breaking news
Sanjay Dutts biopic
-
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’
ముంబై: సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాకుండా అత్యంత తక్కువ సమయంలో రూ.200 కోట్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. పదో రోజు (ఆదివారం) రూ. 28.05 కోట్లు వసూలు చేసింది. దీంతో సంజు సినిమా ఇప్పటి వరుకూ రూ.265.48 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. విడుదలైన తొలి మూడు రోజులకే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రణ్బీర్కపూర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. సంజయ్ దత్ పాత్రలో రణ్బీర్ కపూర్ జీవించేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. -
సమాజాన్ని విస్మరించిన సినిమా
అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్’ల ముందు మోకరిల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిరసన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధానమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీసుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్ స్టర్లను ఎన్కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రాయాల్ని బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. దేశంలో బాగా ప్రతిభ గల, విజయవంతమైన బడా సినీ దర్శకులు అధి కారంలో ఉన్నవారికి ఏ మాత్రం జంకు లేకుండా ఎందుకు లొంగిపోతున్నారు? విధూ వినోద్ చోప్రా– రాజ్కుమార్ హిరాణీ తాజా సినిమా సంజూ నా వాద నకు కారణం. సంజయ్దత్ని దుర్మార్గులైన జర్నలి స్టుల రాతలకు బలి అయిన నటునిగా ఈ సినిమాలో నిజాయతీ లేకుండా చిత్రించారని నేను చెప్పాను. అమెరికాలో ప్రసిద్ధ హాలీవుడ్ హీరో రాబర్ట్ డీ నీరో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రాయడానికి వీలులేని మాటలతో తీసిపారేస్తూ మాట్లాడుతున్న ఈకాలంలో పెద్ద పెద్ద సినీ నిర్మాతలు రాజ్ ఠాక్రేకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కొత్త సినిమా నిర్మాణం ఎందుకు ప్రారంభిస్తున్నారు? మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత రాజ్ ఎంతటి బెదిరింపు ధోరణితో మాట్లాడినా, కిందటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్త 288 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే సాధించగలిగారు. మరాఠీల కోసం పాటుపడుతున్నానని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఈ పార్టీకి 227 సీట్లున్న ముంబై మునిసి పల్ కార్పొరేషన్లో వచ్చిన స్థానాలు కేవలం ఏడే. అయితే ముంబై సినిమా నిర్మాతలు రాజ్ఠాక్రే ముందు ఎందుకు సాగిలపడుతున్నారు? కారణం– ఆయన గెలిచేదేమీ లేకున్నా చాలా విధ్వంసం సృష్టిం చగలరు. అందుకే సినీరంగం ఇలాంటివారికి తేలికగా లొంగిపోతుంది. ఈ సినీ పరిశ్రమకు మాఫియా ముఠాలన్నా, కండబలంతో అధికారం చెలాయించే వారన్నా భయం ఎక్కువ. భారత సమాజంలో దుర దృష్టకర విషయం ఏమంటే, మన సృజనశీల వర్గాలు సాధారణంగా అధికారంలో ఉన్నవారికి అనుకూ లంగా వ్యవహరిస్తారు. ఇండియాలో కొందరు విద్యా రంగానికి చెందిన అధ్యాపకులు, చిత్రకారులు, కొందరు జర్నలిస్టులు మినహా సృజనాత్మక రంగా లకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభుత్వాలు, మాఫియా ముఠాల ముందు తాబేదారులుగా ప్రవ ర్తిస్తారు. అయితే వందల కోట్ల వసూళ్లు, వేలాది కోట్ల విలువైన స్టూడియోలున్న హిందీ సినీరంగం ఎందు కింత సిగ్గుమాలిన రీతిలో వ్యవహరిస్తోంది? పెరిగిన ‘దర్బారీ’ సంస్కృతి! ప్రాచీన కాలం నుంచీ దేశంలో సాగుతున్న దర్బారీ సంస్కృతి నుంచి ఈ ధోరణి