breaking news
Parinity Chopra
-
పీవీ సింధూ బయోపిక్లో దీపిక పదుకొనే!?
సాక్షి, హదరాబాద్: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ స్టార్స్ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్లకు సంబంధించిన బయోపిక్లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్ బయోపిక్కు ‘శభాష్ మిత్తూ’ అనే టైటిల్ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ బయోపిక్లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్లకు సంబంధించిన వివరాలతో గల్లీ గ్రౌండ్ టూ బయోపిక్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దొరై, బ్యాడ్మింటన్ స్టార్స్ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్ల బయోపిక్లు నిర్మించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్లపై తమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు. సింధూగా దీపిక? సింధూ బయోపిక్లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్ లేని కారణంగా బయోపిక్ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చారు సోనుసూద్.! మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్ ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్ల ఆటకు యావత్ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్ పుల్లెల గోపిచంద్ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్పై ‘వయోకామ్–18’, సైనా నెహ్వాల్పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్’ సంస్థలు ముందుకు రాగా..కోచ్ పుల్లెల గోపిచంద్పై నిర్మించేందుకు టాలివుడ్కు చెందిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ముందుకొచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత షూటింగ్ జరిగి నిలిచిపోయాయి. లాక్డౌన్ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్ టైంకి ఈ మూడు బయోపిక్లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్ ‘సాక్షి’తో చెప్పారు. శ్రద్థా టు పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కూడా సైనా బయోపిక్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రొఫెషన్ టూ పర్సనల్ లైఫ్ మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. పుల్లెల గోపీచంద్ చిన్న పాటి గ్రౌండ్ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్ ఆటనే కాదు పర్సనల్ లైఫ్ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్ల ద్వారా తెలపనున్నారు. తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్బాబులే యాప్ట్ ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిత్తూ’లో హీరోయిన్ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్లాగానే ఉంది. సైనా నెహ్వాల్తో కలసి నెట్ ప్రాక్టీస్ చేసిన బాలీవుడ్ నటి పరిణీతిచోప్రా సేమ్ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్ పాత్రలో మన టాలివుడ్ హీరో సుధీర్బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్బాబులను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. ఆమె చెప్పిన వన్వర్డ్ ఆన్సర్తో ఫిదా అయ్యా మహిళల ప్రపంచ కప్కు ముందు జరిగిన ప్రెస్కాన్ఫరెన్స్లో మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్ను మీరు మేల్ క్రికెటర్ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్తో ఫిదా అయ్యాను. శభాష్ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్ నటి తనలా చేయడం గొప్ప అనుభూతి గ్రౌండ్లో సైనా నెహ్వాల్ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. – పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి గోపి.. నా ఇన్స్పిరేషన్ గోపి (గోపీచంద్) నా ఇన్స్పిరేషన్.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం. అతని బయోపిక్ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్బాబు, సినీ హీరో కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది. – పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్. చాలా హ్యాపీగా ఉన్నా నా మీద బయోపిక్ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్ అన్నీ ఇచ్చాను. షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది. – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కష్టానికి గుర్తింపు బయోపిక్ చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ రావడం ఆదర్శమనిపిస్తుంది ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్ కెరీర్గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. – మిథాలీరాజ్ దొరై, ఇండియన్ క్రికెటర్ -
