breaking news
Roop Kumar
-
ఎంత కావాలి.. ఎక్కడికి పంపాలి? అంటూ టీడీపీ నేత రూప్ కుమార్ డీల్
-
ఎంత కావాలి.. ఎక్కడికి పంపాలి?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి పార్టీల నేతల తీరు చూస్తుంటే దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. క్వార్ట్ ్జ, ఇతర మైన్స్, ఇసుక, మద్యం.. ఇలా ఏది తీసుకున్నా ప్రతి అక్రమ వ్యవహారంలో వారే అసలు దోపిడీ దారులుగా కనిపిస్తున్నారు. నింద మాత్రం వైఎస్సార్సీపీ నేతలపై వేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కీలక అనుచరుడు రూప్కుమార్ యాదవ్ చెన్నైలోని వీఎన్ఎస్ కంపెనీ డీలర్తో సాగించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి లీక్ అయిన ఆడియోనే ఇందుకు నిదర్శనం. దీంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రుస్తుం మైన్ చుట్టూ తిరుగుతున్న అక్రమ మైనింగ్ భేతాళ కథలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని తేలిపోయింది. ‘నేను టీడీపీ లీడర్ రూప్కుమార్ను మాట్లాడుతున్నా.. మీకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.. జిల్లాలో ఏ ఏరియా నుంచి అయినా మైకా క్వార్ట్జ్ మెటీరియల్ను సరఫరా చేస్తా.. క్వాలిటీ మెటీరియల్ పంపిస్తా.. మీకు ఎలా పంపాలో చెప్పండి.. రోడ్డు, రైలు మార్గం ఏదైనా సరే.. ఎంత క్వాంటిటీ అయినా సరఫరా చేస్తా..’ అంటూ డీల్ చేసుకున్న ఆడియో వెలుగు చూడటంతో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ వ్యవహారం బట్టబయలైంది.క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఇలా..నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరి మండలంతో పాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే క్వార్ట్జ్ ఫల్స్పర్, వర్ముఖ్లైట్ ఖనిజానికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. ఒక్క సైదాపురంలోనే మూత పడిన గనులు 26 ఉండగా, అధికారికంగా 40 ఓపెన్ క్వారీలు ఉన్నాయి. వీటిలో మరో వందేళ్ల వరకు తరగని మైకా క్వార్ట్ ్జ నిల్వలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఎంపీ వేమిరెడ్డి, ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. గనుల యజమానులను బెదిరించి తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. చైనాతో వ్యాపారం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎనిమిది నెలల పాటు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఆపై యజమానులతో నయాన, భయనా డీల్ కుదుర్చుకున్నారు. గనుల్లో నుంచి వచ్చే ప్రతి టన్ను క్వార్ట్జ్ మెటీరియల్ తాము చెప్పిన ధరకే ఇవ్వాలనే డిమాండ్తో అనుమతులు ఇప్పించి వ్యాపారం చేసుకుంటున్నారు.ఏడాదికి 5 లక్షల టన్నులు ఈ ప్రాంతంలో నెలకు 30 వేల నుంచి 50 వేల టన్నుల మైకా క్వార్ట్ ్జ ఖనిజాన్ని తవ్వి ఎగుమతులు చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి టన్నుకు రూ.230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సైదాపురం ఖనిజానికి చైనా మార్కెట్లో గ్రేడ్ను బట్టి టన్ను రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ మండలం నుంచే రోజూ వెయ్యి టన్నులు, ఇతర ప్రాంతాల నుంచి మరో 500 టన్నుల వంతున నెలకు 45 వేల టన్నులు తరలిస్తున్నారు. అంటే ఏటా 5 లక్షల టన్నుల పైనే అన్నమాట. నాణ్యత గ్రేడ్లను బట్టి టన్ను రూ.25 వేల నుంచి రూ.2 లక్షలు పలుకుతోంది. నెలకు దాదాపు రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఖనిజాన్ని అనధికారికంగా సొంతం చేసుకున్న ఎంపీ వేమిరెడ్డి.. ప్రభుత్వ కీలక నేతకు నెలకు రూ.30 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో దొరికే క్వార్ట్ ్జను నేరుగా చెన్నై నౌకాశ్రయం ద్వారా చైనాకు ఎగుమతులు చేస్తున్నట్లు తెలుస్తోంది.రుస్తుం మైన్ పేరుతో భేతాళ కుట్రలుఅక్రమ మైనింగ్ దందాను మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, పోలుపోయిన అనిల్కుమార్ యాదవ్ తరచూ ప్రశ్నిస్తుండడంతో టీడీపీ పెద్దలు కుట్రలకు తెరలేపారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్లో అక్రమ తవ్వకాలు చేశారంటూ భేతాళ కుట్రలు పన్ని వారిని కేసుల్లో ఇరికించారు. ఇప్పటికే కాకాణిపై పలు అక్రమ కేసులు బనాయించి రెండు నెలలుగా జైల్లో ఉంచారు. ఇంకా అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది.తాజాగా అనిల్ కుమార్ యాదవ్నూ అదే కేసులో ఇరికించారు. కాకాణి అనంతరం అక్రమ కేసుల వంతు బీసీ నేత అనిల్కుమార్ యాదవ్పై పడింది. రుస్తుం మైన్తో సంబంధం లేని వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకుని అనిల్ కుమార్ యాదవ్ పేరు బలవంతంగా చెప్పించి.. తప్పుడు వాంగ్మూలం తీసుకుని జైలుకు పంపారు. ఇప్పటికే ఆయన వ్యక్తిగత సహాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. వీరి పాత్ర ఉన్నట్లుగా అభూత కల్పనలు అల్లుతున్నారు. ఎల్లో మీడియాలో కట్టుకథలు రాయిస్తున్నారు. చివరకు అనిల్ కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్ట్ చేసే వరకు ఎల్లో మీడియాలో పుంఖాను పుంఖానులుగా కథనాలు రాయిస్తున్నారు. -
