breaking news
Nupur Bora
-
రెండో మాజీ భర్త గుట్టు విప్పితే.. ప్రియుడేమో!
ప్రపంచం మొత్తమ్మీద ఏ గొడవకైనా రెండే రెండు కారణాలు ఉంటాయిట. మొదటిది నగదు. రెండోది మగువ అంటారు. కించపరచడం ఉద్దేశం కానే కాదు కానీ..మహిళలపై పురుషులకున్న వ్యామోహమనండి, వాంఛ అనండి.. ఇంకోటి అనండి అనేకానేక గొడవలకు కారణమవుతుందన్నది సత్యం. అసోమ్(అస్సాం) సివిల్ సర్వీసెస్ అధికారి నూపుర్ బోరా విషయమే తీసుకుందాం. అవినీతి ఆరోపణలతో ఆమెపై ఇటీవలే విజిలెన్స్ దాడులు జరిగాయి. సుమారు 92 లక్షల రూపాయల నగదు, రెండు కోట్ల రూపాయల విలువైన నగలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. కేసుకు సంబంధించి నూపుర్ బోరా బాయ్ఫ్రెండ్, రెవెన్యూ ఆఫీసర్ సుర్జీత్ డేకాను కూడా విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల పోలీస్ రిమాండ్కు పంపారు. ఇక్కడితో స్టోరీ ఖతమైపోలేదు. షురూ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే..నూపుర్పై విజిలెన్స్ దాడులు జరగడంలో ముఖ్య పాత్ర ఆమె రెండో మాజీ భర్త. ఆయనిచ్చిన టిప్తోనే విజిలెన్స్ వాళ్లు ఆమెపై రెయిడ్ చేశారని తెలుస్తోంది. ఈయనతోపాటు అంతకుముందు ఇంకొకరితో నూపుర్కు వివాహం, విడాకులు రెండూ అయ్యాయి. ఆ తరువాత బాయ్ఫ్రెండ్తో కలిసి ఉంటోంది. బోరా పాపంలో ఇప్పుడు అతగాడి వాటాను తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. 2019లో అసోమ్ సివిల్ సర్వీసెస్లో చేరిన నూపుర్ కార్బీ అంగ్లాంగ్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత బార్పేట, కామ్రూప్ జిల్లాల్లో సర్కిల్ ఆఫీసర్గానూ సేవలందించారు. సివిల్ సర్వీసెస్లోకి చేరే ముందు ఇంగ్లీషు టీచర్గా పని చేసిన అనుభవమూ ఉంది.అవినీతి ఆరోపణలేమిటి?ప్రభుత్వ భూములను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులకు అక్రమంగా బదిలీ చేసిందన్నది నూపుర్పై ఉన్న అనేకానేక ఆరోపణల్లో ఒకటి. భూమికి సంబంధించిన విషయాలను సెటిల్ చేసేందుకు రూ.1500 నుంచి రూ.రెండు లక్షల వరకూ వసూలు చేసేదని చెబుతున్నారు. క్రిషిక్ ముక్తి సమితి అనే స్వచ్ఛంద సంస్థ, ఎమ్మెల్యేల అఖిల్ గొగోయ్ వంటివారు నూపుర్ అవినీతి కార్యకలాపాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు కూడా. దీంతో సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యవేక్షణలో ఉండే.. సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ ఆర్నెలుగా నిఘా ఉంచింది. ఆఖరికు ఆకస్మిక తనిఖీలతో అరెస్ట్ చేసింది. నగదు, నగలతోపాటు నూపుర్ అవినీతికి ఆనవాళ్లుగా గౌహతిలో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు కోట్ల రూపాయల విలువైన నగల్లో పద్నాలుగు బంగారు గొలుసులు, 15 వజ్రపుటుంగరాలు, మూడు వజ్రాల గాజులు ఉన్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే.. నూపుర్ ఇరువురు మాజీ భర్తలు కూడా రెవెన్యూ ఆఫీసర్లే కావడం. -
అస్సాం సివిల్ సర్వీసు అధికారిణి నూపుర్ బోరా అరెస్టు
గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీసు(ఏసీఎస్) అధికారిణి నూపుర్ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.ఎవరీ అధికారిణి?: నూపుర్ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్ కమిషనర్గా, తర్వాత సర్కిల్ ఆఫీసర్గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అనే సంస్థ నూపుర్ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్నకు రూ.1,500, ల్యాండ్ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్ బోరా సహాయకుడు, బార్పేట రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ సురాజిత్ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. -
ఆమె ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం!!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపూర్ బోరాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె నివాసం నుంచి కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల విలువున్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు.. ఆ సమయంలో నోట్ల కట్టలను అధికారులు మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. భారీ అవినీతి ఆరోపణల నడుమ.. చీఫ్మినిస్టర్ స్పెషల్ విజిలెన్స్ సెల్ బృందం సోమవారం గువాహతిలోని నుపూర్ బోరా(28) నివాసంలో తనిఖీలు నిర్వహించింది. అయితే అధికారికంగా రూ.92 లక్షలు విలువ చేసే నగదు, కోటి రూపాయల విలువ చేసే నగలను సీజ్ చేశారు. అలాగే.. బార్పేటలో ఉన్న అద్దె నివాసం నుంచి మరో రూ.10 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఆమెను అరెస్ట్ చేసి అవినీతి భాగోతం మీద ప్రశ్నిస్తున్నట్లు ప్రకటించింది. గోలాఘట్కు చెందిన నుపుర్ బోరా.. 2019లో అస్సాం సివిల్స్ సర్వీస్కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె గోరోయిమరి జిల్లా కంరూప్లో సర్కిల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బోరా తన పదవిలో ఉండగా హిందూ భూములను 'సందేహాస్పద వ్యక్తులకు' డబ్బు కోసం బదిలీ చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. ఇక.. నుపూర్ సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురజిత్ డేకాని కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. బార్పేట జిల్లాలో అనేక భూములు అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. నుపూర్ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మరోపక్క.. కేఎంఎస్ఎస్(Krishak Mukti Sangram Samiti) అనే స్థానిక ఉద్యమ సంస్థ ఒకటి కూడా ఆమె అవినీతి భాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఆమెపై వస్తున్న భూ సంబంధిత ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బార్పేట రెవెన్యూ సర్కిల్లో ఆమె విధుల్లో ఉన్నప్పుడు లంచం తీసుకుని హిందూ ఆలయాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేసినట్లు అబియోగాలు ఉన్నాయి. మైనారిటీల జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. అస్సాంలో అవినీతి రహిత పాలన పేరిట సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ను 2021లో హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు.అధికారుల అక్రమ ఆస్తులపై దాడులు, అవినీతి సంబంధిత కేసుల విచారణ, సున్నితమైన భూమి బదిలీ వ్యవహారాలపై నిఘా.. తదితర అంశాలను ఈ విభాగం చూసుకుంటుంది.


