breaking news
parent meetings
-
పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇలా చేయవద్దు
పి.ఎం.ఐ (పేరెంట్ మెంటర్ ఇంటరాక్షన్ )కు సమాచారం రాగానే తల్లిదండ్రులు తమకు టీచర్లు ఏదో బాకీ ఉన్నట్టు టీచర్లను నిలదీయడానికే ఈ అవకాశం వచ్చినట్టు భావిస్తుంటారు. పి.ఎం.ఐ అనేది పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారో, చదువులో వారి అవగాహన ఎలా ఉందో, వారికి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మద్దతు కావాలో టీచర్లు తెలియచేసే ఇంటరాక్షన్ . కాబట్టి పి.ఎం.ఐ.లలో తల్లిదండ్రులు వ్యవహరించకూడని విషయాలను నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటంటే...టీచర్–పేరెంట్ మీటింగ్ అనగానే తల్లిదండ్రులు రెండు విధాలుగా ప్రవర్తిస్తారు.ఒకటి అసలు వెళ్లరు. రెండు.. వెళ్లి టీచర్ను అనేక ప్రశ్నలు అడగాలి, వీలైతే నిలదీయాలి అనుకుంటారు. అసలు వెళ్లకపోవడం ఎంత త΄్పో వెళ్లి టీచర్ల దగ్గర ‘గట్టిగా’ వ్యవహరించడం కూడా అంతే తప్పు. ‘మన అబ్బాయి/అమ్మాయి బుద్ధిగా చదువుకుంటోంది. పి.ఎం.ఐకి వెళ్లి కొత్తగా తెలుసుకునేదేముంది’ అని కొంతమంది తల్లిదండ్రులు.. తీరిక లేదనే కారణంతో కొంతమందీ వెళ్లరు. బాగా చదివినంత మాత్రాన, మంచి మార్కులు వచ్చినంత మాత్రాన స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారో మనకు తెలిసేది పి.ఎం.ఐ వల్ల మాత్రమే. తల్లిదండ్రుల కంటే టీచర్లు ఎక్కువగా పిల్లలను పరిశీలిస్తారు. కాబట్టి పి.ఎం.ఐ.కి హాజరు కావడం తప్పనిసరి. మరోవైపు పిల్లల చదువును భూతద్దంలో పెట్టి చూస్తూ, చదువుకు సంబంధించిన అన్ని లోపాలకు కారణం స్కూలు టీచర్లే అనే విధానం తో తల్లిదండ్రులు ఉంటారు. వీరు తరచూ టీచర్లకు కాల్ చేయడం, పి.ఎం.ఐ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం మోతాదు మించిన స్పందన అని చెప్పవచ్చు. నిజానికి ఇటీవల స్కూలు పాఠాలు పిల్లలను గైడ్ చేస్తూ ఇంటర్నెట్ ద్వారా మిగిలిన చదువు పూర్తి చేసుకునేలా ఉంటున్నాయి. ఇది అర్థం చేసుకుని టీచర్లను నిందితులుగా చూడటం కంటే వారు పిల్లల గురించి చేసిన అబ్జర్వేషన్స్ ను విని అర్థం చేసుకుని కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. కొన్ని స్కూళ్లలో నెల, రెండు నెలలకోసారి పేరెంట్–టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల క్వార్టర్లీ/ హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయ్యాక నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. అమ్మానాన్నలూ.. ఇలా చేయొద్దు→ కొన్ని ఇళ్లల్లో తల్లి మాత్రమే పేరెంట్–టీచర్స్ మీటింగ్కు హాజరవుతుంటుంది. దాంతో తన విషయాలేవీ తండ్రికి తెలియవనే ధీమాతో పిల్లలు ఉంటారు. అప్పుడప్పుడూ నాన్న కూడా మీటింగ్కు వెళ్లాలి. వెళ్లడం కుదరకపోతే టీచర్లతో మాట్లాడి పిల్లల గురించి కనుక్కోవాలి. → పి.ఎం.