Nominations receiving
-
సమయంలేదు నేతలు..నేడే చివరి గడువు
సాక్షి, భూపాలపల్లి అర్బన్: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పిం చేందుకు సోమవారం ఒక్క రోజే మిగిలి ఉంది. సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గల్లో ఇప్పటి వరకు ఆరు రోజుల్లో 17 నామినేషన్లు వచ్చాయి. ఒకే రోజు మిగిలి ఉండటంతో ప్రధాన, ఇతర పార్టీల నాయకులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు.. భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8 మంది నాయకులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి తరఫున సతీమణి గండ్ర జ్యోతి, గులాం అప్జల్, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు, ఇండిపెండెట్లుగా కౌటం రవీందర్, పట్టెం మల్లికా ర్జున్, సిరిపెల్లి రాజయ్య నామినేషన్ వేశారు. ములుగు నియోజకవర్గంలో 9 మంది నామినేష న్లు వేశారు. అందులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అజ్మీరా చందులాల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క తరఫున ఆమె బంధువులు రెండు సెట్లు, టీఆర్ఎస్ అసమ్మతి నేత పొరిక గోవింద్నాయక్, సీపీఐ(ఎంఎల్) నుంచి బూర్క చిన్న వెంకటయ్య, పూనెం మురళీక్రిష్ణ, విజయ్కుమార్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థిగా తవిటి నారా యణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కుడుముల చొక్కయ్య నామినేషన్ పత్రాలను సమర్పించారు. నేడు నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు .. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం కావడంతో నామినేషన్ వేయలేదు. అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ములుగు అభ్యర్థిగా సీతక్క, భూపాలపల్లి అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డిలకు అధిష్టానం మూడు రోజుల క్రితం బీఫారాలు అందజేసింది. వారు సోమవారం నామినేషన్ వేయనున్నారు. అలాగే బీఎల్ఎఫ్, వివిధ పార్టీల నాయకులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. -
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ..
♦ గ్రేటర్ లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. ♦17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. 18న స్క్రూటినీ ♦ ఉపసంహరణకు 21వరకు గడువు.. అదే రోజు తుదిజాబితా సాక్షి, హైదరాబాద్: మహా నగరపాలక సంస్థ ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు ఎన్నికల నగరా మోగనుంది. గ్రేటర్ ఎన్నికలకు మంగళవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రేటర్లో150 వార్డులకు నోటిఫికేషన్ విడుదల కాగా, నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ చట్టం మేరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఈరోజు నుంచి 17వ తేదీ ఆదివారం వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. అయితే ఇందులో భోగి, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 14, 15 తేదీల్లో నామినేషన్లు స్వీకరించరు. దీంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు నాలుగు రోజులే గడువుంది. 17వ తేదీ ఆదివారం అయినా నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. జీహెచ్ఎంసీలోని 24 సర్కిళ్లలో ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 18వ తేదీ సోమవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. అభ్యర్థుల తుది జాబితాలను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు. అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్గా రూ. 5 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు నామినేషన్ డిపాజిట్ చెల్లింపులో రాయితీ ఇచ్చారు. వీరు రూ. 2,500 చెల్లిస్తే సరిపోతుంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
♦ గ్రేటర్ లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. ♦17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. 18న స్క్రూటినీ ♦ ఉపసంహరణకు 21వరకు గడువు.. అదే రోజు తుదిజాబితా సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలి అంకమైన నామినేషన్ల పర్వం నేటి(మంగళవారం) నుంచి మొదలుకానుంది. మంగళవారం నోటిఫికేషన్ జారీతోపాటు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ చట్టం మేరకు రిటర్నింగ్ అధికారులు దీనికి సంబంధించి పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభిస్తారు. మంగళవారం నుంచి 17వ తేదీ ఆదివారం వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. అయితే ఇందులో భోగి, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 14, 15 తేదీల్లో నామినేషన్లు స్వీకరించరు. దీంతో నామినేషన్లు దాఖ లు చేసేందుకు నాలుగు రోజులే గడువుంది. 17వ తేదీ ఆదివారం అయినా నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. జీహెచ్ఎంసీలోని 24 సర్కిళ్లలో ఆయా రిట ర్నింగ్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 18వ తేదీ సోమవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. అభ్యర్థుల తుది జాబితాలను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు. అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్గా రూ. 5 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు నామినేషన్ డిపాజిట్ చెల్లింపులో రాయితీ ఇచ్చారు. వీరు రూ. 2,500 చెల్లిస్తే సరిపోతుంది.