మాస్క్ల పేరుతో చందాల దందాలు
నెల్లూరు: మాస్క్ల వితరణ పేరుతో చందాల దోపిడీలు చేసే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి నిజాయతీ పరుడైన మంత్రి అనిల్కుమార్యాదవ్ను విమర్శించే స్థాయి లేదని జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు పీ రూప్కుమార్యాదవ్ విమర్శించారు. నగరంలోని జలవనరులశాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కోటంరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా వైరస్ ప్రబలిన నెల తర్వాత మేల్కొన్న కోటంరెడ్డి రోజుకు ఐదో పదో మాస్కులు ఇస్తూ అందు కోసం రియల్టర్లు, కాంట్రాక్టర్ల వద్ద చందాలు దండుకుని దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సేవా కార్యక్రమాలు (భోజనం, నిత్యావసరాలు తదితరాలు పంపిణీ) చేయడం వల్ల కరోనా ప్రబలే పరిస్థితులు ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ఎవరు పడితే వారు పంపిణీ చేయరాదని ప్రభుత్వం అధికార ప్రకటనను దృష్టిలో ఉంచుకుని దాతల దగ్గరున్న ప్రభుత్వ కార్యాలయాలు (వార్డు సచివాలయాలు, తహసీల్దార్, నగరపాలక సంస్థ కార్యాలయాలు) అందజేయాలని మంత్రి పిలుపునిచ్చారని తెలిపారు. అయితే శ్రీనివాసులరెడ్డితో పాటు కొంత మంది భద్రతా సూచనలకు సహకరించాల్సింది పోయి చౌకబారు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. నాణ్యతలేని మాçసు్కలను కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి డాక్టర్లకు ఇవ్వాలని కోటంరెడ్డి కోరారని ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి తన దోపిడీ దందాలోకి తన కుమారుడిని తీసుకురావడం బాధాకరమన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. మంత్రి అనిల్కుమార్ తొలిరోజు నుంచి ప్రజల మధ్యనే ఉన్నారన్నారు. తన సొంత నిధులు రూ.15 లక్షలతో మాసు్కలు, శానిటైజర్లు కొనుగోలు చేసి వైద్యులు, ప్రజలకు అందజేశారన్నారు. ఇప్పటి వరకు 80 వేల మాసు్కలు, 60 వేల శానిటైజర్లు, వేలాది పీపీఈ కిట్లను అందజేయడంతో పాటు రెడ్జోన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా నియంత్రణకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందజేశారన్నారు. ప్రస్తుత తరుణంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరుణంలో నీచ నికృష్ణ రాజకీయాలు చేయడం హేయమన్నారు. సాయం చేయాలనే పెద్ద మనస్సు లేకపోయినా పర్వాలేదు.. కానీ పేదలకు జరిగే మంచిపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. -
పోలీసులకు సవాలుగా మారిన రూప్కుమార్ ఆచూకీ
గాలింపు చర్యలు వేగవంతం చేసిన పోలీసులు తోటపల్లిగూడూరు: భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిపై కాల్పులు చేసి పరారీలో ఉన్న వేముల రూప్కుమార్ను పట్టుకోవడం స్థానిక పోలీసులకు సవాలుగా మారింది. కాల్పులు జరిగిన నెల రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్న నిందితుడు రూప్కుమార్ జాడ మాత్రం తెలియరాలేదు. సౌత్ఆములూరుకు చెందిన బావ, అల్లుడు అయినా వేముల రూప్కుమార్, రంగినేని కిరణ్ మధ్య కోడూరు పంచాయతీ పీడీ కండ్రిగలో 4 ఎకరాల భూమికి సంబంధించి కొద్ది కాలంగా భూ వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో గత నెల ఏప్రిల్ 1వ తేదీన పీడీ కండ్రిగలోని ఈ వివాదాస్పద పొలాల్లో వేమల రూప్కుమార్ తన వద్దనున్న రివాల్వర్తో కిరణ్పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రూప్కుమార్ పరారీలో ఉన్నారు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా పోలీసులు నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇటీవల వారం రోజుల పాటు స్థానిక ఎసై్స రామకృష్ణ తన సిబ్బందితో కలిసి రూప్కుమార్ వ్యాపారాలు సాగించే బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీనిపై ఎసై్స రామకృష్ణమాట్లాడుతూ పరారీలో ఉన్న రూప్కుమార్ కోసం గాలిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితుడుని అరెస్ట్ చేస్తామన్నారు.