ఐలలో పిల్లల మార్కులను, వారి ప్రతిభను ఇతరులతో పోలుస్తూ మాట్లాడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. క్లాసులో తమ పిల్లలే ఫస్ట్ రావాలని అంటుంటారు. అలా కాకుండా పిల్లల సమస్య ఏమిటో కనుక్కోవాలి. కేవలం మార్కుల గురించే కాకుండా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లల భాగస్వామ్యం గురించి కూడా కనుక్కోవాలి. → తల్లిదండ్రులు టీచర్లతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా నిలబడి ఉంటారు. అలా కాకుండా, వారిని కూడా మీ సంభాషణల్లో భాగస్వామిని చేస్తే స్వేచ్ఛగా వారి విషయాలు మీతో పంచుకుంటారు. → తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఎక్కువసేపు ఉంటున్నారనే అనుమానాలని టీనేజ్ పిల్లల తల్లిదండ్రులు పిల్లల ముందు కాకుండా టీచర్లతో విడిగా మాట్లాడటం మేలు. → క్లాసుల్లో పిల్లలు అల్లరి చేయడం, జట్లు కట్టి టీచర్లను కామెంట్ చేయడం చేస్తున్నారని టీచర్లు చెప్పినప్పుడు కొందరు ‘మా పిల్లలే అల్లరి చేస్తున్నారా’ అని ఎదురు ప్రశ్నిస్తారు. దాంతో టీచర్లు మీ పిల్లల ప్రవర్తనా దోషాలు చెప్పడం మానేస్తారు.టీచర్లూ..ఈ సూచనలు మీకు→ కొంతమంది టీచర్లు పిల్లల ప్రవర్తనలో కనిపించిన చిన్న చిన్న లోపాల్ని పెద్దవి చేసి తల్లిదండ్రులకు చెప్తుంటారు. దీనివల్ల వారిలో ఆందోళన పెరుగుతుంది. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇలా చేయడం సరికాదు. ఫిర్యాదుల్లా కాకుండా, ‘ఈ ప్రవర్తన మారితే మీ పిల్లలు మరింత రాణించగలరు’ అనే పద్ధతిలో చె΄్పాలి. → పిల్లల చదువుతోపాటు వారికి ఇంకే రంగంపై ఆసక్తి ఉంది, అందులో రాణిస్తే ఎలా ఉంటుందనే అంశాలను కూడా టీచర్లు తల్లిదండ్రులతో చర్చించొచ్చు.→ పిల్లల తల్లిదండ్రులందరికీ సమానమైన గౌరవం ఇవ్వాలి. వారి ఆహార్యాన్ని, మాటల్ని, ఆర్థిక స్థితిని బట్టి వేర్వేరుగా చూడటం తగదు.→ కేవలం ఫిర్యాదు చేయడానికే కాకుండా, పిల్లల్ని మెచ్చుకునేందుకూ సమయం కేటాయించాలి. వారి చిన్న చిన్న విజయాలనూ ΄÷గడాలి. తద్వారా వారిలో, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుంది. -
బాస్తో నాన్న.. టీచర్-పేరెంట్ మీటింగ్!
ఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తరచూ రాజకీయ, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఓ ఫోటో ఆసక్తికరంగా మారింది. గురువారం ఆమె తన తండ్రితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన ఫోటో స్మృతి ఇరానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఆ ఫొటోకు ఆసక్తికర కాప్షన్ను జతచేశారు. బాస్ అయిన ప్రధాని మోదీ.. తండ్రితో కలిసి జరిగిన సమావేశాన్ని ఆమె టీచర్-పేరెంట్ మీటింగ్తో పోల్చారు. ఇలాంటి సమయంలో వారు పరస్పరం తన గురించి ఫిర్యాదులు చేసుకోకుండా ఉండాలని దేవున్ని పార్థిస్తున్నానని రాసుకోచ్చారు. ఈ ఫొటోపై టీవీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, నటుడు సోనూసూద్ స్పందిస్తూ.. ‘మీరు మంచి స్టూడెంట్ అని పొగుడుతున్నారు’, మీ కూతురు చాలా కష్టపడే తత్వం గల మహిళ, మీరు మంచి నడవడిక నేర్పారని మోదీ అన్నట్లు’ కామెంట్లు చేశారు. ఎంతో బీజీ షెడ్యూల్లో తమ తండ్రితో కలవాడానికి సమయం ఇచ్చినందుకు ఆమె ప్రధానికి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందు సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
విజయవంతంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
-
చిక్కు తీస్తున్నామా? వేస్తున్నామా?
ఆధ్యాత్మిక ప్రేమను, విశ్వజనీన ప్రేమను, ఇంకా మనకు అర్థంకాని ఎన్నో అలౌకిక ప్రేమలను అంగీకరిస్తున్నాం. కాని, అమ్మాయి, అబ్బాయి ప్రేమ అనేటప్పటికి ఉలిక్కిపడి, దేవుడి పటం పక్కనే గోడకు తగిలించి ఉంచిన కొరడాను చేతికి అందుకుంటున్నాం. ఎందుకు? ఒకప్పుడు మనమూ ప్రేమలో పడినవాళ్లమే. పెద్దవాళ్లం అయ్యాక మన జీవితంలోకి పిల్లలు వచ్చి, పేరెంట్ మీటింగులు వచ్చి, ఎల్లయిసీ ఏజెంట్లు వచ్చి, ఈఎమ్మయి నోటీసులు వచ్చి ప్రేమకు చోటు లేకుండాపోయింది. పోతే పోయింది, మన పిల్లలు ఎక్కడ ప్రేమ మలినాన్ని అంటించుకుని వస్తారోనని రోజూ ఎందుకింత బిక్క చచ్చిపోతున్నాం? ప్రేమలో పడిన ఇరుగింటి, పొరుగింటి పిల్లలకు మన పిల్లల్ని ఎందుకు దూరంగా ఉంచుతున్నాం? అసలు ప్రేమ లేని సంస్కృతి ప్రపంచంలో ఉంటుందా? ఇవన్నీ నిలబడే తర్కాలు కాదు. ప్రేమలు... పిల్లల్ని, వాళ్ల చదువుల్ని, జీవితాల్ని పాడుచేస్తాయన్న నమ్మకమొక్కటే చివరికి నిలబడుతుంది. ఆ నమ్మకం మేరకే మనం నడుస్తున్నాం, మన పిల్లల్ని నడిపిస్తున్నాం. అయితే మనం ఒక్కరమే మన పిల్లల్ని నడిపిస్తున్నామా? లేదు. ఇంకా చాలామందే నడిపిస్తున్నారు. ఎవరినీ ప్రేమించకుండా ఎవరూ ఉండలేరన్నది ఓషో ఫిలాసఫీ. ప్రేమను ఇవ్వడంగానీ పొందడంగానీ మనసుకు కూడా తెలియకుండా జరిగిపోతుందట! అమ్మాయి అబ్బాయి మధ్య మొదలయ్యే ప్రాథమికస్థాయి ప్రేమను, గౌతమ బుద్ధుడు పంచిన విశ్వ జనీన ప్రేమను ఆయన సమంగా గౌరవించారు. పరిణామక్రమంలో... దిగువన ఉన్న ప్రేమే ఎగువకు ఎదుగుతుంది కనుక ఏ స్థాయి ప్రేమకు ఆ స్థాయిలో ప్రాముఖ్యం ఇచ్చి తీరాలని ఆచార్య రజనీష్ అన్నారు. పిల్లల ప్రేమకు విలువ ఇవ్వొద్దు. సరే, ఆ వయసులో కొత్తగా కలిగే భావాలు మనకు తెలియనివా? అందుకు పిల్లల్నెందుకు తప్పు పట్టడం? ప్రేమను ఎందుకు తప్పు పట్టడం? పసి గుండెల్లో దాచుకున్న తియ్యటి ప్రేమకు, స్నేహంగా చెయ్యి చాస్తే మనకూ కొంత ప్రేమ దక్కుతుంది కదా! మంచి ఫ్రెండ్స్ అయిపోతామేమో కూడా! అప్పుడు ఫ్రెండ్గా, ప్రేమగా మనమేం చెప్పినా వింటారు. ఎందుకంటే వారిలో వికసించే ప్రేమ భావాలు స్వచ్ఛమైనవి. మార్కెట్ల వల్ల, మాయమాటల్ల వల్ల అవి కలుషితం కాకుండా జాగ్రత్తపడాల్సిందే. అయితే చిక్కు తీయబోయి, చిక్కు వేస్తున్నామేమో మనం గమనించుకోవాలి.