వైద్యశిబిరానికి విశేష స్పందన | widespread response to medical camp | Sakshi
Sakshi News home page

వైద్యశిబిరానికి విశేష స్పందన

Dec 22 2014 10:08 PM | Updated on Sep 2 2017 6:35 PM

పద్మశాలీ యువక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన..

సాక్షి, ముంబై : పద్మశాలీ యువక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపు 150 మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నాయిగాం పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగువారితోపాటు మరాఠీయులు కూడా ఈ శిబిరంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.జి.కానాజి, గౌరవ అతిథిగా డాక్టర్ దంతాల పురుషోత్తం హాజరయ్యారు. ఈ శిబిరానికి హాజరైన వారికి మోకాళ్ల నొప్పుల నివారణ కు వైద్యులు ఈ సందర్భంగా తగు సూచనలు, సలహాలిచ్చారు. పద్మశాలీ యువక సంఘం చైర్మన్ గాడిపెల్లి గణేష్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సంఘ ధర్మకర్తలు ముశం నారాయణ, బుదారపు రాజారాం, బోగా కళావతి, అధ్యక్షుడు కోడిచంద్రమౌళి, ఉపాధ్యక్షులు పొన్న శ్రీనివాస్‌లు, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, కోశాధికారి జిల్లా పురుషోత్తం, కార్యదర్శులు, వైద్య సమితి ఉపాధ్యక్షుడు చిలివేరి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement