breaking news
officials raids
-
ట్రంప్ మాజీ సలహాదారు బోల్టన్ ఇంట్లో సోదాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మొదటి సారిగా ఎన్నిౖకైన సమయంలో 2018–19 సంవత్సరాల్లో జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్ నివాసంపై ఎఫ్బీఐ అధికారులు దాడులు జరిపారు. మేరీల్యాండ్లోని బెథెస్డాలో ఉన్న బోల్టన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ అధికారులు ధ్రువీకరించారు. ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. రహస్య పత్రాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే సోదాలు చేపట్టినట్లు మీడియా అంటోంది. వాషింగ్టన్ డీసీలోని బోల్టన్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయని తెలిపింది. అప్పటి ట్రంప్ పాలనపై బోల్టన్ 2020లో ఒక పుస్తకం రాశారు. ఇందులో ట్రంప్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పుస్తకంలోని పలు అంశాలను అధికార రహస్య పత్రాల ద్వారానే బోల్టన్ పొందినట్లు ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. దాడులపై బోల్టన్ స్పందించలేదు. దాడుల విషయంతనకు తెలియదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. -
కారులో రూ.2.10 కోట్ల నగదు ఎవరిది!
బళ్లారి సాక్షి, యశవంతపుర: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా హున్నూర చెక్పోస్టు వద్ద లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ.2.10 కోట్ల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. చెక్పోస్ట్లో అధికారులు ఒక కారును శోధించగా నగదు కట్టలు లభించాయి. ఈ నగదు ఒక సహకార బ్యాంకుకు చెందినదిగా నగదు తరలింపుదారులు తెలిపారు. అయితే అందుకు సంబంధించి దాఖలాలు చూపలేదని తెలిసింది. పత్రాలను చూపించి నగదు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆ నగదును జమఖండిలోని ట్రెజరీకి తరలించారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు
కోటపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కోటపల్లి మండలం అన్నారం గ్రామ శివార్లలో మద్యం తయారుచేస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు జరిపారు. జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో దాడులు జరిపి మూడు వేల క్వింటాళ్ల బెల్లం పానకం ధ్వంసం చేయడంతోపాటు 50 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు.