-
హాట్ టాపిక్గా మారిన పుతిన్ కాస్మోటిక్ చికిత్స! ముఖంలో మెరుపు పోయినట్లేనా..
Putin's use of Botox First In Visit Kyiv: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దురాక్రమణ కారణంగా రష్యా అధ్యక్షుడు యుద్ధ నేరస్తుడనే కళంకాన్ని మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం యుద్ధం ఆపాల్సిందే అని చెప్పిన వినకుండా మరింత దాడులకు తెగబడటంతో రష్యాని పై మరిన్ని ఆంక్షల కొరడా ఝళిపించేందుకు ప్రపంచ దేశాలన్ని రెడీ అయ్యాయి. యుద్ధం మొదలైన క్రమంలోనే పాశ్చాత్య దేశాలు ఆర్థిక పరంగా ఆంక్షలు విధించి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచదేశాలన్న రష్యాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు సాగించేది లేదంటూ దిగ్గజ కంపెనీలు వీడిపోవడం మెదలైంది. సొంత దేశం కూడా పతిన్కి వ్యతిరేకమైంది. ఈ నేపథ్యంలో పుతిన్ సౌందర్య సాధనాలకు సంబంధించిన విషయాలు గుప్పుమన్నాయి. పుతిన్ బొటాక్స్ అనే సౌందర్య సాధనాలను వాడుతారంటూ పలు వదంతులు హల్చల్ చేస్తున్నాయి. ఆయన 2011లో తొలిసారిగా కైవ్ని సందర్శించినప్పుడూ బొటాక్స్ వాడరాని అప్పుడూ అతని కంటికి గాయమైందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇటీవలే రష్యాపై ఆర్థిక దండన నేపథ్యంలో కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు క్యాన్సర్, మధుమేహం వంటి క్లిష్టమైన వ్యాధులకు మందులను సరఫరా చేస్తాం తప్ప మిగతా వాటిని నిలిపేస్తున్నామని ప్రకటించాయి. అయితే బొటాక్స్ అనేది ముఖం మీద ముడతలు కనిపించనీయకుండా అందంగా ఉంచేందుకు వాడతారు. ఈ అరవై-తొమ్మిది ఏళ్ల పుతిన్ తరచుగా మృదువైన నుదురు, గులాబీ బుగ్గలు ముడతలు లేని కంటి ప్రాంతం ఉండేలా జాగ్రత్తపడుతుంటారని, అందుకోసం ఎన్నో ఏళ్లుగా బొటాక్స్ అనే కాస్మోటిక్ చికిత్సను తీసుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని ప్రముఖ సౌందర్య వైద్యులలో ఒకరైన సిడ్నీకి చెందిన డాక్టర్ జేక్ స్లోన్ పేర్కొన్నాడు. ఈ బోటాక్స్ అనే కాస్మోటిక్ మందులను అబీవ్ అనే ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పతి చేస్తుంది. అయితే తాత్కాలికంగా ఇతర మందుల సరఫరాను నిలిపేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇది కూడా ఉంది. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
రోగుల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: మందుల కంపెనీలు ధరలు పెంచి ప్రజలను ముంచుతున్నాయి. వందలు వేల శాతం వరకు పెంచి భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలా కంపెనీలు ఇష్టారాజ్యంగా మందుల ధరలను పెంచి ప్రజారోగ్యాన్ని బజారులో సరుకుగా చేస్తున్నాయి. దీనిపై నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యవస్థాపకులు పి.ఆర్.సోమాని పెద్దఎత్తున ఉద్యమానికి తెరలేపారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వేటి ధరలు ఎంతెంత పెరిగాయన్న దానిపై ఆయన ఒక అధ్యయన పత్రం తయారు చేశారు. కొన్ని కంపెనీలు 3 వేల శాతం వరకు మందుల ధరలు పెంచేసి ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నాయని ఆయన తన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. 11 వేల రకాల మందులు మూడువేల శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆయన విశ్లేషించారు. అధిక ధరలకు విక్రయించే మందుల్లో కేన్సర్సహా వివిధ ప్రమాదకర వ్యాధులకు చెందినవే ఉండటం గమనార్హం. దేశంలో మందుల ధరలను అదుపులో ఉంచేందుకు తగిన డ్రగ్ పాలసీ లేకపోవడంతో మందుల తయారీదారులు రెచ్చిపోయి ఇష్టారీతిన ధరలను ముద్రిస్తున్నారన్న విమర్శలున్నాయి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్తోపాటు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ఉపకరణాలపై కూడా అధిక మొత్తంలో ధరలను ముద్రించి పేద ప్రజలను దోచుకుంటున్నాయని ఆ నివేదికలో వెల్లడించారు. ఆయన విడుదల చేసిన నివేదిక ప్రకారం... 8 రూపాయల మందు 160 రూపాయలకు సిన్వాక్స్ 25టీ అనే మందు హోల్సేల్ ధర ఎనిమిది రూపాయలు కాగా, దాన్ని రూ.160కు రిటైల్గా అమ్ముతున్నారు. అంటే 2001 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇక అబ్బోట్ కంపెనీ న్యూకోల్డ్ ట్యాబ్లెట్ హోల్సేల్ ధర రూ. 2.20. కానీ మార్కెట్లో రూ. 