breaking news
red sander smugglers
-
'ఎర్రస్మగ్లర్ల ఆస్తుల్ని జప్తు చేస్తాం'
-డీజీపీ జెవి రాముడు తిరుపతి (చిత్తూరు జిల్లా) : ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ జెవి రాముడు తెలిపారు. ఎంతటివారైనా ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం మహానాడు ప్రాంగణ భద్రతను పరిశీలించేందుకు వచ్చిన రాముడు విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త చట్టం ప్రకారం ఎర్రచందనం నిందితులపై పోలీసులు కఠినమైన కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా చేయవచ్చునన్నారు. మునుపటిలాగా వెంటనే బెయిల్ రాకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నవారి సంపద ఏ రూపంలో ఉన్నా వదిలేదని లేదన్నారు. ఇకపై ఎర్రచందనం కేసులు ప్రూవ్ అయితే సుమారు ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడుతుందన్నారు. మహానాడుకు అతిరథమహారాథులు విచ్చేయనున్నారని వీరిలో జడ్ క్యాటగిరి కలిగినవారు కూడా ఉన్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. -
ఎర్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం
- ఎర్రచందనం అక్రమరవాణాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా - ఆస్తులను జప్తు చేసే అధికారం, బెయిల్కు వీలుకాని విధంగా కేసులు - ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్లో సమూల సవరణలు.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి విజయవాడ: ఎర్రచందనం దొంగల తాటతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ -1967లో సమూల సవరణలు తీసుకువచ్చింది. చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతున్న వారిపై ఈ సవరణలతో కొరఢా ఝుళిపించనుంది. ఎర్రచందనం దొంగలకు కళ్లెం వేసేందుకు సవరణలు తెచ్చిన ప్రభుత్వం ఎర్రచందనం చెట్ల నరికివేత, తొలగింపు, రవాణా, నిల్వ చేయడం, దొంగలకు సహకరించడం, వాహనాన్ని వినియోగించడం వంటి వాటిని తీవ్రనేరాలుగా పరిగణిస్తుంది. ఈ నేరాలలో పట్టుబడితే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, పది లక్షల రూపాయల జరిమానా విధించేలా సవరణలు తీసుకువచ్చింది. వీరికి బెయిల్ కూడా మంజూరు కాదు. తొలిసారి ఈ చట్టం కింద పట్టుబడితే 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష, 3 లక్షల రూపాయలు తగ్గకుండా జరిమానా విధిస్తారు. ఇదే నేరం కింద రెండోసారి పట్టుబడితే 7 ఏళ్లు తగ్గకుండా జైలు శిక్ష, 5 లక్షల రూపాయలకు పైబడి జరిమానా విధిస్తారు. స్మగ్లింగ్ కు వినియోగించే వాహనాల యజమానులకు ఇవే శిక్షలు అమలు చేస్తారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన నేరస్తుల ఆస్తులను జప్తు చేసేలా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. స్మగ్లర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితుల పేరున ఆస్తుల కూడబెట్టినా వాటిని కూడా జప్తు చేసే అధికారం వుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 సవరణలకు రాష్ట్రపతి ఇప్పటికే ఆమోదం తెలిపారు. 20 కేజీలకు మించి ఎర్రచందనం నిల్వ చేసిన ప్రతీవారిపై కొత్త సవరణ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతం ఎవరైనా 20 కేజీలకు మించి ఎర్రచందనం కలప వుంటే వెంటనే తమ పరిధిలోని డీఎఫ్ఓకు సమాచారం అందించాల్సి వుంటుంది. ఎర్రచందనం కేసులను డీఎస్పీ స్థాయి అధికారి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విచారిస్తారు. ఇకపై ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన అన్ని కేసులను సివిల్ కోర్టుల్లో విచారించేందుకు వీలుకాకుండా సవరణలు చేయడంతో సంవత్సరాల తరబడి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. శుక్రవారం విజయవాడలోని సీఎంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలిసిన డీజీపీ శ్రీ జేవీ రాముడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్-1967లో సవరణలపై వివరించారు. ఇక నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు సాగకుండా కట్టడి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీజీపీ సూచించారు. స్మగ్లర్లు, వారికి సహకరించేవారిపైనా కఠినంగానే వ్యవహరించాలని చెప్పారు. -
ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు
కడప: వైఎస్సార్ జిల్లా కడప కేంద్రంలో ఇద్దరు ఎర్ర చందనం దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చాపాడు మండలానికి చెందిన వీరిద్దరూ కడప జిల్లా ఒంటిమిట్ట పోలీసు స్టేషన్లోని 18 ఎర్ర చందనం దుంగలను గతవారం మాయం చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం రాత్రి పోలీసులు చాపాడు వద్ద స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరి నుంచి 18 ఎర్ర దుంగలను, రెండు బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. -
రుయా ఆస్పత్రిలో ప్రారంభమైన పోస్ట్మార్టం
-
'సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'
-
'సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో అమాయక కూలీలను హతమార్చడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి అన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎన్కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కూలీల వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, వారేమైనా కాల్పులు జరిపారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో పోరుగు రాష్ట్రాల ముందు దోషులుగా నిలిచే పరిస్థితి తలెత్తిందని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. -
20 మంది దళితులను హత్య చేశారు: చింతామోహన్