breaking news
Reservation charge
-
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్ప్రెస్లుగా, పండుగ స్పెషల్గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
ప్రయాణికుల సొమ్ము ఆర్టీసీ పాలు
సాక్షి, హైదరాబాద్: బస్సు రిజర్వేషన్ టికెట్ను ఒకసారి పోస్ట్పోన్ లేదా ప్రిపోన్ చేసుకుంటే ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి ఆర్టీసీ అవకాశం కల్పించడం లేదు. ప్రయాణ తేదీని ఒకసారి మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఆర్టీసీ.. ఆ తర్వాత టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు టికెట్ మొత్తాన్ని వదులుకోవాల్సి వస్తోంది. రైల్వేలో రిజర్వేషన్ చార్జీ మినహాయించుకొని టికెట్ సొమ్మును వాపసు ఇస్తుండగా.. ఎయిర్లైన్స్ సంస్థలు కూడా కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నాయి. ఆర్టీసీ మాత్రం టికెట్ రద్దు చేసుకోవడానికి అవకాశం కల్పించకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ. 25 కోట్లు కొత్త బస్సులు కొనేందుకు బడ్జెట్ నిధుల్లోంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 25 కోట్లు విడుదల చేసింది. ఆర్టీసీకి కేటాయించిన రూ. 100 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.