-
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, సంగారెడ్డి: తాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు. ‘‘మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ని చేసిండ్రు. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఈ పదేళ్లకు నేను ముఖ్యమంత్రి అయ్యేవరకు కాపాడుకోండి. విజయదశమీ రోజు నా మనసులో మాట మీకు చెప్తున్నా ఆశీర్వదించండి’’ అని కోరారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి వాలిపోతానని జగ్గారెడ్డి చెప్పారు. చదవండి: ఒవైసీ ఫ్యామిలీ ది గ్రేట్@61 నాటౌట్ -
రేపు ఘనంగావైఎస్సార్ జయంతి
సంగారెడ్డి క్రైం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత జయంతిని పురస్కరించుకుని ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కార్యకర్తలకు ప్రభుగౌడ్ పిలుపునిచ్చారు. జిల్లాలోని వైఎస్సార్ విగ్రహాలకు 8వ తేదీన క్షీరాభిషేకాలు చేస్తామన్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. వైఎస్సార్ బతికున్నంత కాలం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పనిచేశారని కొనియాడారు. ఆయన అమలు చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరో ముఖ్యమంత్రీ అమలు చేయలేదన్నారు. అందువల్లే ఆ మహానేత ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు రుణమాఫీ, ఉచిత వైద్యం, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అనేక పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్సార్కే దక్కిందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందజేసి అనేక మంది ప్రాణాలు కాపాడిన ఘనత కూడా వైఎస్సార్కే దక్కిందన్నారు. ఆయన అమలు చేసిన పథకాలన్నీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకుండా తగ్గించే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైఎస్సార్ వంటి మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.డి.ఖలీమొద్దీన్ మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ పాలన సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా నిలిచిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్గౌడ్, డా.వైద్యనాథ్, మసూద్ అలీ, జగదీష్, వెంకటరమణ, పరుశరాంరెడ్డి పాల్గొన్నారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఈటల చేతికి తెలంగాణ బీజేపీ పగ్గాలు
మినిమం 30.. తగ్గేదేలే..! ఇది కదా పానీ పూరీ మజా....వీడియో వైరల్
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
ఏపీలో మూడు రోజుల పాటూ భారీ వర్షాలు
టీడీపీ అరాచకాలపై వైఎస్ఆర్ సీపీ యాక్షన్ ప్లాన్
వరదరాజు గోవిందం మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే!
ఎవరికి ఏ శాఖ ?..మోదీ కేబినెట్ మీటింగ్
Advertisement