సమాచారం సేకరించారు. ఆ తర్వాత లోతైన విచారణ చేపట్టిన పోలీసులు ఛోటా రాజన్కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంతోనే అతడు ఈ హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చారు. సతీశ్ కాలియా అనే కాంట్రాక్టు కిల్లర్కు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ హత్య చేయించినట్టు పోలీసు విచారణలో వెలుగు చూసింది. ఈ హత్య తర్వాత అక్కడి నుంచి పరారైన సతీశ్ను పోలీసులు ఎట్టకేలకు రామేశ్వరంలో అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ముంబై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో తొలి నుంచి నిందితురాలిగా ఉన్న వోరాను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఛోటా రాజన్తో పాటు మరో పది మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వీరికి రేపు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. నకిలీ పాస్పోర్టు కేసులో దోషిగా ఉన్న ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
జర్నలిస్టు హత్యకేసులో పదిమందిపై చార్జీషీటు
ముంబయి: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు జే. డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసుకు సంబంధించి నిందితులందరిపై ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. పది మందిపై చార్జీ షీటు ఖరారు చేసింది. వీరిలో మరొక జర్నలిస్టు జిగ్నా వోరా అనే మహిళ కూడా ఉన్నారు. కుట్ర పూరితంగా జే డేను చంపడంతోపాటు, చంపినవారందరికీ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలు కూడా అందులో పేర్కొన్నారు. 2011 జూన్ 11న సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఉదయంపూట రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు వ్యక్తులు జ్యోతిర్మయి డేపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. ఈ కేసులో జిగ్నా వోరాను అదే సంవత్సరం నవంబర్ నెలలో అదుపులోకి తీసుకొని విచారించగా కీలక ఆధారాలు బయటపెట్టింది. వాటి ఆధారంగా పదిమందిపై అభియోగాలు నమోదుచేశారు. మాఫియా డాన్ చోటా రాజన్ కు వ్యతిరేకంగా అనేక ఆర్టికల్స్ రాశారనే కారణంతో జేడేను హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. మిడ్ డే అనే పత్రికకు జే డే ఎడిటర్గా పనిచేశారు.