-
భర్త బాధ్యతలో సగం..
వేంసూరు: గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. భర్త ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉచితంగా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఉషారాణి. వేంసూరు మండలం అమ్మపాలెం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతుల వరకు 60 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ నక్కా మోహన్రావు ఒక్కరే ఏడు తరగతులకు విద్యాబోధన చేస్తున్నారు. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఏడు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మోహన్రావు పాఠాలు బోధించడంతో మానసికంగా, శారీరంగా అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. ఇది గమనించిన ఆయన సతీమణి ఉషారాణి భర్తకు సాయంగా నిలవడంతో పాటు విద్యార్థులకు పాఠాలు బోధించాలనే సంకల్పంతో తాను కూడా పాఠశాలకు వెళ్లోంది. డీఈడీ చదవడంతో లాక్డౌన్ తరువాత పాఠశాల తెరిచిన దగ్గరి నుంచి నేటి వరకు తన భర్తతో పాటు తన రెండేళ్ల చిన్నారిని కూడా పాఠశాలకు తీసుకువెళ్లి ఎలాంటి పారితోషికం తీసుకోకుండా విద్యార్థులకు సేవ చేస్తోంది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇద్దరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. (చదవండి: రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!) -
గవర్నర్ల అలవెన్సులపై నూతన మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: గవర్నర్ల పర్యటనలు, బస, వినోదం, గృహసామగ్రికి చెల్లిస్తున్న భత్యాలపై కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసిహన్ పర్యటనలు, వసతి, వినోదం, ఇతర ఖర్చులకు రూ.53 లక్షలు, రాజ్భవన్ నిర్వహణకు రూ.18.3 లక్షలు, గృహ సామగ్రికి రూ.6 లక్షల భత్యం(మొత్తం రూ.77.3 లక్షలు) పొందుతారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అత్యధికంగా రూ.1.81 కోట్లు దక్కనుంది. తమిళనాడు గవర్నర్కు రూ.1.66 కోట్లు, బిహార్ గవర్నర్కు రూ.1.62 కోట్లు, మహారాష్ట్ర గవర్నర్కు రూ.1.14 కోట్ల భత్యాలు ఇవ్వనున్నారు. గవర్నర్ల జీతభత్యాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. -
రాష్ట్రపతి భద్రతకు 155 కోట్ల ఖర్చు
ఆగ్రా: రాష్ట్రపతి భద్రతా సిబ్బంది జీతభత్యాల కోసం గత నాలుగేళ్లలో రూ.155.4కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. లక్నోకు చెందిన నూతన్ ఠాకూర్ అనే హక్కుల కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. భద్రతా సిబ్బంది జీతభత్యాల కింద 2014–15లో 38.17కోట్లు, 2015–16లో 41.77కోట్లు, 2016–17లో 48.35కోట్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 27.11కోట్లు చెల్లించారు.భద్రతా వాహనాల నిర్వహణకు నాలుగేళ్లలో 64.9లక్షలు ఖర్చు చేశారు. వాహనాల్లో ప్రభుత్వం నిర్వహించే బంకుల్లోని పెట్రోల్ను వాడుతున్నందున ఆ ఖర్చును లెక్కల్లో చూపలేదంది. భద్రతా కారణాల రీత్యా మొత్తం సిబ్బంది, వాహనాల సంఖ్యను వెల్లడించలేమని పేర్కొంది. -
చట్టసభలు–జీతభత్యాలు
‘మనదో చిత్రమైన ప్రజాస్వామ్యం. ఇక్కడ న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకుంటారు. ఎంపీలు వాళ్ల జీతాల్ని వాళ్లే పెంచుకుంటారు’– పన్నెండేళ్ల క్రితం అప్పటి లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చేసిన వ్యాఖ్య ఇది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఎంపీల జీతభత్యాలపై విమర్శనాత్మక వ్యాఖ్య పార్లమెంటులో వినబడింది. బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ జీరో అవర్లో దీన్ని లేవనెత్తుతూ కనీసం ఈ లోక్సభ కాలపరిమితి వరకూ మనం దాని జోలికి పోవద్దని కోరారు. అయితే ఆయనకు ఎవరినుంచీ పెద్దగా మద్దతు లభించలేదు. రాజ్యాంగంలోని 106, 195 అధికర ణాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతభత్యాలను తామే పెంచుకునే అధికారాన్నిస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకాల కోసం ఉన్న కొలీజియం వ్యవస్థకు బదులు న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు పార్లమెంటు ఒక చట్టం చేయడం, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం చరిత్ర. చట్టసభల సభ్యుల జీత భత్యాలకు సంబంధించి అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. అయితే సోమనాథ్ ఛటర్జీ కేవలం వ్యాఖ్యానించి ఊరుకోలేదు. ఈ అంశంపై ఒక అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో దాదాపు అన్ని పార్టీల నేతలూ ఈ విధానం సరైంది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీతభత్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అది అక్కడే ఆగిపోయింది. ఈ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, జీతభత్యాల కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుగానీ రూపొం దించే ప్రయత్నమే జరగలేదు. ఈలోగా మూడు, నాలుగు దఫాలు ఎంపీల జీత భత్యాలు మాత్రం పెరిగాయి. ఎంపీల జీతభత్యాలపై ఉభయ సభల సభ్యులతో ఒక కమిటీ ఉంటుంది. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కమిటీ నిరుడు ఎంపీల జీతభత్యాలు సవరిస్తూ సిఫార్సు చేసింది. అంతా పారదర్శకంగా, హేతుబద్ధంగా సాగుతుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. దాన్ని ప్రశ్నించేవారు కూడా ఉండరు. అలా లేనప్పుడే సమస్య అవు తుంది. ఏ ప్రమాణాల ఆధారంగా జీతభత్యాల పెంపు చేస్తున్నారో ఎవరికీ తెలి యదు. వరుణ్గాంధీ బ్రిటన్ ఎంపీలతో తెచ్చిన పోలిక ఆలోచించదగ్గది. అక్కడి ఎంపీల జీతభత్యాలు గత పదేళ్లలో 13 శాతం పెరిగితే, మన ఎంపీలకు 400 శాతం పెరిగాయని ఆయన వివరించారు. బ్రిటన్ ఎంపీల జీతాల అంశాన్ని పరిశీలించేం దుకు ఒక స్వతంత్ర సంస్థ ఉంది. ఆస్ట్రేలియాలో సైతం ఇలాంటి ఏర్పాటే చేసుకు న్నారు. ఈ కారణం వల్లనే కావొచ్చు... ఆ దేశాల ఎంపీల జీతభత్యాల పెరుగుదల మరీ అతిగా లేదు. మన దేశంలో చిత్రమైన పరిస్థితి. సాగు ఖర్చు అపరిమితంగా పెరిగి, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక చివరకు అప్పుల ఊబిలో కూరు కుపోయి ఏం చేయాలో దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ దేశవ్యాప్తంగా 1,600మంది రైతులకు పైగా బలవన్మరణాల పాలయ్యారు. కేంద్రంలో పాలకులెవరున్నా రైతుల వ్యథ తీరడం లేదు. కానీ చట్ట సభల సభ్యులకు మాత్రమే కాదు... కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల జీతభ త్యాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. 1970లో గోధుమ మద్దతు ధర క్వింటాల్కు రూ. 76గా ఉంటే ఇప్పుడది రూ. 1,625 అయింది. అంటే ఈ 47 ఏళ్ల లోనూ 21 రెట్లు పెరిగింది. మిగిలిన పంటల మద్దతు ధరలు కూడా అంతంత మాత్రమే. ఇదే కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది జీతాలు దాదాపు 150 శాతం పెరిగాయి. ఇలాంటి వ్యత్యాసాలు బాహాటంగా కనిపిస్తున్నప్పుడు కనీసం తమవరకైనా సంయమనం పాటించాలన్న స్పృహ చట్టసభల సభ్యులకు ఉండాలి. 2001లో రూ. 12,000గా ఉన్న ఎంపీ జీతం నిరుడు పెంచిన తర్వాత రూ. 1,00,000 అయింది. తమ పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, రుణమాఫీ వర్తింపజేయాలని తమిళనాడు రైతులు గత కొన్ని నెలల నుంచి సాగిస్తున్న ఆందో ళన ఇంకా విరమించలేదు. వారి సమస్య మాటేమోగానీ తమిళనాడు అసెంబ్లీ గత వారం ఎమ్మెల్యేల జీతాలను రూ. 55,000 నుంచి ఒక్కసారిగా రూ. 1,05,000కు పెంచుతూ తీర్మానించింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకునే మహా రాష్ట్రలో నిరుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు రూ. 75,000 నుంచి ఒకేసారి రూ. 1,70,000కు పెరిగాయి. చిత్రమేమంటే ఇలా పెంచినప్పుడు చట్టసభల్లో కనీసం ఒక్క నిరసన స్వరమైనా వినబడటం లేదు. ఆమధ్య ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి కొన్ని మినహా చాలా దేశాల్లో ఎంపీల జీతభత్యాల పెంపును అక్కడి చట్టసభల్లోనే నిర్ణయిస్తారు. అమెరికాలో వివిధ రాష్ట్రాలు వివిధ రకాల విధానాలను అనుసరిస్తున్నాయి. దాదాపు 19 రాష్ట్రాలు ఎంపీల జీతభత్యా లపై కమిషన్లు ఏర్పాటు చేయగా కొన్నిచోట్ల చట్టసభలే ఆ నిర్ణయం తీసుకుం టాయి. మరికొన్ని రాష్ట్రాలు కమిషన్ నిర్ణయాలను సభలో చర్చించి వాటిని సవరిం చుకునే స్వేచ్ఛను దఖలు పరచుకున్నాయి. మన రాజ్యాంగ నిర్మాతలు అప్పట్లో వివిధ దేశాల రాజ్యాంగాలనూ, అక్కడి పాలనా సంప్రదాయాలనూ అధ్యయనం చేశారు. ఆ సమయంలో చాలాచోట్ల చట్టసభల నిర్ణయమే అంతిమంగా ఉండేది కనుక ఆ ఒరవడినే బహుశా ఇక్కడా కొనసాగించి ఉండొచ్చు. అయితే వరుణ్గాంధీ చెప్పినట్టు ఎంపీల జీతభత్యాలు దశాబ్దకాలంలో 400 శాతం పెరగడం ఆరోగ్యకర ధోరణిని ప్రతిబింబించదు. కనీసం ఇలా పెంచినప్పుడు చర్చ జరగడం, ఆ నిర్ణ యంపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడటమనే సంప్రదాయం ఉంటే అందులోని మంచిచెడ్డలు ప్రజలందరికీ అర్ధమవుతాయి. అలాకాక అన్ని పార్టీలూ మౌనంగా ఉండిపోవడం ద్వారా ఆమోదముద్ర వేస్తుంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ప్రతి అంశంపైనా చట్టసభల్లో చర్చ జరగడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్య కర లక్షణం. అది ఎటూ లేదు. కనీసం తమ జీతాల విషయంలోనైనా దాన్ని పాటిం చడం అత్యవసరమని ప్రజాప్రతినిధులు గుర్తించాలి.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
Advertisement