Nutrition experts
-
చిన్నారులకు ఆ చిరుతిండ్లు వద్దు..!
ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్లోకి జంక్ ఫుడ్ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్ ఫుడ్ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రిసంప్రదాయ ఆహారంతో మేలుచిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. (చదవండి: మామ్ వెయిట్లాస్ జర్నీ..! నో క్రాష్ డైట్, నో స్ట్రిక్ట్ రూల్స్..ఏకంగా 22 కేజీలు..) -
Payal Kothari: టీబీ.. డిప్రెషన్.. సమస్యలు అధిగమించి హెల్త్ కోచ్గా!
‘‘జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు భవిష్యత్లో తమతోపాటు ఎంతోమంది జీవితాలను సరిదిద్దుకోవడానికి పాఠాలుగా మారతాయి. కష్టసమయాల్లో కిందపడి కెరటంలా పైకి లేచిన ప్రతిసారి మనకెదురయ్యే పరిష్కార మార్గాలు మన భవిష్యత్ను చక్కగా తీర్చిదిద్దుతాయి. నా జీవితంలో అది జరగబట్టే ఈ రోజు నేను సెలబ్రెటీ గట్ హెల్త్ కోచ్గా మారాను’’ అని చెబుతోంది పాయల్ కొఠారి. ముంబైకి చెందిన పాయల్ కొఠారి కోల్కతాలోని గుజరాతీ జైన్ కుటుంబంలో పుట్టింది. పాయల్కు రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం ముంబైకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. అక్కడికి వచ్చిన కొద్దిరోజుల్లోనే పాయల్కు టీబీ వచ్చింది. చికిత్స తీసుకున్నాక నయమైంది కానీ జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింది. ఫలితంగా పోషకాహార లోపం ఏర్పడి, పదమూడేళ్లు వచ్చేవరకు బక్కపలుచగా ఉండేది తను. ఫెయిలవడంతో... ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చదువులో చాలా చురుకుగా ఉండేది పాయల్. కానీ మన సులో ఎప్పుడూ తెలియని నిరాశ వెంటాడేది. ఇలా అనిపించిన ప్రతిసారి విపరీతంగా తింటుండేది. దీంతో తన బరువు అమాంతం పెరిగి ఒబెసిటీ వచ్చింది. ఉన్నట్టుండి బరువు పెరిగిన పాయల్ను మిగతా విద్యార్థులంతా హేళన చేస్తుండేవారు. వారి కామెంట్లను భరించలేని పాయల్ తీవ్ర నిరాశకు లోనై సరిగా చదవలేకపోయేది. దీంతో ఫెయిల్ అయ్యింది. ‘‘ఎవరేమి మాట్లాడినా పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకో’’ అని ఆమె తల్లి పదేపదే చెప్పడంతో డిప్రెషన్ నుంచి బయటపడింది. కాస్త పర్వాలేదు అనుకునేలోపు... మానసికంగా కాస్త పర్లేదు అనుకుంటుండగా..పదోతరగతి పూర్తై కాలేజీలో అడుగుపెట్టిన పాయల్ను పొట్ట ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో అనేక మ్యాగజీన్లు చదివి తన కడుపు సమస్యకు డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటూనే కిచిడి, పెరుగన్నం, పండ్లు, నెయ్యి, సూప్లు తీసుకుంటూ పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి పొట్ట, ఒబెసిటీ సమస్యలను తగ్గించి ఫిట్గా తయారైంది. డిగ్రీ పూర్తయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ స్కూల్ అయిన న్యూయార్క్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంట్రాగేటివ్ న్యూట్రిషన్(ఐఐఎన్) లో క్లినికల్ న్యూట్రిషన్లో సర్టిఫికెట్ కోర్సులు చేసింది. పదిహేనేళ్ల తరువాత.. కోర్సు పూర్తయ్యాక పాయల్కు ఓ వ్యాపారవేత్తతో వివాహం జరగడంతో భర్తతో హాంగ్కాంగ్ వెళ్లిపోయింది. పదిహేనేళ్లపాటు గృహిణిగా ఉన్న పాయల్ భర్తకు వ్యాపారంలో నష్టం రావడంతో 2016లో ఇండియాకి తిరిగి వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో ఉంటోన్న పాయల్ను చూసిన కొంతమంది ‘‘అధిక బరువు నుంచి ఇంత ఫిట్గా ఎలా తయారయ్యావు? నీ చర్మం కూడా కాంతిమంతంగా ఉంది’’ మాకు కొన్ని టిప్స్ చెప్పు అని అడిగేవారు. దీంతో క్లినికల్ స్టడీ సర్టిఫికెట్ కోర్సు చేయడం, స్వయంగా తను కూడా ఒకప్పుడు ఒబెసిటీ బాధితురాలి నుంచి ఫిట్గా మారిన అనుభవంతో ‘గట్ హెల్త్ కోచ్’ గా మారాలనుకుంది. కోచ్గా పనిచేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో వెంటనే గట్ చోచ్గా మారింది. ప్రారంభంలో చుట్టూ ఉన్నవాళ్లకు, ఆ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్గా బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల వరకు కోచ్గా పనిచేసింది. ఇలా ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్గా పనిచేసి వారి ఆరోగ్యస్థితిగతులను మెరుగుపరిచింది. పెద్దవాళ్లకేగాక స్కూళ్లకు వెళ్లి పిల్లలకు మహిళా క్లబ్బులు, ఎన్జీవోలను సందర్శించి గట్ హెల్త్పై అవగాహన కల్పిస్తోంది. ద గట్ పేరిట బుక్ కూడా రాసింది. ఆన్లైన్ న్యూట్రిషన్ స్కూల్ ప్రారంభించి గట్ ఆరోగ్యం గురించి వివరించడంతోపాటు.. కాలేజీలు, యూనివర్శిటీల్లో సెమినార్లు నిర్వహిస్తోంది. వివిధ ఆర్టికల్స్ రాస్తూ ఫిట్నెస్ పట్ల అనేకమందిలో అవగాహన కల్పిస్తోంది. జాతీయ అంతర్జాతీయ న్యూట్రిషన్ సంస్థలతో కలిసి పనిచేస్తూ పదిమంది మెప్పూ పొందుతోంది పాయల్. చదవండి: Precision Oncology: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో.. -
నేరేడుతో ప్రయోజనాలెన్నో..
