Padmashali Youth Association
-
వైద్యశిబిరానికి విశేష స్పందన
సాక్షి, ముంబై : పద్మశాలీ యువక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపు 150 మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నాయిగాం పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగువారితోపాటు మరాఠీయులు కూడా ఈ శిబిరంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.జి.కానాజి, గౌరవ అతిథిగా డాక్టర్ దంతాల పురుషోత్తం హాజరయ్యారు. ఈ శిబిరానికి హాజరైన వారికి మోకాళ్ల నొప్పుల నివారణ కు వైద్యులు ఈ సందర్భంగా తగు సూచనలు, సలహాలిచ్చారు. పద్మశాలీ యువక సంఘం చైర్మన్ గాడిపెల్లి గణేష్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ ధర్మకర్తలు ముశం నారాయణ, బుదారపు రాజారాం, బోగా కళావతి, అధ్యక్షుడు కోడిచంద్రమౌళి, ఉపాధ్యక్షులు పొన్న శ్రీనివాస్లు, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, కోశాధికారి జిల్లా పురుషోత్తం, కార్యదర్శులు, వైద్య సమితి ఉపాధ్యక్షుడు చిలివేరి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నయిగావ్లో ఉచిత నేత్ర వైద్యశిబిరం
సాక్షి, ముంబై: తూర్పు దాదర్లోని నయిగావ్లో పద్మశాలి యువక సంఘం, ముంబై ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. డా. ప్రవీణ్ జువారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో హాజరైనవారికి నేత్ర పరీక్షలకు ముందు డయాబిటీస్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో కొందరికి కంటి చూపు దెబ్బ తిందని, మరికొందరికి మోతి బిందువులు ఉన్నాయని ైవె ద్యులు నిర్ధారించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు కోడి చంద్రమౌళి, ట్రస్టీ సభ్యులు ముశం నారాయణ, బుదారపు రాజారాం, భోగా కళావతి, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, కోశాధికారి జెల్లా పురుషోత్తం, సంఘం కార్యదర్శి దోర్నాల మురళీధర్, గంజి మల్లేశం, మెడికల్ వైస్ చైర్మన్ చిలివేరు మహేంద్ర, కన్వీనరు లకిశెట్టి రవీంద్ర, కార్యవర్గ సమితి సభ్యులు కైరంకొండ వెంకటేశం తదితరులు హాజరయ్యారు.