పుట్టుకొచ్చింది. కళలు, సంస్కృతి ప్రధానంగా మహరాజులు, తర్వాత సుల్తా నులు, బాద్షాల ప్రాపకంలోనే ముందుకు సాగాయి. రాజాస్థానంలో ఉంటేనే సంగీతకారులు లేదా చిత్ర కారులు తమ ప్రతిభాపాటవాలను సొమ్ము చేసుకో వడం తేలిక. రాజుల పోయి ‘భారత ప్రభుత్వం’ వచ్చినా ఆస్థాన సంస్కృతి అలాగే నిలబడిపోయింది. ప్రభుత్వం ఈ కళాకారులకు నిధులు, స్కాలర్షి ప్లు, విదేశీ పర్యటనలకు అవకాశాలు, ఢిల్లీలో భారీ బంగళాలు, ఇంకా పద్మ అవార్డులు ఇస్తోంది. అయితే, రచయితలు ముఖ్యంగా కవులు, చిత్రకా రులు ఈ సర్కారీ ‘దయ’ నుంచి బయటపడ్డారు. ఈ ర^è యితల్లో ఎక్కువ మంది వామపక్ష సిద్ధాంతాలను నమ్మడం వల్లే భిన్న మార్గం ఎంచుకోగలిగారు. సినీరంగంలో అంతు లేని డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, అత్యంత శక్తిమంతులైన ప్రముఖులు ఊహకందని రీతిలో పిరికిపందలుగా మారిపో యారు. వామపక్ష తరంతో పాటే మొదట కనిపించిన తెగువ, తిరుగుబాటు మాయమయ్యాయి. హిందీ పాటల రచయిత, కవి గుల్జార్(83) ఒక్కరే ధైర్యంగా నిలబడ్డారు. మిగిలినవారు ముఖ్యంగా, మొదటి తరం కళాకారుల వారసులు అధికారంలో ఉన్నవారికి సలాం చేస్తూ ఆస్థాన రచయితలు, కవులుగా మారి సంతోషంగా జీవిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే నిజమైన, తీవ్ర పోటీ ఉన్న రాజకీయాల్లోకి దిగే సాహసం చేశారు. ఈ సినీ ప్రముఖులందరిలో అతి పెద్ద కళాకారుడైన అమితాబ్ బచ్చన్ ఎన్నికల రాజకీయాల్లోకి దిగిన మూడేళ్ల లోపే ‘గాయపడి’ వెనుదిరిగారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. అధికారంలో ఉన్నవారిని తర్వాత ఏనాడూ ఆయన ప్రశ్నించలేదు. ఇటీవల కఠువా, ఉన్నావ్ రేప్ ఉదంతాలు వెలుగు చూసినప్పుడు ఆయన ‘గంభీర మౌనం’ పాటించారు. బాల్ ఠాక్రేపై తీసిన ‘సర్కార్’లో నటించినా అమితాబ్ నిజజీవి తంలో ఎవరి జోలికీ పోలేదు. అయితే, రాజ్ బబ్బర్, శత్రుఘ్న సిన్హా, హేమ మాలిని, స్మృతి ఇరానీ, దివ్య స్పందన వంటి కొందరు మాత్రం భిన్న మార్గంలో పయనిస్తున్నారు. మిగిలిన కళాకారులు కొందరు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులుగా సంతృప్తిగా బతు కుతూ అవసరం లేకున్నా ప్రభుత్వాలకు అనుకూ లంగా సభలో ఓటు వేస్తున్నారు. నీతులు చెప్పడంతోనే పేచీ! ఈ సినీ ప్రముఖులు తాము రూపొందించే చిత్రాల్లో చెప్పే నీతులు కారణంగా వారిని తప్పు పట్టాల్సి వస్తోంది. మున్నాభాయ్ సిరీస్ సహా 3 ఈడియట్స్ నుంచి పీకే వరకూ రాజ్కుమార్ హిరాణీ సామాజిక సందేశంతో విజయవంతమైన సూపర్ హిట్ సిని మాలు తీశారు. విధువినోద్ చోప్రా దేశభక్తి బోధిస్తూ తీసిన ద మిషన్ కశ్మీర్ చూసి జనం కోట్లాది రూపా యలు సమర్పించుకున్నారు. చోప్రా సొంత రాష్ట్ర మైన కశ్మీర్లో ఐఎస్ఐ కుట్రలను సినిమాలోని మంచి వ్యక్తులు భగ్నం చేయడం మనకు బాగా నచ్చింది. అయితే వారు నివసించే ముంబై నగరంలో మాత్రం ఐఎస్ఐని తేలికగా వదిలేశారు. సంజయ్దత్ అమా యకుని పాత్రలో సామాన్య ప్రజానీకం మధ్య నటిస్తే బాగుంటుంది. కాని, లోపాలతోపాటు ప్రతిభ ఉన్న హీరో పాత్రలో ఆయన అంతగా ఆకట్టుకోలేడు. సంజయ్కు ఏకే 56 రైఫిల్ సరఫరా చేసిన దావూద్ ఇబ్రహీం, ఆయన సోదరుడు అనీస్, ఈ మాఫియా సభ్యులు ఇంకా కరాచీ నుంచి తమ నేర సామ్రాజ్యం నడుపుతూనే ఉన్నారు. అందుకే దావూద్ ‘భాయ్’ ముఠాతో ఎందుకు పేచీ పెట్టుకోవాలనేది ముంబై సినీప్రముఖుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇక జనం కోసం ‘భాయ్’ సల్మాన్ మరో సంచలన చిత్రం నిర్మిస్తారు! కరాచీలో ఉంటున్న ఓ బడా భాయ్ని కోర్టు విచారణకు రప్పించడానికి ఈ పనిచేస్తారు. అగ్రతారలు చెప్పే సాకు ఏమంటే... ఇలాంటి విషయాలపై ధైర్యంగా మాట్లాడకపోవడా నికి అగ్రతారలకు చెప్పడానికి సాకులున్నాయి. ఏం