రోజూ గుప్పెడు నేరేడు పళ్లు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరేడు తినడం వల్ల రక్తపోటు అదుపు కావడమే కాకుండా, ధమనులు బిరుసెక్కకుండా ఉంటాయని అంటున్నారు. తరచుగా నేరేడు పళ్లు తినేవారిలో రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. మెనోపాజ్ దశలో రక్తపోటును ఎదుర్కొనే మహిళలకు నేరేడు పళ్లు మరింత మేలు చేస్తాయని వారు వివరిస్తున్నారు. నేరేడు పళ్ల పొడిని తీసుకున్నా, ఇవే రకమైన ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. నేరేడు పళ్లలోని నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం వల్ల రక్తపోటు తగ్గుతుందని వివరిస్తున్నారు. -
బంగాళదుంపల్లో...బంగారం నువ్వేలే!
మెన్స్ హెల్త్ బంగాళదుంపలు తినడం రుచికి మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా చాలామంచిదని పౌష్టికాహార నిపుణులు చెబుతారు. మీరు తీసుకొనే ఆహారంలో బంగాళదుంపలు ఎంత శాతం తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే రోజూ తినండి. వీటి వల్ల ఉపయోగాలు..... విటమిన్ బి6 - బంగాళదుంపలలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. - ఇది గుండెపోటు రాకుండా నివారిస్తుంది. విటమిన్ సి - దంతాలు, ఎముకలు, జీర్ణక్రియ... మొదలైన వాటిలో కీలక పాత్ర పోషించే విటమిన్- సి బంగాళదుంపలలో పుష్కలం. - చర్మసంరక్షణకు, ఒత్తిడి నుంచి విముక్తి కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ డి - సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్లు రాకుండా అడ్డుకునే ’విటమిన్-డి’ బంగాళదుంపలలో ఉంటుంది. - గుండె, నరాలు, దంతాలు, చర్మానికి ఈ విటమిన్ మేలు చేస్తుంది. ఐరన్... అమోఘం - శరీరంలో ముఖ్య విధులు నిర్వహించే ఐరన్కు బంగాళదుంపలలో కొదవలేదు. -
ఆరోగ్యమైనా, ఆనందమైనా మగాళ్లకే ఎక్కువ!
సర్వే స్త్రీలతో పోలిస్తే పురుషులు ఆరోగ్యం, ఆనందం విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నారని ఒక కొత్త సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం... మహిళలతో పోలిస్తే పురుషులు చాలా తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 60 శాతం మంది పురుషులు నెలకు ఒకసారి మాత్రమే ఒత్తిడికి గురవుతున్నారు. 70 శాతం మంది పురుషులు తాము అరుదుగా మాత్రమే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నామనీ, మానసిక స్థితిలో మార్పుకు గురవుతామనీ చెప్పారు. మహిళలో మాత్రం సగం మంది కనీసం నెలకు ఒకసారి డిప్రెషన్ బారిన పడతామని చెప్పారు. మహిళలతో పోల్చితే తలనొప్పి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు పురుషులలో తక్కువగా ఉన్నాయి. మహిళల్లో సగం మందికి పైగా నెలలో చాలాసార్లు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ‘‘మహిళలు ఆరోగ్యస్పృహతో ఉంటారు అనేది ఒక సాధారణ అభిప్రాయం. కానీ, సర్వేను బట్టి చూస్తే, పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయం అర్థమవుతోంది. నిద్రలేమి, ఆందోళన, మానసిక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇంగ్లండ్కు చెందిన న్యూట్రీషియన్ నిపుణులు పెట్రిక్ హోల్ఫోర్డ్.