39.80కు విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా 1,809 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. సిప్లా కంపెనీకి చెందిన ఒకాసెట్–ఎల్ను కంపెనీ రూ. 3.70 విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు మాత్రం రూ.57కు విక్రయిస్తున్నారు. అంటే 1,540 శాతం అధిక ధర. ఎమ్క్యూర్ కంపెనీకి చెందిన కార్బెటా ఇంజక్షన్ ధర రూ. 8.50 కాగా, మార్కెట్లో రూ.130కు విక్రయిస్తున్నారు. రిలయన్స్ సంస్థకు చెందిన డయాలసిస్ ఇంజక్షన్ ఇరెత్రొపోయిటిన్–ఐపీ 4000 ఐయూను రూ.150కు కొనుగోలుచేసి, వాటిపై రూ.1,400 ధర ముద్రిస్తున్నారు. అంటే 933 శాతం అధిక ధరతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఐవీ సెట్ పది రూపాయలకు అమ్మాల్సింది రూ.150కు విక్రయిస్తున్నారు. అంటే 1,500 శాతం అధికం. మందుల ధరలు అధికంగా ఉండటం, ప్రాణాంతక వ్యాధులకు చెందిన వాటిపై భారీగా వసూలు చేయడంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మనదేశంలో 2018లో 8 లక్షల మంది కేన్సర్తో చనిపోయారు. 2040 నాటికి ఆ సంఖ్య రెట్టింపు కానుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ప్రాణాంతక వ్యాధులకు చెందిన మందులనూ భారీ ధరలకు అమ్ముతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కుటుంబాలైతే వైద్యంకోసం, మందుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాయి. అప్పుల పాలవుతున్నాయి. చట్టం బలహీనంగా ఉండటమే: సోమాని చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని మందుల కంపెనీలు ప్రజలను దోచుకుంటున్నాయని, ప్రతి ఏడాది రూ. లక్ష కోట్ల ప్రజాధనం దోపిడీకి గురవుతుందని నిజామాబాద్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీఆర్ సోమాని ఆరోపించారు. మందుల విక్రయాల్లో పలు తయారీ సంస్థలు గరిష్ట అమ్మకపు ధర (ఎంఆర్పీ)ని ఎక్కువ ముద్రించి ప్రజలను దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని మందులపై 3,000 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారని అన్నారు. డ్రగ్ ప్రైజింగ్ కంట్రోల్ యాక్ట్లోని లొసుగులను అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారని విమర్శించారు. మందుల కంపెనీల మధ్య పోటీ పెరిగి తయారీదారులు తమ మందులను పెద్దఎత్తున అమ్మాలని చూస్తున్నారని, వీరికి సాయంచేసే రిటైల్ వ్యాపారులు, కొందరు వైద్యులు తమ స్వార్థంకోసం కంపెనీలపై ఒత్తిడి తేవడంతో మందులపై ఎక్కువ ధరలను ముద్రిస్తున్నారని తెలిపారు. వీటిపై అవగాహనలేని ప్రజలు రోగం తగ్గించుకోవడానికి చెప్పిన ధరలను భరిస్తూ ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారన్నారు. తమ పోరాట ఫలితంగా 42 రకాల కేన్సర్ మందుల ధరలను నియంత్రించారన్నారు. డాక్టర్ రెడ్డీస్ కంపెనీకి చెందిన పెగ్ఫిల్గ్రాస్టిమ్ ఇంజక్షన్ ధర ఇప్పటివరకు రూ.10,790 ఉండగా, త్వరలో రూ.2,650కు అందుబాటులోకి రానుందన్నారు. ఇంకా కొన్నింటి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని, కానీఇంకా వేలాది మందుల ధరలు తగ్గాల్సి ఉందన్నారు. -
పెద్ద ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆదాయ వృద్ధి: క్రిసిల్
న్యూఢిల్లీ: అమెరికాలో విక్రయాలు మెరుగుపడడం, రూపాయి బలహీతన, దేశీయంగా డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలతో పెద్ద ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండంకెల్లో ఆర్జించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. రూ.1,000 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన దేశీయ ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆర్జన మేలు చేస్తుందని పేర్కొంది. అమెరికా, దేశీయ మార్కెట్లు వీటికి 30 శాతం, 35 శాతం మేర ఆదాయలు తెచ్చిపెట్టేవిగా తెలిపింది. 20 లిస్టెడ్ కంపెనీల మొదటి త్రైమాసికాల్లో ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనిపించాయని పేర్కొంది. ‘‘మొదటి త్రైమాసికంలో అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాల్లో 7 శాతం వృద్ధి నెలకొంది. దేశీయ మార్కెట్ నుంచి ఆదాయాల్లో 25 శాతం వృద్ధి ఉంది. పెద్ద ఫార్మా కంపెనీల ఆదాయాలు 12–13 శాతం పెరిగేందుకు అవకాశం ఉంది’’ అని క్రిసిల్ తెలిపింది. -
చక్కెర గుళికలు నొప్పిని తగ్గిస్తాయా?
