breaking news
seis
-
అంగారకుడిపై కంపనాలు
వాషింగ్టన్: అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి. మార్స్పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్సైట్’ అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్సైట్లో అమర్చిన సిస్మిక్ ఎక్స్పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్ఈఐఎస్) పరికరం ఈ నెల 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. గతేడాది మేలో ఇన్సైట్ను ప్రయోగించగా డిసెంబర్లో సిసిమోమీటర్ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది. ఈ కంపనాల్ని మార్టియన్ సోలార్ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. ఇక అంగారకుడి అంతర్భాగం నుంచి మొట్టమొదటిసారి వచ్చిన కంపనాలు ఇవే కావడం గమనార్హం. ఇప్పటివరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్ 10, ఏప్రిల్ 11 తేదీల్లో అత్యంత చిన్న చిన్న కంపనాలను కూడా సిసిమోమీటర్ గుర్తించింది. అయితే సోలార్ 128 కంపనాలు ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్ మిషన్లో కనుగొన్న కంపనాలను పోలి ఉన్నాయి. దీంతో సోలార్ 128 కంపనాలపైనే శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కంపనాలు ఏర్పడటానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ కంపనాలు చాలా చిన్నవని, ఇటువంటి చిన్న చిన్న కంపనాలను గుర్తించడమే ఇన్సైట్ నౌక అసలు లక్షమని ఇన్సైట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బ్రూస్ బానెర్డ్ తెలిపారు. ఇన్సైట్ బృందానికి 128 కంపనాలు మైలురాయి లాంటిదని, ఇలాంటి సంకేతాల కోసం కొన్ని నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని శాస్త్రవేత్త ఫిల్ లాగ్నొన్నె తెలిపారు. -
ఎస్టీపీఐ యూనిట్లకు ఎస్ఈఐఎస్ ప్రయోజనాలు: నాస్కామ్
హైదరాబాద్: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) యూనిట్లకు సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎస్ఈఐఎస్) ప్రయోజనాలను 2016-17 బడ్జెట్లో వర్తింపజేయాలని నాస్కామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ, ఐటీఈఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీలకు వచ్చే బడ్జెట్ చాలా కీలకమని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నియమాల్లో స్పష్టత లేకపోవడంతో ఇక్కడి కంపెనీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. సేఫ్ హార్బర్ మార్జిన్స్పై ఉన్న 20-30 శాతం అధిక వడ్డీ రేట్లను ఈ బడ్జెట్లో అయినా సవరించాలన్నారు. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు వాటికి వ్యాపారానికి అనువైన పరిస్థితులకు కల్పించాలని కోరారు. మ్యాట్తోసహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుంచి స్టార్టప్స్కు మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రారంభ దశలో ఉన్న కంపెనీలకు ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేయాలని విన్నవించారు.