breaking news
pleaded
-
చిక్కుల్లో అందాల భామ ‘బేబీ’.. బిగుస్తున్న ఉచ్చు
థాయ్ బ్యూటీ క్వీన్ సుపన్నీ నోయినోంతాంగ్(Suphannee Noinonthong) అలియాస్ బేబీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందాల రాణి కిరీటం దక్కిన మరుసటిరోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. దీంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అందులో ఉంది తానేనని, తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె తర్వాత వివరణ ఇచ్చుకుంది. థాయ్లాండ్(Thailand)లో 76 ప్రావిన్స్కు విడివిడగా అందాల పోటీలు నిర్వహిస్తారు. ఆ 76 మంది బ్యూటీ క్వీన్లను ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్లీ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అక్కడ నెగ్గిన వాళ్లను మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీకి పంపిస్తారు. అలా.. 27 ఏళ్ల సుపన్నీ(బేబీగా ఆమెకు పాపులారిటీ దక్కింది) ప్రాచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ నుంచి అందాల భామ గుర్తింపు దక్కించుకుంది. అయితే సెప్టెంబర్ 20వ తేదీన ఆమెకు కిరీటం దక్కగా.. ఆ వెంటనే ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ-సిగరెట్లు తాగుతూ, అశ్లీల నృత్యాలు.. చేష్టలతో ఆ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆ మరుసటిరోజే నిర్వాహకులు టైటిల్ను వెనక్కి తీసుకుని, ఆమెను డిస్క్వాలిఫై అయినట్లు ప్రకటించారు. అయితే.. ఈ పరిణామాలపై ఆమె క్షమాపణలు తెలియజేసింది. ఆ వీడియోలో ఉంది తానేనని ఒప్పుకుంది. ఈ మేరకు నిర్వాహకులను, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో ఓ సుదీర్ఘ పోస్ట్ ఉంచింది. కరోనా టైంలో తన తల్లి జబ్బు చేసి మంచాన పడిందని, ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అలా అశ్లీల వెబ్సైట్కు పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే అంత చేసినా తన తల్లిని ఎంతోకాలం బతికించుకోలేకపోయానని, అప్పటి నుంచి మళ్లీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదని వివరణ ఇచ్చుకుంది. ఈ ఘటన తనకు విలువైన గుణపాఠం నేర్పిందన్న ఆమె.. జీవితంలో ఎలాంటి తప్పు చేయబోనంటూ వ్యాఖ్యానించింది. తాను బ్యూటీ క్వీన్ కిరీటం గెలిచిన తర్వాతే అవి బయటకు వచ్చాయని.. ఉద్దేశపూర్వకంగానే వాటిని బయట పెట్టిన వాళ్లను కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించింది. ఈ వివరణ తర్వాత.. పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు.. నిర్వాహకులను కలిసిన బేబీ తన టైటిల్ విషయంలో విజ్ఞప్తి చేసుకుంది. జాతీయ స్థాయిలో పోటీలకు అనుమతించాలని వేడుకుంది. ఈ తరుణంలో జరిగిన విచారణకు ఆమె హాజరు కాగా.. న్యాయనిపుణులు ఆమెను పలు అంశాలపై ఆరా తీశారు. అందాల పోటీల్లోని పాల్గొనే ముందు ఒప్పందంలోని ఓ క్లాజ్ ప్రకారం.. కంటెస్టెంట్లు అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే కాలమ్పై సంతకం చేయాలి. ఒకవేళ అది అబద్ధమని తేలితే వాళ్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. బేబీ తెలిసి కూడా ఆ కాలమ్పై సంతకం చేయడంతో.. ఆమెకు మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవశకాం ఉందని న్యాయనిపుణులు తెలిపారు. దీంతో ఆమె అందరి ముందే లబోదిబోమంది. అయితే టైటిల్ వెనక్కి ఇచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆమె సగం సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం -
నడిచి వచ్చేందుకు 8 నెలల గడువు కావాలట!
ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావడానికి నిందితుడు అడిగిన గడువును చూసి, హైకోర్టు జడ్జిలే విస్తుపోయారట. చివరికి గడువు లేదు గిడువు లేదు... చట్ట ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించారు. ఇంతకీ సదరు వ్యక్తి అడిగిన గడువు, దాని కథా కమామిష్షు ఏంటంటే.. 'బాలదీక్ష' అనే తప్పుడు ప్రభుత్వ పథకాన్ని ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలను మభ్య పెట్టి, మోసగించారనే ఆరోపణలపై జైన్ గురువు ఆచార్య కీర్తి యశురిష్వరాజి మహారాజ్ సహా మరో అయిదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే తమకు కోర్టు ముందు హాజరు కావడానికి ఎనిమిది నెలల గడువు కావాలని జైన్ గురువు తదితరులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే కోల్కతా నుండి అహ్మదాబాద్కు నడిచి రావడానికి ఎనిమిది నెలల సమయం పడుతుందంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను జైన్ మత సంప్రదాయం ప్రకారం వాహనాలను వాడరాదని, కాలి నడకన రావడానికి తనకు ఇంత సమయం పడుతుందని యశురిష్వరాజి సెలవిచ్చారు. తన అనారోగ్య కారణాల రీత్యా గంటకు 10- 12 కి.మీ కంటే ఎక్కువ దూరం నడవలేనని అతడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. సుమారు 2,200 కి.మీ నడిచి కోర్టుకు హాజరు కావాలంటే ఆ మాత్రం సమయం కావాలన్నాడు. ఈ పిటిషన్ చాలా వింతగా, విచిత్రంగా ఉందంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా యశురిష్వరాజి మహారాజ్ పిటిషన్ను తిరస్కరించారు. ఒక క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నారన్న సంగతిని వారు మర్చిపోతున్నారని మండిపడ్డారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


