breaking news
saraswathi Devi alamkaaram
-
సరస్వతి అవతారంలో కనకదుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహామంటపంలో విద్యార్ధుల కోసం విజయీభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న విద్యార్ధులకు శక్తి కంకణాలతోపాటు పెన్ను, అమ్మవారి చిత్రపటం, కంకుమ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. -
పదోరోజు మహిషాసుర వర్దిని అవతారం
-
భక్తజనకీలాద్రి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిౖయెన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసేలా ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను శనివారం శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి... వీణ, దండ, కమండలం, అక్షరమాల, నెమలితో కూడిన అభయముద్రను ధరించిన చదువుల తల్లిని దర్శించి భక్తులు తరించారు. ‘ తల్లీ.. మా అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞానం ప్రసాధించు..’ అని వేడుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి.. భక్తజనకీలాద్రిగా మారింది. – సాక్షి, విజయవాడ