breaking news
RTC Loss
-
నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం
ఆర్టీసీ ఆర్ఎం రవికుమార్ తుని : రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం వచ్చిందని ఆర్టీసీ ఆర్ఎం సి.రవికుమార్ తెలిపారు. తుని డిపోలో వివిధ విభాగాలను మంగళవారం పరిశీలించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) తగ్గడంతో ఏప్రిల్ నుంచి జూలై వరకూ అన్ని డిపోలూ కలిపి రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం ఓఆర్ 65 శాతం ఉందన్నారు. కిలోమీటరుకు రూ.32 ఖర్చవుతుండగా, రూ.26 ఆదాయం వస్తోందన్నారు. నష్టాల భర్తీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాలకు రీజియన్ నుంచి రోజుకు 70 నుంచి వంద ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆయన వివరించారు. అలాగే పార్సిల్ సర్వీసు ద్వారా రూ.కోటి ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఇన్స్పెక్టరు వై.చెల్లారావు ఉన్నారు. -
పీకల్లోతు నష్టాల్లో నెక్
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోన్ పరిధిలోని నార్త్ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుకు మూడడుగులు వెనుకకు ఆరడుగులు అన్న చందం గా తయారైంది. ప్రతీనెలా డీజిల్ ధర పెంపు విధానం, ప్రైవేటు వాహనాల జోరు వంటి పలు అంశాలు ఆయా డిపోలను పూర్తిగా నష్టాల ఊబిలోకి నెడుతున్నాయి. అదే విధం గా సర్వీసుల్లో సమయపాలన పాటించకపోవ డం, కాలం చెల్లిన బస్సులు నడపడం, కొన్ని బస్సులను రద్దు చేయడం, అద్దె బస్సుల ను తీసుకోవడం, నిర్వహ ణ వ్యయం తడిసిమోపెడవడం తదితర సమస్యలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతోంది. నెక్ రీజియన్లో మొత్తం తొమ్మిది డిపోలకు కలిపి రోజుకు రూ. 49.45 లక్షల మేర నష్టం వస్తోంది. మరోవైపు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నాలుగు నెలలుగా అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నష్టాలకు సవాలక్ష కారణాలు... నెక్ రీజియన్ పరిధిలోని విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్కోట, సాలూరు, పార్వతీపురం డిపోలు, శ్రీకాకుళం జిల్లాలో ని శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, పలాస, టెక్కలి డిపోలున్నాయి. ఈ డిపోల్లో 839 సర్వీసుల్లో 908 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 213 అద్దెబస్సులున్నాయి. మిగిలిన సర్వీసులన్నింటిలో సంస్థ సొంత బస్సులు నడుస్తున్నాయి. అన్ని డిపోల్లో ఆ యా కేటగిరీల్లో మొత్తం 4,411 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు రోజుకు 6.65 లక్షల మంది కి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నా రు. రీజయన్లోని అన్ని డిపోల బస్సులు కలిపి రోజు కు 2.75 లక్షల కిలోమీటర్లమేర తిరుగుతున్నాయి. కనీసం 5 కిలోమీటర్లకు ఒక లీటరు చొప్పున తీసుకున్నా రోజుకు సుమారు 55 వేల లీటర్ల డీజిల్ విని యోగమవుతోంది. తాజాగా ఉన్న లీటరుకు రూ.60 ధర వేసుకున్నా డీజిల్ కొనుగోలు కోసం రోజుకు సుమారు రూ.33 కోట్ల వరకూ వెచ్చించాలి. రోజులో నిర్వహించిన సర్వీసులల్లో కిలోమీటరుకు దాదాపు రూ. 33 ఆదాయం రావాల్సి ఉండగా,కేవలం రూ.21 లు మాత్రమే వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు ఆయిల్ కంపెనీతో జరుపుకొన్న ఒప్పం దం మేరకు ప్రతి నెల లీటరుకు 60 పైసల ధర పెం చాల్సి ఉంది. ఈ రూపంలో నెలదాటిన ప్రతిసారీ డీజిల్ పెరగడం మూలంగా ఏడాదికి సుమారు మూ డు లక్షల రూపాయలు అధనపు భారం పడుతోంది. మరోవైపు ప్రైవేటు వాహనాల జోరు ఆర్టీసీకి మరిం త ఇబ్బందిగా మారింది. దీంతో నెక్ పరిధిలో రోజు కు సరాసరిన రూ.49.65 లక్షలమేరకు నష్టం వస్తోంది. ప్రైవేటు వాహనాల జోరు నెక్ పరిధిలోని రెండు జిల్లాలో ఏప్రిల్ నెలఖరు లెక్క ల మేరకు ప్రైవేటు వాహనాలు 10,077 వరకు ఉన్నా యి. వీటిలో డీలక్స్ సర్వీసులపై ప్రభావం చూపే హైదరాబాద్, విజయవాడ వంటి దూరప్రాంతాల రాకపోకలు సాగించే బస్సులు 10 వరకు మాత్రమే ఉ న్నాయి. కానీ పల్లెవెలుగు బస్సులపై రూట్లలో తిరిగే మాక్సీ క్యాబ్స్, జీపులు 2,260 వరకు ఉన్నాయి. అదే విధంగా ఆటోలు అత్యధికంగా 7,809 వరకు ఉన్నా యి. ప్రైవేటు వాహనాలు డిపోలు, బస్టాండ్ల ముం దుకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా ఆర్టీసీ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అకారణంగా బస్సు సర్వీసుల రద్దు సరిపడా ప్రయాణికులు ఉండడం లేదని, అవసరం మేరకు డ్రైవర్లు, కండక్టర్లు లేరన్న సాకుతో నెల రోజు ల కిందట కొన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. నష్టాల బాటన నడుస్తున్నాయన్న సాకుతో మరికొన్ని బస్సులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు రూట్లలో పల్లెవెలుగు బస్సులను నపడం లేదు. ఆ మార్గాల్లో ఆటోలు, జీపులు ఎక్కువగా తిరుగుతుం డంతో ఓ.ఆర్.తగ్గిందని సాకుగా చూపిస్తున్నారు. -
బంద్.. సంపూర్ణం
సాక్షిప్రతినిధి, నల్లగొండ, అధికార పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి పిలుపుతోనే సత్తా చాటింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. పలుచోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బంద్లో పాల్గొనడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జాతీయ రహదారిపై చౌటుప్పల్, టేకుమట్ల, నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డును దిగ్బంధించడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి ఒక్క వాహనమూ సరిహద్దు దాటలేదు. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రా రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను నిరసిస్తూ ప్రధాని మోడి, చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. బంద్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా పాల్గొనడంతో ఒక్క బస్సూ రోడ్డెక్కలేదు. బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, పార్టీ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్యలు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్లు తమ తమ నియోజకవర్గాల్లో బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదిర పార్టీలు సైతం బంద్కు సహరించి ర్యాలీల్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ నష్టం రూ. 70 లక్షలు నల్లగొండ రీజియన్లో 728 బస్సులు, ఆయా డిపోల్లోనే నిలిచిపోయాయి. దీంతో దాదాపు *70లక్షల రోజువారీ ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. బంద్కు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడ మద్దతు తెలపడంతో డిపోల నుంచి బస్సులు బయటికి కదల్లేదు. నల్లగొండ : నల్లగొండలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట మూడు గంటలకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, ప్రైవేటు సంస్థలు, ప్రభు త్వ కార్యాలయాలు, వర్తక, వాణిజ్య సంస్థలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్లో పాల్గొన్నారు. మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సంస్థలు మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా బస్టాండు ఎదుట ధర్నాలు నిర్వహించారు. తెలంగాణా జాగృతి సంస్థ, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేములపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దామరచర్లలో ఇండియా సిమెంట్ గేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. సూర్యాపేట : బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్సు డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం బైక్లపై పట్టణంలో మధ్యాహ్నం వరకు తిరుగుతూ వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. బంద్కు జేఏసీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మద్దతు ప్రకటించాయి. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. భువనగిరి : బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. భువనగిరి, భూదాన్పోచంపల్లి, బీబీనగర్, వలిగొండల్లో బంద్ స్వచ్ఛందంగా జరిగింది. భువనగిరి పట్టణం, వలిగొండలో జరిగిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పాలొన్నారు. పోచంపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. ఆలేరు : యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆలేరులో టీఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. న్యూడెమొక్రసీ, టీఆర్ఎస్లు ర్యాలీలు చేపట్టాయి. రాజపేటలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బొమ్మలరామారం మండలం రంగాపురం చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తుర్కపల్లిలో రాస్తారోకో చేశారు. దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. దేవరకొండలో టీఆర్ఎస్, సీపీఎం నాయకులు బస్టాండు ఎదురుగా రాస్తారోకో చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బంద్కు మద్దతుగా సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నకిరేకల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పెట్రోల్ బంక్లు, సినిమా థియేటర్లు నడవలేదు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు. టీఆర్ఎస్ మండల కమిటీ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ప్రదర్శన జరిపారు. సీపీఎం ఎంఎల్ నూడెమెక్రసీ, బహుజన కమ్యూనిస్టు పార్టీ (బీసీపీ) ఆధ్వర్యంలో ర్యాలీలు జరిపారు. చిట్యాలలో టీఆర్ఎస్వీ ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామన్నపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నార్కట్పల్లిలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలను మూసివేయించారు. హాలియా : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దుకాణాలు మూసివేయించారు. హాలియా, నిడమనూరు. త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, నాగార్జునసాగర్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ, ధర్నా, రాస్తారోకో చేశారు. కోదాడ : కోదాడ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీఆర్ఎస్ పార్టీతో పాటు టీజేఏసీ, న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐలు వేర్వేరుగా బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. తెలంగాణ-ఆంధ్ర ప్రాంత సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆంధ్ర ప్రాంత వాహనాలను అడ్డుకున్నారు. తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గంలో వ్యాపార , వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు మూత పడ్డాయి. తిరుమలగిరిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోత్కూర్, శాలిగౌరారం, నూతన్కల్, తుంగతుర్తి, అర్వపల్లిలలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. హుజూర్నగర్ : హుజూర్నగర్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు బంద్ పాటించాయి. వివిధ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మఠంపల్లిలో టీఆర్ఎస్, సీపీఎం నాయకులు, గరిడేపల్లిలో టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, జేఏసీ నాయకులు, నేరేడుచర్లలో టీఆర్ఎస్, సీపీఎం, జేఏసీల ఆధ్వర్యంలో మేళ్లచెరువులో టీఆర్ఎస్, సీపీఎంల ఆధ్వర్యంలో రాస్తారోకోలు జరిగాయి. మునుగోడు : మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో హైవేపై టీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బంద్ లో పాల్గొన్నారు. చండూరులో ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో చేశారు. సంస్థాన్నారాయణపురంలో వ్యాపారసంస్థలను బంద్ చేయించి, ధర్నా నిర్వహిం చారు. మర్రిగూడలో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.