మాటా.. పాటా
అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ళ కథాంశంతో తెరకెక్కిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు డిస్నీ సంస్థ ప్రతినిధులు. ‘ఫ్రోజెన్ 2’ హిందీ వెర్షన్కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో నిత్యామీనన్ ఈ పనిని పూర్తి చేయగా, తమిళ వెర్షన్లో ఎల్సా పాత్రకు హీరోయిన్ శ్రుతీహాసన్ డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు స్వతహాగానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీ ‘ఫ్రోజెన్ 2’ తమిళ వెర్షన్ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ– ‘‘అన్నా, ఎల్సాల మధ్య ఉండే అనుబంధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అన్నా, ఎల్సాల అనుబంధం నా చెల్లి అక్షరాహాసన్కు, నాకు ఉన్న అనుబంధంలా అనిపించింది. ఎల్సా పాత్ర ప్రతి అమ్మాయికి రోల్ మోడల్లా ఉంటుంది’’ అని అన్నారు శ్రుతి. ‘ఫ్రోజెన్ 2’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
చోప్రా సిస్టర్స్ మాట సాయం
ఇటీవల హాలీవుడ్ సినిమాలను మన ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రాంత సూపర్ స్టార్స్తోనూ ప్రమోట్ చేయిస్తున్నాయి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు. తాజాగా తమ కొత్త యానిమేషన్ చిత్రం ‘ఫ్రాజెన్ 2’ను కూడా అదే స్టయిల్లో ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’ ముఖ్యాంశం. హిందీ వెర్షన్లో ఈ పాత్రలకు చోప్రా సిస్టర్స్ (ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా) వాయిస్ ఓవర్ అందించనున్నారు. ‘‘మిమి, తిషా (ప్రియాంక, పరిణితీ ముద్దు పేర్లు) ఇప్పుడు ఎల్సా, అన్నా కాబోతున్నారు. ఇలాంటి అద్భుతమైన, ధైర్యవంతమైన పాత్రలకు మా వాయిస్ను అందించడం ఆనం దంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది. -
ఈసారి ఆల్బమ్ కోసం...
పరిణీతీ చోప్రాలోని నటి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆమెలో గాయని కూడా ఉంది. ఆల్రెడీ ఆడియన్స్కు తనలోని గాయనిని ఓసారి పరిచయం చేశారు. లేటెస్ట్గా మరోసారి గొంతు సవరించుకోవడానికి రెడీ అయ్యారు పరిణీతీ చోప్రా. బాలీవుడ్ గీత రచయిత మనోజ్ ముంటషీర్ రాసిన ‘తేరి మిట్టీ’ అనే పాటను ఆలపించనున్నారు పరణీతి. అర్మాన్ మాలిక్ స్వరపరచిన ఈ పాట సినిమా కోసం కాదు... ప్రైవేట్ ఆల్బమ్. ఇదివరకు పరిణీతీ చోప్రా నటించిన ‘మేరీ ప్యారీ బిందు’ సినిమాలో ‘మానా కే హమ్ యార్ నహీ’ అనే పాట పాడారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. కొంచెం గ్యాప్ తర్వాత మరో పాటతో సిద్ధమయ్యారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. పరిణీతి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కేసరి’ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. -
శ్రద్ధా అవుట్.... పరిణీతి ఇన్
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వదిలేసిన బ్యాడ్మింటన్ రాకెట్ను మరో బ్యూటీ పరిణీతీ చోప్రా అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైనా’. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా సైనా నెహ్వాల్ పాత్రకు శ్రద్ధా కపూర్ను తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు అకస్మాత్తుగా టైటిల్ రోల్లో పరిణీతీ చోప్రా నటించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. ‘‘చిచోరే, స్ట్రీట్ డ్యాన్సర్ 3, భాఘీ 3, సాహో’ చిత్రాలతో శ్రద్ధాకపూర్ చాలా బిజీగా ఉన్నారు. ‘సైనా’ చిత్రాన్ని ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి 2020లో విడుదల చేయాలనుకుంటున్నాం. మా ప్లాన్కి తగ్గట్టుగా శ్రద్ధా డేట్స్ కుదిరేట్లు లేవు. అందుకే ఆమె స్థానంలో పరిణీతీ చోప్రాను తీసుకున్నాం. ఈ మార్పు పరస్పర అంగీకారం ప్రకారం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పరిణీతీకి బాగా నచ్చింది. త్వరలోనే ఆమె బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు’’ అని చిత్రబృందం వెల్లడించింది. -
డైవింగ్ లైఫ్!
కాస్త టైమ్ దొరికితే చాలు హాలిడేకి చెక్కేస్తున్నారు హీరోయిన్ పరిణీతి చోప్రా. డైవింగ్ లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె స్కూబా డైవింగ్లో సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. లాస్ట్ టైమ్ మాల్దీవుల్లో మస్తీ చేసిన పరిణీతి ఇప్పుడు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ సమీపంలోని గ్రేట్ బారియర్ రిఫ్లో డైవింగ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.‘‘ఆస్ట్రేలియాలో డైవింగ్ లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. పొఫెషనల్ లైఫ్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారామె. అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్, నమస్తే ఇంగ్లాండ్’ సినిమాల్లో పరిణీతిచోప్రా కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. అక్షయ్కుమార్ హీరోగా నటిస్తున్న ‘కేసరి’ సినిమాలో కూడా పరిణీతినే కథానాయిక. -
మా అమ్మానాన్న అంటే నాకు ద్వేషం!
ప్రపంచంలో ఎవరినైనా ద్వేషిస్తాం కానీ, తల్లిదండ్రులను మాత్రం ద్వేషించలేం. అయితే చిన్నతనంలో తల్లిదండ్రులను తాను బాగా ద్వేషించేదాన్నని పరిణీతి చోప్రా అన్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆమె ద్వేషానికి కారణం ఉంది. దాని గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు మాకు ఆర్థిక కష్టాలు ఉండేవి. పెద్ద బంగ్లా, కారు వంటివి ఉండేవి కాదు. నన్ను సైకిల్లో స్కూల్కి పంపించేవాళ్లు. సైకిల్ తొక్కుకుంటూ నేను వెళుతుంటే, అబ్బాయిలు అల్లరి పెడతారేమోనని మా నాన్నగారు ఇంకో సైకిల్లో నా వెనకాలే వచ్చేవారు. అయితే నాన్న రానప్పుడు అబ్బాయిలు నన్ను బాగా ఎగతాళి చేసేవారు. నా స్కర్ట్ని లాగడానికి ట్రై చేసేవాళ్లు. నాకు చాలా భయం వేసేది. మినీ స్కర్ట్ వేసుకుని, అబ్బాయిల ముందు సైకిల్ తొక్కడం ఇబ్బందిగా అనిపించేది. నన్ను సైకిల్లో పంపిస్తున్నందుకు మా అమ్మానాన్నల మీద ద్వేషం పెంచుకున్నా.పెద్దయ్యాక వాళ్ల కష్టాలను అర్థం చేసుకున్నా. ఆ ద్వేషం స్థానంలో జాలి, ప్రేమ పెరిగాయి’’ అన్నారు. ఇంతకీ పరిణీతి చిన్నప్పటి ఈ సంఘటనను ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకున్నారంటే... హీరో అక్షయ్కుమార్కు మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఆడవాళ్లకు ఆత్మ రక్షణ అవసరం అంటూ ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, ఫీజు లేకుండా వాళ్లకు సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ నేర్పించే ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసి, బయటకు వెళ్లే స్టూడెంట్స్కి ‘సెండాఫ్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిణీతి తన చిన్ననాటి అనుభవాన్ని పంచుకున్నారు. ఉచితంగా శిక్షణ ఇస్తున్న అక్షయ్ని అభినందించారామె. చిన్నప్పుడు తాను భయపడి నట్లుగా ఎవరూ భయపడకూడదని మహిళలకు సూచించారు. -
సంగీతం టీచరమ్మ
ప్రేక్షకులకు తెలియని విషయం ఏంటంటే... ప్రియాంకా చోప్రా సంగీతం పాఠాలు చెప్పేవారట! అదీ భారతీయ సంగీతం కాదు... పాశ్చాత్య సంగీతం, సాహిత్యం గురించిన పాఠాలు. పదహారేళ్ల వయసులో చదువు నిమిత్తం ప్రియాంక అమెరికా వెళ్లారు. అమెరికన్ల యాస, భాష ఆమెకు అలవాటయ్యాయి. దాంతో ఇండియా వచ్చినప్పుడు కజిన్స్ అందరూ అత్యాంక్షరి ఆడదామంటే ప్రియాంక ఇంగ్లీష్ పాటలు పాడుతూ... వాటికి అర్థంతో పాటు వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి వివరించేవారట. ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రా ఈ సంగతలు చెప్పారు.