మాట్లాడినా తాము భారీగా నష్టపోతామని వారు వాదిస్తారు. ఓసారి బహిరంగంగా ధైర్యంగా మాట్లాడి ఆమిర్ ఖాన్ ‘పొరపాటు’ చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఎదురైన స్పందన ఆయన నోరు మూయించింది. చివరికి ప్రభుత్వంతో ఓ విషయం ప్రచారానికి ఆమిర్తో కుదిరిన ఒప్పందం రద్ద యింది. ఇలాంటి సందర్భమే వచ్చినప్పుడు మరో అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ ఈ మాత్రం ధైర్యం కూడా ప్రదర్శించలేదు. కానీ, ముస్లిం పేర్లున్న పాత్రల్లో నటిస్తూ షారుఖ్ కనీసం ‘మౌన ప్రకటన’ అయినా చేయగలిగారు. సల్మాన్ పూర్తిగా అందరినీ ఓడించే మంచి హిందువుగా నటించారు. తన తాజా చిత్రంలో ఐఎస్ఐని దెబ్బదీసే పాత్రలో రాణించారు. అయితే, కేసుల్లో దోషిగా తేలడం వల్ల సల్మాన్కు కూడా సంజయ్దత్ మాదిరిగానే సమస్య ఎదురవు తోంది. సినిమా వంటి మాధ్యమాలు సమకాలీన సామాజిక, ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబించడం ఆనవాయితీగా వస్తోంది. ఆరంభంలో ఈ పనిచేసిన సినిమా రంగం ఇప్పుడు ఆ బాధ్యత విస్మరించింది. సంజూ చిత్రంలో జర్నలిస్టులను దుర్మార్గులుగా చిత్రించడం, వారిపై విద్వేషం కక్కడంపై నాకు కోపం ఏమీ లేదు. పత్రికల్లో ఈ సినీ ప్రముఖులు తమకు అనుకూలంగా ఎలా రాయించుకుంటు న్నారో నాకు బాగా తెలుసు. అలాగే సినిమాలు బాగు న్నాయని డబ్బు ఇచ్చి మరీ ‘రేటింగ్స్’ సంపాదించు కుంటున్నారనేది బహిరంగ విషయమే. అయితే, జర్నలిస్టులను ఇంతగా మాయ చేసి లోబరుచుకున్నా గాని–1993 ముంబై బాంబు పేలుళ్ల చరిత్రను ఎవరూ మార్చలేరు. శక్తిమంతమైన సినీ ప్రపంచం సమాజంలో మార్పు తీసుకురాగలదు. బడుగు బల హీన వర్గాలు, మైనారిటీల హక్కుల రక్షణకు తోడ్పడ గలుగుతుంది. అయితే, అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వాలు, సొంత మూక బలమున్న రాజ్ఠాక్రే, దావూద్ ఇబ్రాహీం వంటి ‘బలవంతుల’ ముందు తలలు వంచితే ఈ పనులు చేయడం కుదరదు. కొన్ని వర్గాల ప్రజలపై ఉన్న అనుమానాలను తప్పని చెప్ప డంగాని, రాజ్యాధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించ డంగాని సాధ్యం కాదు. ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మరుగుదొడ్లపై సినిమా తీయడం తేలికే. దేశంలో సినిమాల నిర్మాణం మొదలై ఇంత కాల మైనా పది మంది అగ్రశ్రేణి హీరోల్లో ఒక్కరూ కూడా ఓ దళితుడి పాత్ర వేయలేదు. రజనీకాంత్ మాత్రమే సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో ఆ పని చేయగలిగారు. ముంబై ‘భాయ్ల’ ముందు మోకరిల్లారు! అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్’ల ముందు మోకరి ల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిర సన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధా నమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీ సుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరి స్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రా యాలు, ఆదర్శాలు, లక్ష్యాలను బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. అధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించడానికి వారు తెగువ ప్రద ర్శిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరగడమే గాక, వారు వృత్తిలో విజయం సాధించడం మనకు ఆనందాన్నిచ్చే విషయం. వారేమీ అగ్రశ్రేణి దర్శ కులు, నిర్మాతలు, తారలు కాలేదు. ఎప్పటికీ కాకపో వచ్చు కూడా. కానీ, వారు శక్తిమంతులు. వారే హిందీ సినిమా రంగాన్ని భవిష్యత్తులో సృజనాత్మక మార్గంలో నడిపిస్తారు. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
రణ్వీర్ స్థానంలో రణ్బీర్ వచ్చాడా..?
సిని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సంజు’. ట్రైలర్...ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. రణ్బీర్ కపూర్ అచ్చు సంజయ్ దత్ లాగా మారిపోయాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు రణ్బీర్. అయితే సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా. ‘సంజు’ సినిమాలో సంజయ్ దత్ పాత్ర కోసం మొదట రణ్వీర్ సింగ్ను అనుకున్నారంట. కానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మాత్రం రణ్బీర్ కపూర్ను ‘సంజు’ పాత్ర కోసం ఎంపిక చేసారంట. ఈ విషయం గురించి విధు ‘‘సంజు’ పాత్ర కోసం రణ్బీర్ను తీసుకోవాలనే ఆలోచన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీది. కానీ నాకు ఈ ఆలోచన నచ్చలేదు. ఎందుకంటే సంజయ్ పాత్రలో నేను రణ్వీర్ను అనుకున్నాను. ఈ పాత్రకు రణ్వీర్ అయితే చాలా బాగా సరిపోతాడని అనిపించింది. కానీ రాజు మాత్రం రణ్బీరే ఈ పాత్రకు చక్కగా సరిపోతాడని నన్ను ఒప్పించాడు. షూటింగ్ ప్రారంభమయ్యాక రణ్బీర్ను సంజయ్ పాత్రలో చూసి నేను ఆశ్చర్యపోయాను. దాంతో నేను మొదట్లో అన్న మాటలను వెనక్కి తీసుకున్నాను. ఎందుకంటే రణ్బీర్ పూర్తిగా సంజయ్లాగా మారిపోయాడు. సంజయ్ దత్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఒక్కోసారి సంజయ్ ఆత్మ రణ్బీర్లో ప్రవేశించిందేమో అనిపిస్తుంది. అంతలా ఒదిగిపోయాడు ఆ పాత్రలో’ అని తెలిపారు. రణబీర్కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజు భాయ్ పాత్రలో రణబీర్ కపూర్ ఒదిగిపోయిన తీరుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంజయ్దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
ఆమె పాత్రలో నటించాలనదే నా కోరిక..
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బయోపిక్లో బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా నటిస్తారనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాలు క్రితం ఇందిరాగాంధీ బయోపిక్లో నటించడానికి మనీషా సంతాకం చేసినట్లు సమాచారం. ఇందిరాగాంధీ బయోపిక్లో నటించాలని ఉందని మనీషా తాజాగా ఓ ఇంటార్యూలో చెప్పారు. ‘ఆమె చాలా శక్తివంతమైన మహిళ. తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆమె ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అంతటి పవర్ఫుల్ లేడీ పాత్రలో నటించాలనదే నా కోరిక’ అని ఆమె పేర్కొన్నారు. ఆమె పాత్రలో నటించాడం నాకు చాలా ఇష్టమని మనీషా తెలిపారు. అంతేకాక గతంలో ఈ బయోపిక్ కోసం సంతాకం చేసిన విషయాన్ని ఆమె మరొసారి గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎన్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. మనీషా ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్లో నర్గిస్ దత్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని మనీషా కొయిరాలా వెల్లడించారు. -
అపజయం ఓ అనుభవం
ఏ రంగంలో అయినా సక్సెస్లు, ఫెయిల్యూర్లు కామన్. కానీ వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్. సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందిన ‘సంజు’ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు రణ్బీర్. ఫాదర్స్ డే సందర్భంగా ట్వీటర్లో అభిమానులతో చాట్ చేశారీ హీరో. ఈ సందర్భంగా ఓ అభిమాని సక్సెస్, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అని అడిగితే, ‘‘సక్సెస్, ఫెయిల్యూర్ మనం చేసిన పనికి రిజల్ట్ మాత్రమే. రిజల్ట్ కంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అలాగే సక్సెస్ నుంచి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఫెయిల్యూర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అందులోని పాఠాలే సక్సెస్కి ఫార్ములాలు అవుతాయి’’ అని సమాధానమిచ్చారు. -
