breaking news
Quarter finals Matches
-
శ్రేయస్ గోపాల్ సెంచరీ.. విహారి వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23 Quarter Finals Day 2 Stumps: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో గత రెండు రోజులుగా 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి క్వార్టర్స్లో జార్ఖండ్-బెంగాల్, రెండో మ్యాచ్లో సౌరాష్ట్ర-పంజాబ్, మూడో మ్యాచ్లో ఉత్తరాఖండ్-కర్ణాటక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి వీరోచిత పోరాటం (మణికట్టు ఫ్రాక్చర్ అయినా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్కు దిగాడు), కర్ణాటర ఆటగాడు శ్రేయస్ గోపాల్ సూపర్ సెంచరీ హైలైట్గా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తొలి క్వార్టర్ ఫైనల్ జార్ఖండ్ వర్సెస్ బెంగాల్.. 65 పరుగుల ఆధిక్యంలో బెంగాల్ జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ 173 ఆలౌట్ (కుమార్ సూరజ్ 89 నాటౌట్, ఆకాశదీప్ 4/46) బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 238/5 (అభిమన్యు ఈశ్వరన్ 77, సుప్రయో చక్రవర్తి 2/68) రెండో క్వార్టర్ ఫైనల్ సౌరాష్ట్ర-పంజాబ్.. 24 పరుగుల ఆధిక్యంలో పంజాబ్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 303 ఆలౌట్ (పార్థ భట్ 111 నాటౌట్, మార్కండే 4/84) పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 327/5 (ప్రభ్సిమ్రన్ సింగ్ 126, నమన్ ధీర్ 131, యువ్రాజ్ సింగ్ 2/63) మూడో క్వార్టర్ ఫైనల్ ఉత్తరాఖండ్-కర్ణాటక.. 358 పరుగుల లీడ్లో కర్ణాటక ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 116 ఆలౌట్ (కునాల్ చండీలా 31, ఎం వెంకటేశ్ 5/36) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 474/5 (శ్రేయస్ గోపాల్ 103 నాటౌట్, మయాంక్ మిశ్రా 3/98) నాలుగో క్వార్టర్ ఫైనల్ ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్.. 235 పరుగుల వెనుకంజలో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 379 ఆలౌట్ (రికీ భుయ్ 149, కరణ్ షిండే 110, అనుభవ్ అగర్వాల్ 4/72) మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 144/4 (శుభమ్ శర్మ 51, శశికాంత్ 2/37) -
నేటి నుంచి రంజీ ట్రోఫీ క్వార్టర్స్ మ్యాచ్లు
విజయనగరం: ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ మ్యాచ్లు నేటి (బుధవారం) నుంచి వివిధ వేదికల్లో జరగనున్నాయి. విదర్భ, సౌరాష్ట్రల మధ్య జరగనున్న తొలి మ్యాచ్కు విజయనగరం ఆతిథ్యమివ్వనుంది. జాతీయ జట్టులో చోటు కోల్పోయిన పేసర్ ఉమేశ్ యాదవ్ ఈ మ్యాచ్తో గాడిలో పడాలని భావిస్తుండగా, టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా భారీ స్కోరుపై కన్నేశాడు. వాల్సాద్ (గుజరాత్)లో జరగనున్న క్వార్టర్ఫైనల్లో అస్సాం, పంజాబ్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగాల్, మధ్యప్రదేశ్ల క్వార్టర్స్కు ముంబై ఆతిథ్యమివ్వనుంది. జార్ఖండ్, ముంబై మ్యాచ్కు మైసూర్ వేదిక కానుంది.