breaking news
rahukethu poojalu
-
రాహుకేతు పూజల్లో 22 మంది బ్రెజిల్ దేశస్తులు.. అందుకోసమే ఇక్కడికి!
సాక్షి, శ్రీకాళహస్తి(తిరుపతి): శ్రీకాళహస్తీశ్వరాలయానికి బ్రెజిల్ దేశస్తులు 22 మంది యువతీ, యువకులు సోమవారం విచ్చేశారు. రూ.500 టికెట్ తీసుకుని రాహుకేతు పూజలు చేయించుకున్నారు. గతంలో తమ దేశానికి చెందిన వారు ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకున్నారని, వారికి మంచి జరగడంతోనే తాము వచ్చామని తెలిపారు. ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు. చదవండి: (AP: 66 డిప్యూటీ కలెక్టర్ పోస్టులపై కసరత్తు!) -
కాళహస్తిలో గోపీచంద్ దంపతులు పూజలు
శ్రీకాళహస్తి: హీరో గోపీచంద్ దంపతులు గురువారం కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహించారు. భార్య రేష్మి, కుమారుడితో కలిసి ఆయన పూజలు చేశారు. కాగా ఈ రోజు ఉదయం గోపీచంద్ దంపతులు వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తన కుమారుడి పుట్టువెంట్రుకలు స్వామివారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నట్టు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.