breaking news
Registration rainfall
-
చినుకు రాలదు.. చింత తీరదు!
- ముఖం చాటేసిన వరుణుడు - మొలకదశలోనే ఎండుతున్న పంటలు - గతం కంటే తక్కువ వర్షపాతం నమోదు - కమ్ముకుంటున్న కరువుఛాయలు జిల్లాను కరువుచాయ కమ్ముకుంటోంది.. బోరుబావుల్లో నీరింకిపోయింది. చినుకు రాలకపోవడంతో మట్టిలో పోసిన విత్తనం మాడిపోయింది. రెక్కలుముక్కలు చేసుకున్న అన్నదాత కష్టమంతా మట్టిపాలైంది. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసి.. ఎదురుచూసి ఆశ ఆవిరైంది. వాడుపట్టిన మొలకలు చూసి రైతుగుండె తరుక్కుపోతోంది. అచ్చంపేట జిల్లాలో వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చినుకు కురవకపోవడంతో మెట్టపంటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గంలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, వంగూరు మండలాల పరిధిలో 50శాతం మంది రైతులు విత్తనాలు విత్తారు. నీటి వనరులు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో భూమిని తడిపి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెట్టరైతులు మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఎకరా పత్తిసాగుకు రూ.15వేల పెట్టుబడి అవుతుంది. వర్షాలు కురవకపోతే మళ్లీ ైరె తులు దుక్కిదున్ని సాగుచేయాలంటే రెట్టింపు ఖర్చవుతోంది. అచ్చంపేట వ్యవసాయశాఖ సబ్డివిజన్ పరిధిలోఖరీఫ్సాగు విస్తీర్ణం 25,890 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 13,450 హెక్టార్లు సాగుచేశారు. పత్తి పంటలు మొలకెత్తకుండా భూమిలోనే వాడిపోయాయి. బిందెలతో పంటలకు నీళ్లు కొత్తూరు: ఈ ఏడాది సరైన వర్షాలు కురియక రైతులు సాగుచేసిన పంటలను రక్షించుకోవడానికి నానాఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్రెడ్డి రెండెకరాల్లో టమాట తోటను సాగుచేశాడు. వర్షాలు ముఖం చాటేయడంతో పంట ఎండుతుంది. దీంతో ఎలాగైన పంటను రక్షించుకోవాలనే తపనతో కూలీల సాయంతో పంటకు బిందెలతో నీళ్లు పోయిస్తున్నాడు. తక్కువ వర్షపాతం న మోదు బాలానగర్: మండలంలో 787 హెక్టార్లలో వరిని సాగుచేశారు. 7835 హెక్టార్లలో మక్కజొన్నసాగు చేశారు.5042 హెక్టార్లలో పత్తిసాగుచేశారు. అదేవిధంగా 404 హెక్టార్లలో కందిసాగుచేశారు. అయితే విత్తనం విత్తిన నాటినుంచి వర్షాలు కురవకపోవడంతో మొలకలు వాడిపోతున్నాయి. ఇప్పటికే మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ, రాజాపూర్, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న మొక్కలు పూర్తిగా ఎండిపోయేదశలో ఉన్నాయి. జూన్లో 84 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. మండలంలో కేవలం 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే అన్నదాతలు అప్పుచేసి విత్తనాలు కొనుగోలుచేస్తే మట్టిపాలయ్యాయని లబోదిబోమంటున్నారు. ఎండిపోతున్న మొలకలు జడ్చర్ల: నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్పేట, బాలానగర్ మండలాల్లో దాదాపుగా 40వేల హెక్టార్లలో పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేశారు. పంటసాగు కోసం ఎకరాకు రూ.ఐదు నుంచి ఏడువేల వరకు ఖర్చుచేశారు. ఈలెక్కన నియోజకవర్గంలో దాదాపుగా రూ.8కోట్లకు పైగానే విత్తనాల సాగుకు వెచ్చించారు. తీరా వర్షం కురవకపోవడంతో విత్తనాలు భూమిలోనే ఇంకిపోయాయి. బోరు వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా మొలకలను కాపాడుకుంటున్నారు. దిక్కుతోచడం లేదు కురిసిన అరకొరవర్షానికి విత్తనాలు సాగుచేశాం. 9 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేశాను. వర్షం కురువకపోవడంతో సగం విత్తనాలు మొలకెత్తలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. - ఆండ్ర వెంకట్రెడ్డి, మున్ననూర్, మిడ్జిల్ మండలం వర్షంలేక మొలకలు చనిపోతున్నాయి వర్షం లేక పత్తి, మొక్కజొన్న మొలకలు చచ్చిపోతున్నాయి. ఐదెకరాలు పత్తి విత్తనాలు నాటితే ఏ ఫలితం లేకుండా ఉంది. సకాలంలో వర్షాలు లేని ఎగుడు దిగుడు కాలంతో ఏటా అప్పే మిగులుతుంది. - పెద్దశ్రీనయ్య, రైతు, మర్రిపల్లి, ఉప్పునుంతల మండలం -
వాన..హైరానా!
నాలుగు నియోజకవర్గాల్లో కుండపోత సాక్షి, బృందం: వరుణుడు హైరానా సృష్టించాడు.. రానురానంటూనే కుండపోత వాన కురిపించాడు.. నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడా అన్నదాతకు నష్టమే మిగిల్చాడు. జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 19.7 మి.మీగా నమోదైంది. మానవపాడు మండలంలో 135.0 మి.మీ, అయిజలో 118.6 మి.మీ అత్యధిక వర్షపాతం కురిసింది. అలాగే అలంపూర్, నారాయణపేట, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ఆశించినస్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి జిల్లాకేంద్రంలోని లోతట్టు కాలనీలతో పాటు మానవపాడు మండలకేంద్రంలోని పలు ఇళ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. అయిజలో కూడా రాత్రి ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు వంకలు ఏకమైపారాయి. స్థానికులు నాలుగేళ్ల క్రితం నాటి వరదలను తలుచుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. భారీవర్షం కురుస్తుండడంతో తుంగభద్ర నదీతీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మానవపాడుకు సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరడంతో విలువైన రికార్డులు తడిసిపోయాయి. అలాగే కొల్లాపూర్ మం డలంలోని రామాపురం, పెంట్లవెల్లి- మల్లేశ్వరం, మంచాలకట్ట, నార్లాపూర్- ముకిడిగుండం గ్రామాల మధ్యవాగులు పొంగిపొరాయి. వీపనగండ్ల మం డ లం గడ్డబస్వాపూర్ గ్రామంలో కొత్తచెరువు కట్ట తె గిపోవడంతో వరిపొలాల్లో ఇసుకమేటలు వేశాయి. కాగ్నా ఉధృతంగా ప్రవహించడంతోకొడంగల్, తాం డూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొడంగల్ శివారులోని నల్లచెరువు వాగుకు వచ్చిన వరద లో చిక్కుకొని జయమ్మ (50) మరణించింది. పంటనష్టం శాంతినగర్ మండలంలో మాన్దొడ్డి, రాజోలి వాగు లు పొంగి ప్రవహించడంతో సమీపంలోని మాన్దొడ్డి, నసనూరు గ్రామాల్లో సుమారు 132ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మాగనూరు మండలంలోని చెన్నిపాడు, అమరవాయి, మానవపాడు, జల్లాపురం, నారాయణపురం, పెద్ద ఆముదాలపాడు, పుల్లూరు, కలుగొట్ల, మెన్నిపాడు, మద్దూరు తదితర గ్రామాల్లో 400 ఎకరకాలకు పైగా పత్తి, మిరప, చెరుకు, జొన్న, వరి వంటి పంటలు నాశనమయ్యాయి. ఒక్కోరైతు ఎకరాకు సుమారు రూ.15వేల వరకు ఖర్చు చేశాడు. కురవక కురిసిన వర్షానికి భారీ నష్టాన్ని చవిచూశారు. పంట నష్టం అంచనాలు వేసేందుకు వ్యవసాయశాఖ జేడీ భగవత్ స్వరూప్ ఆయా మండలాల్లో పర్యటిస్తున్నారు. ఆత్మకూరు మండలంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానమైన డీ-6కాల్వకు గండిపడడంతో 50 ఎకరాల్లో పంట నీటమునిగింది. కూలిన ఇళ్లు మానవపాడు మండలంలో జల్లాపురం గ్రామంలో రెండు ఇళ్లు, ఉండవెల్లిలో నాలుగు ఇళ్లు, మానవపాడులో రెండు, ఇటిక్యాలపాడులో రెండు, బొంకూరులో రెండిళ్లు కూలిపోయాయి. కొడంగల్ మండలంలోని చిట్టపల్లి వాగు పొంగి ప్రవహించడంతో సమీపంలోని మైసమ్మతండాకు రాకపోకలు స్తంభిం చాయి. దౌల్తాబాద్, ధన్వాడ మండలాల్లో రెండిళ్లు నేలమట్టమయ్యాయి. 19.7 మి.మీ వర్షపాతం నమోదు పాలమూరు: జిల్లాలో 45 మండలాల్లో ఆశించినస్థాయిలో వర్షం కురిసింది. వీపనగండ్లలో 79.0 మి.మీ, కొల్లాపూర్ 78.2, కొడంగల్ 67.0, వడ్డేపల్లి 58.4, గద్వాల 53.6, పాన్గల్ 44.6, షాద్నగర్ 42.6, అలంపూర్ 42.4, మల్దకల్ 40.2, ఇటిక్యాల 34.2, గ ట్టు 31.0, పెబ్బేరు 29.0, అమ్రాబాద్ 27.0, ధరూర్ 26.0, కొత్తూరు 24.2, పెద్దకొత్తపల్లి 22.0, బల్మూర్ 24.4, దౌల్తాబాద్, బొంరాస్పేట 20.0, నర్వ 17.4, ఆత్మకూర్ 17.0, కొందుర్గులో 16.8, కోడేరు, కేశంపేట 15.0, వనపర్తి 12.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 30 మండలాల్లో 10 మి.మీ లోపు వర్షపాతం కురిసింది. మహబూబ్నగర్లో.. జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాలిలోతు వరదనీరు చేరింది. కలెక్టరేట్, కొత్త బ స్టాండు, న్యూటౌన్, జిల్లా ఆసుపత్రి తదితర ప్రధాన రహదారులపై వర్షపు నీరుచేరుతోంది.లోతట్టు ప్రాంతాలైన అంబేద్కర్నగర్, వీరన్నపేట, పాత అశోక్ థియేటర్ ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.