పిల్లలు అనుకోకుండా కిందపడ్డారనుకోండి.. నొప్పి ఏమార్చేందుకు బెల్లం ముక్క నోట్లో పెట్టడం మనం చూసే ఉంటాం. గాయం తాలూకూ నొప్పి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ఇది పనికొస్తుందని మనం ఇప్పటివరకూ అనుకుంటూ ఉన్నాం. అయితే తగిన మెదడు నిర్మాణం, మానసిక స్థితి ఉన్న వారికి ఈ తీపి కాస్తా శక్తిమంతమైన మందుగానూ పనిచేస్తుందని అంటున్నారు నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఈ పరిశోధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంచనా. అనేక దుష్ప్రభావాలను చూపించే రసాయనిక మందుల స్థానంలో ఒట్టి చక్కెర గుళికలు ఇవ్వవచ్చునని, ఫార్మా కంపెనీలు మందుల ప్రభావశీలతను పరీక్షించేందుకు కొంతమందికి ఇచ్చే ఉత్తుత్తి మాత్రలను లేకుండా చేయవచ్చునని, ఆసుపత్రి ఖర్చులూ తగ్గుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వానియా అప్కారియన్ వివరించారు. నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం నొప్పితో బాధపడుతున్న వారికి ఏవో మందులిస్తున్నామని కాకుండా.. చక్కెర గుళికలే ఇస్తున్నాంగానీ.. అది నొప్పి తగ్గిస్తుందని నమ్మబలికితే చాలని వివరించారు. నడుం నొప్పితో బాధపడుతున్న కొందరిపై తాము ప్రయోగాలు నిర్వహించి మరీ ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. -
లోటస్ ఫార్మా కంపెనీ మూతపడాలె..
జమ్మికుంట(హుజూరాబాద్): ‘నా కొడుకు మతిస్థిమితం కోల్పోయేందుకు కారణమైన లోటస్ ఔషధ కంపెనీ మూతపడాలె.. నాకు న్యాయం జరగకుంటే ఢిల్లీ వరకూ వెళ్తా.. సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలి..’అంటూ ఔషధ ప్రయోగ బాధితుడి తల్లి కమల ఆరోపించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన చిలువేరి కమల కుమారుడు అశోక్ కుమార్ ఔషధ ప్రయోగంతో మతి స్థిమితం కోల్పోయినట్లు గతనెల 28న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కమల ఆదివారం జమ్మికుంటలోని గాంధీ చౌక్ వద్ద నిరసన దీక్షకు దిగింది. ఔషధ ప్రయోగ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. లోటస్ ఫార్మా కంపెనీపై ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేయకుండా తన కొడుకు శ్యాంసుందర్తో గతనెల 29న తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఆమె ఆరోపించింది. అశోక్కుమార్కు వైద్య ఖర్చులతోపాటు కుటుంబానికి సహాయం అందిస్తామని, బెంగళూర్కు రావాలంటూ లోటస్ కంపెనీ పేరుతో వచ్చిన లేఖ కరీంనగర్ నుంచి వచ్చిందేనని కమల ఆరోపించింది. బెంగళూర్కు వెళ్తే లోటస్ కంపెనీ సహాయం చేస్తుందని పోలీసులు చెబుతున్నారని, పోలీసులు వస్తే వెళ్తామని పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement