-
అమెరికాలో ఏం జరుగుతోంది.. శ్రేయాస్ రెడ్డి మృతి
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్రెడ్డి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. శ్రేయాస్రెడ్డి బెనిగెరి అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు. అయితే, శ్రేయాస్రెడ్డి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. Deeply saddened by the unfortunate demise of Mr. Shreyas Reddy Benigeri, a student of Indian origin in Ohio. Police investigation is underway. At this stage, foul play is not suspected. The Consulate continues to remain in touch with the family and is extending all possible… — India in New York (@IndiainNewYork) February 1, 2024 మరోవైపు.. వారం రోజుల వ్యవధిలోనే ఇలా విద్యార్థులు మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు మృతిచెందిన భారత విద్యార్ధులు వీరే.. వివేక్ సైనీ ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్నర్ హత్య చేశాడు. నీల్ ఆచార్య ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆదిత్య అద్లాఖా ఇటీవలే ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని హత్యకు గురయ్యారు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. -
యనమలకుదురుకు చేరిన జయసూర్య మృతదేహం
పెనమలూరు: ఫిలిప్పీన్స్లో మెడిసిన్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యనమలకుదురుకు చెందిన అయోధ్య జయసూర్య (23) మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం యనమలకుదురుకు చేరుకుంది. గత నెల 20వ తేదీన ఫిలిప్పీన్స్లో బైక్పై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన జయసూర్య మృతదేహం యనమలకుదురుకు తీసుకురావడానికి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ప్రభుత్వ అధికారుల కృషితో జయసూర్య మృతదేహం కార్గో విమానంలో హైదరాబాద్కు వచ్చింది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో యనమలకుదురుకు మృతదేహాన్ని తీసుకు వచ్చారు. నాలుగు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటికి రావల్సిన జయసూర్య విగతజీవిగా ఇంటికి రావటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, గ్రామస్తులు జయసూర్య మృతదేహానికి నివాళు లర్పించారు. శనివారం యనమలకుదురులో జయసూర్య అంత్యక్రియలు జరగనున్నాయి. -
ఒంటరితనం భరించలేక.. అమెరికాలో తెలుగు యువకుడు!
సాక్షి, పామూరు : ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన దుగ్గినేని దీపక్, అమెరికాలో రైలు కిందపడి ఆత్మహత్య పాల్పడ్డాడు. దుగ్గినేని వెంకట్రావు, రమాదేవిల కుమారుడు దీపక్. ఎంఎస్ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒంటరితనం భరించలేక మనోవేదనకు గురయ్యేవాడని తెలుస్తుంది. టెక్సాస్ బిమౌంటులో రైలు కిందపడి దీపక్ సూసైడ్ చేసుకున్నట్లు అమెరికా నుంచి బంధువులకు సమాచారం అందింది. దీంతో పామూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఈతకు వెళ్లి.. ఎన్నారై విద్యార్థి మృతి
స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. విశాఖపట్నానికి చెందిన అనుదీప్ ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీలో సీటు సంపాదించి ఈ సంవత్సరం మార్చిలో ఆస్ట్రేలియా వెళ్లాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి మెల్బోర్న్లోని ఒక చెరువులో ఈతకు వెళ్లాడు. అయితే.. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటోంది. ఆ విషయం గుర్తించలేని అనుదీప్.. అలాగే చెరువులో ఈతకు దిగాడు. దాంతో అక్కడున్న మంచుగడ్డల్లో ఇరుక్కుపోయి మరణించాడు. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులకు గురువారం తెల్లవారుజామున చెప్పారు. అతడి తండ్రి నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు హతాశులయ్యారు. -
అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎన్ఆర్ఐ విద్యార్థి
తిరుచానూరు : థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరగబోవు అంతర్జాతీయ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలకు తిరుచానూరులోని శ్రీఎన్ఆర్ఐ ఇంగ్లిష్ మీడియం పాఠశాల 4వ తరగతి విద్యార్థి జి.చంద్రగణేష్ ఎంపికయ్యాడు. బుధవారం ఆ పాఠశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి డైరెక్టర్ బుజ్జిరెడ్డి ఆ విద్యార్థిని అభినందించి మాట్లాడారు. గత ఏడాది నవంబర్లో చెన్నైలో జరిగిన 800 మీటర్ల స్కేటింగ్ రిలేలో బంగారు, రింగ్–3లో కాంస్య పతకాలు సాధించాడని పేర్కొన్నారు. అదే ఏడాది జూన్లో గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 3బంగారు పతకాలు, నాగ్పూర్లో జరిగిన పోటీల్లో 3బంగారు, 1వెండి, 1కాంస్య పతకం, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించాడని తెలిపారు. బ్యాంకాక్లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో ఇన్లైన్ క్యాటగిరిలో పాల్గొననున్నాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ పసిడి పతకాలు సాధించి దేశానికి, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement