-
మాస్క్ల పేరుతో చందాల దందాలు
నెల్లూరు: మాస్క్ల వితరణ పేరుతో చందాల దోపిడీలు చేసే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి నిజాయతీ పరుడైన మంత్రి అనిల్కుమార్యాదవ్ను విమర్శించే స్థాయి లేదని జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు పీ రూప్కుమార్యాదవ్ విమర్శించారు. నగరంలోని జలవనరులశాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కోటంరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా వైరస్ ప్రబలిన నెల తర్వాత మేల్కొన్న కోటంరెడ్డి రోజుకు ఐదో పదో మాస్కులు ఇస్తూ అందు కోసం రియల్టర్లు, కాంట్రాక్టర్ల వద్ద చందాలు దండుకుని దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సేవా కార్యక్రమాలు (భోజనం, నిత్యావసరాలు తదితరాలు పంపిణీ) చేయడం వల్ల కరోనా ప్రబలే పరిస్థితులు ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ఎవరు పడితే వారు పంపిణీ చేయరాదని ప్రభుత్వం అధికార ప్రకటనను దృష్టిలో ఉంచుకుని దాతల దగ్గరున్న ప్రభుత్వ కార్యాలయాలు (వార్డు సచివాలయాలు, తహసీల్దార్, నగరపాలక సంస్థ కార్యాలయాలు) అందజేయాలని మంత్రి పిలుపునిచ్చారని తెలిపారు. అయితే శ్రీనివాసులరెడ్డితో పాటు కొంత మంది భద్రతా సూచనలకు సహకరించాల్సింది పోయి చౌకబారు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. నాణ్యతలేని మాçసు్కలను కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి డాక్టర్లకు ఇవ్వాలని కోటంరెడ్డి కోరారని ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి తన దోపిడీ దందాలోకి తన కుమారుడిని తీసుకురావడం బాధాకరమన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. మంత్రి అనిల్కుమార్ తొలిరోజు నుంచి ప్రజల మధ్యనే ఉన్నారన్నారు. తన సొంత నిధులు రూ.15 లక్షలతో మాసు్కలు, శానిటైజర్లు కొనుగోలు చేసి వైద్యులు, ప్రజలకు అందజేశారన్నారు. ఇప్పటి వరకు 80 వేల మాసు్కలు, 60 వేల శానిటైజర్లు, వేలాది పీపీఈ కిట్లను అందజేయడంతో పాటు రెడ్జోన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా నియంత్రణకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందజేశారన్నారు. ప్రస్తుత తరుణంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరుణంలో నీచ నికృష్ణ రాజకీయాలు చేయడం హేయమన్నారు. సాయం చేయాలనే పెద్ద మనస్సు లేకపోయినా పర్వాలేదు.. కానీ పేదలకు జరిగే మంచిపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. -
పోలీసులకు సవాలుగా మారిన రూప్కుమార్ ఆచూకీ
గాలింపు చర్యలు వేగవంతం చేసిన పోలీసులు తోటపల్లిగూడూరు: భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిపై కాల్పులు చేసి పరారీలో ఉన్న వేముల రూప్కుమార్ను పట్టుకోవడం స్థానిక పోలీసులకు సవాలుగా మారింది. కాల్పులు జరిగిన నెల రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్న నిందితుడు రూప్కుమార్ జాడ మాత్రం తెలియరాలేదు. సౌత్ఆములూరుకు చెందిన బావ, అల్లుడు అయినా వేముల రూప్కుమార్, రంగినేని కిరణ్ మధ్య కోడూరు పంచాయతీ పీడీ కండ్రిగలో 4 ఎకరాల భూమికి సంబంధించి కొద్ది కాలంగా భూ వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో గత నెల ఏప్రిల్ 1వ తేదీన పీడీ కండ్రిగలోని ఈ వివాదాస్పద పొలాల్లో వేమల రూప్కుమార్ తన వద్దనున్న రివాల్వర్తో కిరణ్పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రూప్కుమార్ పరారీలో ఉన్నారు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా పోలీసులు నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇటీవల వారం రోజుల పాటు స్థానిక ఎసై్స రామకృష్ణ తన సిబ్బందితో కలిసి రూప్కుమార్ వ్యాపారాలు సాగించే బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీనిపై ఎసై్స రామకృష్ణమాట్లాడుతూ పరారీలో ఉన్న రూప్కుమార్ కోసం గాలిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితుడుని అరెస్ట్ చేస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement