-
అలుగులు పారే.. అందాల జోరే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామశివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి సరిగ్గా వందేళ్లవుతోంది. ఇప్పటికీ చెక్కుచెదరని నిర్మాణమది. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1917లో శ్రీకారం చుట్టి, 1922లో పూర్తిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.27.11 లక్షలు. నిజాం ప్రభుత్వ ఇంజనీర్ ఆలీ నవాబ్జంగ్ బహద్దూర్ ఆధ్వర్యంలో 21 అడుగుల ఎత్తుతో, 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రాళ్లు, డంగు సున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ నిర్మించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. కాగా, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. రెండు మండలాల్లోని 43 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా అందుతోంది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ఏటా ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు, రబీలో ఒక ఏడాది ‘ఏ’జోన్కు, మరో ఏడాది ‘బీ’జోన్కు వంతులవారీగా 10,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తును ఐదడుగులు పెంచితే నీటినిల్వ సామర్థ్యం పెరిగి ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ డిమాండ్ను పట్టించుకునే నాథుడేలేరు. పోచారం అభయారణ్యంలో జింకల సందడి విదేశీ పక్షుల సందడి పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నదంటే విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా నైజీరియాకు చెందిన పక్షులు పెద్దసంఖ్యలో వచ్చి సందడి చేస్తాయి. ప్రాజెక్టు చూడటానికి వచ్చిన పర్యాటకులను పక్షులు ఆకట్టుకుంటాయి. పర్యాటకులు తమ కెమెరాల్లో పక్షుల ఫొటోలను బందిస్తుంటారు. అలుగులు పారే నీరు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ఎంతో శోభను సంతరించుకుంటుంది. పర్యాటకాభివృద్ధి అంతంతే.. పోచారం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. అప్పట్లో బోటింగ్ కోసం ప్రయత్నాలు జరిగినా, ముందుకు సాగలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నిర్మించిన గెస్ట్హౌస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రాజెక్టుకు వెళ్లే ముందు మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేలా టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందానికి ఆస్కారముందని జిల్లావాసులు పేర్కొంటున్నారు. వన్యప్రాణుల కోసం అభయారణ్యం... ప్రాజెక్టుకు సమీపంలో పోచారం అభయారణ్యాన్ని 1952 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్వహణ కామారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ అధీనంలో ఉండగా, అభయారణ్యం నిర్వహణను మెదక్ జిల్లా అటవీ శాఖ చూసుకుంటోంది. అభయారణ్యంలో జింకలు ఎక్కువగా కనిపిస్తాయి. సందర్శకులు వన్యప్రాణులను చూడటానికి అభయారణ్యంలో వాహనాన్ని ఏర్పాటు చేశారు. -
‘పోచారం’ వద్ద పర్యాటకుల సందడి
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద సోమవారం పర్యాటకుల సందడి నెలకొంది. చాలారోజుల తర్వాత ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి పర్యాటకులు నడుచుకుంటూ ఉత్సాహాంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద వంటలు చేసుకొని సామూహికంగా భోజనాలు చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 18ఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు ఎగువప్రాంతం నుంచి ప్రస్తుతం 285క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1461.33అడుగులతో 1.398టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ధర్నా
ఎల్లారెడ్డి: పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోచారం ప్రాజెక్టు ఎత్తును ఐదు అడుగులకు పెంచాలని అన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు త్రాగు నీరు, సాగు నీరు లభిస్తుందని అన్నారు. పోచారం ప్రాఎక్టు ఎత్తుపెంచే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అఖిల పక్షం నాయకులు అన్నారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు గయాజుద్దిన్, చిరంజీవులు, బాలకిషన్, ఇమ్రాన్, బాలరాజు, సాయిరాములు, ఏగుల నర్సింలు తదితరులు ఉన్నారు. -
‘పోచారం’ ఎత్తు పెంచితే ముప్పు తప్పదు
హవేలి ఘణాపూర్ (మెదక్): పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచితే పొలాలకు ముప్పు తప్పదని మెదక్, కామారెడ్డి జిల్లాల రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం అభయార ణ్యంలో బుధవారం వీరంతా సమావేశమ య్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎత్తును పెంచే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రాజెక్టు ఎత్తుతో మెదక్ జిల్లా హవేలి ఘణాపూర్ మండల పరిధిలోని రాజ్పేట, పోచమ్మ రాల్, కొత్తపల్లి, బూర్గుపల్లి, కామారెడ్డి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని వదల్పర్తి, శెట్టిపల్లి సంగారెడ్డి, పొల్కం పేట పరిధిలోని వేల ఎకరాల పంట పొలా లు నీట మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోచారం ప్రాజెక్టు నిండినప్పుడు పలు గ్రామాల్లోని పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయశాఖ మంత్రి పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచబోమని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. రైతు విధానాలకు వ్యతిరేకంగా పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తే రైతులందరం పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
పోచారం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్లోని పోచారం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. గోలిలింగాల్, చినూర్వాడి గ్రామశివారులో నీట మునిగిన పంటల్ని పరిశీలించారు. వరదలు, భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement