breaking news
pothuluri veerabrahm swamy
-
కాలజ్ఞాని నివాసంపై ‘మోంథా’ పడగ
సాక్షి ప్రతినిధి, కడప/బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారి మఠం)లో నివాసం ఉన్న మట్టి మిద్దె మోంథా తుపాన్ వర్షం ధాటికి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి ఆనవాళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను మఠం నిర్వాహకులు విస్మరించడం, రాజకీయ ప్రయోజనాలు మినహా చరిత్రను పరిరక్షించుకోవాలనే స్పృహ ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం ఈ దుస్థితికి కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి 1693లో సజీవ సమాధి అయ్యారు. అటు తర్వాత గ్రామస్తులు, భక్తులు వీరబ్రహ్మేంద్రస్వామి నివాసమున్న రెండు కొట్టాల స్థానంలో మట్టి మిద్దె ఏర్పాటు చేశారు. 1982లో ముందు భాగంలో భక్తులు ఆధునికీకరణ చేపట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో పరిరక్షణచరిత్రాత్మక సంపద స్వామివారి మిద్దె, బావి పరిరక్షించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దాదాపు రూ.30లక్షలతో మిద్దెకు ప్రాకారం, చప్పట, స్వామివారు స్వయంగా తవ్విన బావి పరిరక్షణ చర్యలు చేపట్టింది. పనులు పూర్తి చేసి 2022 జూన్లో అప్పటి మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ప్రారంభించారు. రెండేళ్లుగా మఠం నిర్వాహణ ప్రభుత్వ పరిధిలో ఉంది. బాబు ప్రభుత్వం నిర్లక్ష్యంస్వామివారు నివసించిన ఇంటి పరిరక్షణ చర్యలు బాబు ప్రభుత్వంలో శూన్యమయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చరిత్రను పరిరక్షించుకోవాలనే చొరవ కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని పలువురు వాపోతున్నారు. మరోవైపు శిథిలావస్థకు చేరిందంటూ పూజలు చేసుకునే అవకాశం లేకుండా నివాసానికి తాళాలు వేసిన నిర్వాహకులు, తదుపరి పరిరక్షణ చర్యలపై శ్రద్ధ చూపలేదని భక్తులు మండిపడుతున్నారు.ఇప్పుడు బ్రహ్మంగారి మఠం అప్పుడు కాశినాయన క్షేత్రం.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి కాలజ్ఞాని నివాసం కూలిపోవడం తాజా ఉదాహరణ కాగా, ఇప్పటికే ఇలాంటి విమర్శలు వైఎస్సార్ కడప జిల్లాలో అవధూత కాశినాయన క్షేత్రం విషయంలోనూ వ్యక్తమయ్యాయి. ఈ క్షేత్రంలో భక్తులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూటమి సర్కారు అటవీశాఖ అ«ధికారులతో కూలగొట్టించిన విషయాన్ని భక్తులు గుర్తుచేసుకుంటున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో కూలగొట్టిన నిర్మాణాలను పునర్నిర్మించడంతో పాటు పెండింగ్ పనులన్నింటినీ చేయిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించి ‘మమ’ అన్పించి చేతులు దులుపుకోవడం గమనార్హం.నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం..మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు. బ్రహ్మంగారి నివాసం కూలిపోయిందంటే, ఆయన భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నట్టే! – ప్రతాప్ ఆచారి, బ్రహ్మంగారిమఠం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తీవ్ర విచారకరంతీవ్ర విచారకరమైన ఘటన ఇది. అధికారుల నిర్లక్ష్యంతోనే స్వామి వారి నివాస గృహం కూలిపోయింది. దీనికి అధికారులు ఏమని సమాధానం చెబుతారు. – డాక్టర్ వేలు ఆనందచారి, పద్మశ్రీ అవార్డు గ్రహీతతక్షణం పునర్నిర్మించాలినిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆధునీకరణ పనులు జరగలేదు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు, మఠం నిర్వాహకులు శ్రద్ధ తీసుకొని కూలిన గృహాన్ని పునర్నిర్మించాలి. – విశ్వరూపచారి, స్థానికుడు, బ్రహ్మంగారిమఠం -
పీఠాధిపతి నియామకాన్ని 2 నెలల్లో పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా, కందిమల్లయ్య పల్లె గ్రామంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి కన్నుమూసిన నేపథ్యంలో పీఠాధిపతి నియామకాన్ని రెండు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు గురువారం ఏపీ ధార్మిక పరిషత్ను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విని పీఠాధిపతి నియామకం చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ, కుమారుడు ఎన్.గోవిందస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను పీఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా దేవదాయ శాఖాధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్ను రద్దుచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మఠం పీఠాధిపతిని తాత్కాలికంగా నియమించే అధికారం ధార్మిక పరిషత్కు ఉందని స్పష్టంచేశారు. మఠాధిపతులుగా తమను నియమించాలన్న అభ్యర్థనను సింగిల్ జడ్జి పట్టించుకోలేదంటూ గోవిందస్వామి, మారుతి మహాలక్షుమ్మ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం తీర్పునిచ్చిన ధర్మాసనం.. ఇరుపక్షాల వాదనలు విని రెండునెలల్లో మఠం పీఠాధిపతి నియామకాన్ని పూర్తిచేయాలని ధార్మిక పరిషత్ను ఆదేశించింది. -
లక్షలాది ప్రజలు సచ్చేరయ:వీర బ్రహ్మం
-
వీరబ్రహ్మం సన్నిధిలో విదేశీయులు
బ్రహ్మంగారిమఠం: జర్మనీ దేశానికి చెందిన పర్యాటకులు మంగళవారం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్నారు. వీరి వెంట కలసపాడుకు చెందిన ఆర్సీఎం చర్చి నిర్వాహకులు వచ్చారు. విదేశీ పర్యాటకులకు మఠం నిర్వాకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రంలో దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.