సంజుని రిజెక్ట్ చేశా
దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ఖాన్ సూపర్హిట్ కాంబినేషన్ గురించి తెలిసిందే. ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి బ్లాక్బాస్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం రాజ్కుమార్ హిరాణీ సంజయ్దత్ బయోపిక్ ‘సంజు’ రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ను ఓ పాత్ర కోసం సంప్రదించారట హిరాణీ. ఆ విషయం గురించి ఆమిర్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ çసంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ క్యారెక్టర్ చేయమని హిరాణీ నన్ను అప్రోచ్ అయ్యాడు. ఫెంటాస్టిక్ రోల్. సినిమా ఎక్కువగా తండ్రీ కొడుకుల రిలేషన్షిప్ మీద నడుస్తుంది. సంజూ రోల్ అత్యద్భుతంగా ఉంది. యాక్టర్గా సంజూ రోల్ నాకు బాగా నచ్చింది. ఒకవేళ చేస్తే సంజూ రోల్ చేస్తా. కానీ అది ఆల్రెడీ రణ్బీర్ కపూర్ చేస్తున్నాడు కాబట్టి వేరే ఏ రోల్ చేయను అని చెప్పేశాను’’ అని పేర్కొన్నారు. ‘సంజు’ సినిమా జూన్29న విడుదల కానుంది. -
మనిషి ఒక్కడే.. పాత్రలు ఎన్నో
ఛార్టెడ్ ఫ్లైట్స్లో తిరిగిన స్టార్ హీరో బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. న్యూయార్క్లోని హై బిల్డింగ్ విండోలో నుంచి ప్రపంచాన్ని చూసి విజయగర్వంతో నవ్విన అతను, అసలు విండోనే లేని జైలుగదిలో ఖైదీగా ఉండాల్సి వచ్చింది. డ్రగ్స్తో లైఫ్ క్లోజ్ అనుకున్న టైమ్లో జిమ్లో హార్డ్వర్క్ చేసి నార్మల్ లైఫ్లోకి వచ్చాడు. ఒక మనిషి జీవితంలో ఇన్ని జరుగుతాయా? అంటే.. అవును. బాలీవుడ్ హీరో సంజయ్దత్ లైఫ్లో జరిగాయి. ఇంకా సంజయ్ జీవితంలో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఆయన జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘సంజు’ చూడాల్సిందే. జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ను మంగళవారం విడుదల చేశారు. ‘వన్ మ్యాన్ మెనీ లైఫ్స్’ అని ఫస్ట్ లుక్ పోస్టర్స్పై ఉంటడం విశేషం. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్గా రణ్బీర్ కపూర్ నటిస్తున్నారు. ఇతర పాత్రలను సోనమ్కపూర్, పరేశ్రావల్, అనుష్కాశర్మ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ చూశాక.. సంజయ్దత్ పాత్రకు రణ్బీర్ కపూర్ కరెక్ట్గా సరిపోయాడని బీటౌన్ సెలబ్రిటీలు పొగిడేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ట్రైలర్ లాంచ్ ప్రొగ్రామ్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి రణ్బీర్ను అడిగితే– ‘‘నా దృష్టికి ఈ విషయం రాలేదు. ఇండస్ట్రీలో ఇలాంటిది ఉంటే అంతకంటే వరస్ట్ థింగ్ మరొకటి లేదు’’ అని అన్నారు. అలాగే సంజయ్దత్ బయోపిక్లో నటించడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు రణ్బీర్. -
సునీల్ దత్గా...!
ఏడు పదుల వయసులో ఏడాదికి రెండు, మూడు సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోస్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. ఆయన నటించిన తాజా చిత్రాలు షమితాబ్, పీకు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. అది కూడా ఓ నిజజీవిత పాత్రనే ఈ బిగ్ బి చేయనుండటం విశేషం. ఆ విషయంలోకి వస్తే... 3 ఇడియట్స్, పీకే తదితర చిత్రాలతో విలక్షణ దర్శకుడనిపించుకున్న రాజ్కుమార్ హిరానీ, త్వరలో నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్రతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను అమితాబ్తో చేయించాలనుకుంటున్నారట. ఇటీవల అమితాబ్తో సంప్రతింపులు జరిపారని భోగట్టా. సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ చేయనున్నారని సమాచారం.