-
ఓలా డ్రైవర్పై రెచ్చిపోయిన గ్యాంగ్
-
హీరోయిన్కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట
Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్ హిజ్ లీల', 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్లో ప్రయాణించేప్పడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్ నిరాకరించాడు. 'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్స్టాలో తెలిపింది. అలాగే తనకు ఎయిర్పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్స్టా గ్రామ్లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. -
‘అతని వల్ల మర్చిపోలేని జ్ఞాపకంగా మారింది’
ముంబై : సాధరణంగా మొబైల్, వాలెట్ వంటివి పోతే దొరకడం చాలా కష్టం. మన అదృష్టం బాగుంటే తప్ప తిరిగి మన చేతికి రావు. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డులు అన్ని ఆ వాలెట్లోనే ఉంటాయి. దొరికితే బాగుండని.. దొరకాలని కోరుకుంటాం. మనం కోరుకున్నట్లు జరిగితే.. ఇదిగో ఇలా ప్రచారం చేస్తాం. ట్విటర్ యూజర్ దర్థ్ సియర్ర తాను కలిసిన ఓ నిజాయితీపరుడైన క్యాబ్ డ్రైవర్ గురించి ట్విటర్ ద్వారా ఎంతో మందికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి దర్థ్ సియర్ర ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఈ నెల 10న నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా భార్య పబ్కు వెళ్లి ఎంజాయ్ చెద్దామని భావించాము. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేశాం. మిని హుండాయ్ ఎక్సెంట్ మా కోసం వచ్చింది. దాని డ్రైవర్ అసిఫ్ ఇక్బాల్ అబ్దుల్ గఫర్ పథాన్. మా ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభమైంది. దాంతో పథాన్ తన భార్యకు ఫోన్ చేసి.. పిల్లలన్ని బయకు పంపకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మేం కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించాం. వర్షం కారణంగా ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఎలాగో అలా మేం వెళ్లాల్సిన పబ్కు చేరుకున్నాం. తర్వాత స్నేహితులను కలిసి పిచ్చాపాటి ప్రారంభించాం. ఓ గంట గడిచిన తర్వాత నా వాలెట్ మిస్సయిందని గుర్తించాను’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఓ నిమిషం పాటు నాకు కాళ్లు చేతులు ఆడలేదు. దాంతో క్యాబ్లో మర్చిపోయానేమో అని భావించి పథాన్కు కాల్ చేశాను. అతను చెప్పిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నా వాలెట్ను క్యాబ్లోనే మర్చిపోయానని.. అది గమనించిన పథాన్ దాన్ని తీసి భద్రం చేసినట్లు చెప్పాడు. అంతేకాక ఇంటికి వెళ్లేటప్పుడు.. నన్ను కలిసి వాలెట్ తిరిగి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. చెప్పడమే కాక సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు నా దగ్గరకు వచ్చి వాలెట్ ఇచ్చాడు. అంతేకాక పుట్టిన రోజు శుభకాంక్షలు కూడా తెలియజేశాడు. నా పుట్టిన రోజు నాడే తన పుట్టిన రోజు కూడా కావడం నిజంగా అద్భుతం. అలా విషాదంగా ముగియాల్సిన నా పుట్టిన రోజు కాస్త పథాన్ నిజాయితీ వల్ల నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఈ సోషల్ మీడియా వేదికగా మనం కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూంటా. కానీ మంచి విషయాలను కూడా ఈ వేదిక మీదగా షేర్ చేసుకుందాం. దీని వల్ల కొందరైనా ప్రేరణ పొందుతారు’ అంటూ దర్థ్ సియర్ర ట్వీట్ చేసిన ఈ స్టోరీకి జనాలు ఫిదా అయి పోయారు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీని తెగ మెచ్చుకుంటున్నారు. -
‘ఎక్కడ ఉంటావో తెలుసు.. ముక్కలుగా నరికేస్తా’
బెంగళూరు : ఇంటికి వేళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడో ఓలా క్యాబ్ డ్రైవర్. డబ్బుల విషయంలో గొడవపడి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. బెదిరింపుల దిగాడు. ఎక్కడ ఉంటావో తెలుసు.. గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేస్తా... నిన్ను అమ్మెస్తా.. నీ సంగతి చూస్తా అంటూ బెదిరించాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆర్జిత ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీకెండ్ జాలీగా గడుపుదామని కోరామంగలాలో సోదరి ఇంటికి వెళ్లారు. గత సోమవారం తిరిగి ఇంటికి వచ్చేందుకై ఆమె నాన్న ఓలా యాప్ ద్వారా షేర్ క్యాబ్ బుక్ చేశాడు. గత సోమవారం ఉయదం 9 గంటల ప్రాంతంలో ఆమె క్యాబ్ డ్రైవర్కు పోన్ చేశారు. అతను రాగానే తోటి ప్రయాణికులతో కలిసి కారు ఎక్కారు. మార్గమధ్యలో అందరు దిగిపోయారు. ఆమె చేరాల్సిన ప్రదేశం వచ్చింది. ఆమె క్యాబ్ దిగగానే రూ. 200 ఇవ్వమని అడిగాడు. తన తండ్రి ఓలా మనీ ద్వారా రూ. 70 పే చేశాడని, మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తానని చెప్పింది. దీంతో క్యాబ్ డ్రైవర్ ఆమెపై మండిపడ్డాడు. అసభ్య పదజాలంతో తిట్టసాగాడు. దీంతో ఆర్జిత వాళ్ల నాన్నకు ఫోన్ చేసి డ్రైవర్తో మాట్లాడమని చెప్పింది. అతను ఫోన్ లాక్కొని అతన్ని బెదిరించాడు. ‘ మీ కూతురిని చంపేస్తా. గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. మర్యాదగా డబ్బులు ఇవ్వమని చెప్పు’ అని హెచ్చరించాడు. అనంతరం ఆర్జితకు ఫోన్ ఇవ్వకుండా ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని బెదిరించాడు. చివరకు రూ.500 ఇచ్చి ఆర్జిత తన ఫోన్ను తీసుకుంది. అనంతరం సాయంత్రం తండ్రితో కలిసి బనస్వాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. -
మేము బంద్ చేస్తోంటే.. నువ్ పని చేస్తావా..
సాక్షి, ముంబై : పని వేళల్లో మార్పులు, ఆదాయంలో వాటా పెంపును కోరుతూ యాప్-బేస్డ్ క్యాబ్ డైవ్రర్లు ముంబయ్ వ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి నిర్వహిస్తున్నారు. ఎవరూ పనుల్లోకి పోకుండా నిరసన పాటిస్తున్నారు. అయితే, బంద్ కొనసాగుతుండగా క్యాబ్ నడుపున్నవంటూ ఓలా సంస్థకు చెందిన ఓ డ్రైవర్ను సోమవారం చితకొట్టారు. దుర్భాషలాడుతూ అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇప్పుడీ విడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, డ్రైవర్పై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తమ ఆదాయాన్ని లాక్కుంటున్నారు.. ఓలా, ఊబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ముంబయ్ వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది యాప్-బేస్డ్ డ్రైవర్లు నిరసనలకు దిగడంతో దేశ వాణిజ్య రాజధానిలో 90 శాతం మేర క్యాబ్లు షెడ్లకే పరిమితమయ్యాయి. కాగా, డ్రైవర్లు సోమవారం తమ నిరసనలను ముమ్మరం చేశారు. కుర్లాలోని ఊబర్ కార్యాలయం నుంచి అంధేరిలోని ఓలా ఆఫీస్ వరకు నల్ల జెండాలు ధరించి భారీ ర్యాలీ తీశారు. ఓలా, ఊబర్ సంస్థలు కుట్రకు పాల్పడుతున్నాయనీ, కావాలనే వినియోగదారుల వద్ద తక్కువ వసూలు చేసి తమకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement