-
నాణ్యత నగుబాటు
సాక్షి, కర్నూలు : ఉన్నట్టు తెలుస్తోంది. వేస్తున్న రోడ్డు కూడా క్రమబద్ధంగా కాకుండా వంకర టింకర్లుగా సాగుతోంది. ఇందుకు అధికారులు కూడా అభ్యంతరం తెలపడం లేదు. వారు కనీసం పనులు జరిగే ప్రదేశాన్ని తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంకర వేశారు... రోడ్డు మరిచారు! పెద్దాసుపత్రి అంతటా అంతర్గతంగా సీసీ రోడ్లను వేసేందుకు రూ.2 కోట్లతో మొదటిసారి టెండర్ పిలిచారు. అయితే, ఒక్కరే వచ్చారనే కారణంగా రెండోసారి టెండర్కు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి షెడ్యూళ్లు దాఖలు చేసిన ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లను రింగు చేసి.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడికే దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రోజులు గడుస్తున్నప్పటికీ పనులను ప్రారంభించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఉన్న రోడ్లనూ తీసేయడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు వివిధ పరీక్షల కోసం మెడాల్ యూనిట్ వద్దకు వెళ్లేందుకు ఉన్న దారిలో కంకర వేసి నెల రోజులు గడుస్తున్నాయి. రోగులే రోలర్లు! ఏదైనా సీసీ రోడ్డును వేసే సమయంలో మొదట జేసీబీతో ఒక లెవల్గా చేస్తారు. అనంతరం కంకర, డస్ట్ వేస్తారు. దీనిపై రోలర్తో రోల్ చేస్తారు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతారు. అయితే, ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. మొదటగా కంకర వేశారు. అది కూడా చిన్నరకం కంకర వాడుతున్నారు. దీనిపై కనీసం డస్ట్ కూడా వేయలేదు. రోడ్డు రోలర్తో తిప్పిన దాఖలాలు అసలే లేవు. ఈ కంకర మీద రోగులు, స్ట్రెచర్లు, రోగుల సంబంధీకులు నడవడంతో రోలింగ్ అవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. కనీసం రోలింగ్ చేస్తే రోడ్డు పూర్తయ్యే వరకూ కనీసం నడిచేందుకు రోగులకు ఇబ్బంది ఉండదు. అధికారులు మాత్రం ఆ వైపు కనీస చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్ను ఏమైనా అంటే ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని జంకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. నాణ్యతలో రాజీ లేదు పెద్దాసుపత్రి అంతర్గత రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఒక లేయర్లో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిపై మరో లేయర్ వస్తుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు ఉండేలా చూస్తాం. – విజయభాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ -
మధ్యాహ్నం.. అధ్వానం
మెనూ మచ్చుకైనా పాటించరు రోజూ నాణ్యత లేని భోజనమే తినలేకపోతున్న విద్యార్థులు కానరాని సౌకర్యాలు పట్టించుకోని అధికారులు గోదావరిఖనిటౌన్/రామగుండం : నియోజకవర్గంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోంది. ప్రభుత్వ మెనూ పత్తాలేకుండా పోయింది. వేసవి సెలవుత తర్వాత పాఠశాలలు ప్రారంభించినప్పటి నుంచి మధ్యాహ్న బోజన నిర్వాహకులు ఒకే రకమైన కూర వండుతున్నారు. అది కూడా సరిగా ఉండడంలేదు. రోజూ ఒకే కూర తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తురన్నారు. ప్రాథమిక స్థాయి ఒక్కో విద్యార్థికి రూ.4.25పైసలు, హైస్కూల్ విద్యార్థికి రూ.6.65పై భోజనం కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం పప్పులు, కూరగాయలు, కోడిగుడ్ల ధరలు పెరుగడం, నిర్వాహకులకు నెలనెలా బిల్లులు సక్రమంగా రాకపోవడంతో మధ్యాహ్నం భోజనం నాణ్యత లోపిస్తోందని పలువురు అంటున్నారు. ప్రభుత్వ మెను ప్రకారం కిచిడి, లెమన్ రైస్, గ్రుడ్డు ఇతర ఏదైన అందించాలి. అది మచ్చుకైన కానరావడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం గుడ్డును అందిస్తునారు. గోదావరిఖని విఠల్నగర్, కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం, అశోక్గనర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, గాంధీ పార్క్, గాంధీనగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, రామగుండం పట్టణంలోని పాఠశాలల్లో నిత్యం సుమారు 1500 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. రోజు ఒకే విధంగా పులుసును వడ్డిస్తుండడంతో ముద్ద దిగడం లేదని విద్యార్థులు అంటున్నారు. జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్లోని ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల, అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం బాగుందని విద్యార్థులు వెల్లడించారు. గతంలో కన్నా ప్రస్తుతం సన్నబియ్యం అన్నం చాలాబాగుందని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారని అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు బసంత్నగర్ : క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బసంత్నగర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వాహకులు భోజనం వండడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలు సగం కడుపుకే భోజనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వంటలు రుచికరంగా ఉండకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్తున్నారు. ధరలు పెరిగాయని విద్యార్థులకు ప్రస్తుతం వారిని ఒకరోజు మాత్రమే గుడ్డు ఇస్తున్నారు. రుచిగా ఉండడం లేదు – అనిల్, ఏడో తరగతి, బసంత్నగర్ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగానే సరిపోతోంది. ఎక్కువ రోజులు సాంబారు, ఆలుగడ్డ కూరనే పెడుతున్నరు. అవి కూడా అంతగా రుచిగా ఉండటం లేదు. రుచికరమైన భోజనం అందించాలి. -
నిధులు చిక్కన - మజ్జిగ పలుచన
► నీళ్ల మజ్జిగతోనే సరిపెడుతున్న వైనం ► చలివేంద్రాలపై దాహార్తుల మండిపాటు ► నిధులు దుర్వినియోగానికేనని విమర్శలు విజయనగరం: ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రూ. 3కోట్లను జిల్లాకు మంజూరు చేసింది. అయితే మజ్జిగ సరఫరా చేసే బాధ్యతను ఎక్కువ ప్రాంతాలకు హెరిటేజ్ కంపెనీకే అప్పగించింది. అంతా బాగానే ఉంది. కానీ చలివేంద్రాల్లో సరఫరా అవుతున్న మజ్జిగ చూసి ఇప్పుడు దాహార్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది మజ్జిగా... లేక మజ్జిగ రంగులోఉన్న మంచినీరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోమవారం ఉదయం కలెక్టరేట్ ప్రధాన గేటును ఆనుకుని ఉన్న ప్రహరీ వద్ద ప్రభుత్వ మజ్జిగ పంపిణీ కేంద్రం పేరుతో ఫ్లెక్సీ పెట్టి మరీ చలివేంద్రం ఏర్పాటు చేశారు. సోమవారం కావడంతో గ్రీవెన్స్ తాకిడి ఎక్కువగా ఉంది. వేసవి తీవ్రత కూడా తక్కువేం లేదు. ఇక వచ్చిన జనం ఎండ వేడిమికి తట్టుకోలేక సర్కారువారి మజ్జిగ సరఫరా కేంద్రానికి వెళ్లి వారిచ్చిన మజ్జిగను నోట్లో పోసుకునే సరికి ఇది మజ్జిగా మంచినీరా అని నిర్వహకులను ప్రశ్నించడం విశేషం. హెరిటేజ్ కంపెనీకి చెందిన చిన్నపాటి బకెట్లో పెద్ద ఎత్తున నీరు పోసి పంచుతుండటంతో అక్కడి వారు విమర్శించడం మొదలెట్టారు. చంద్రబాబు కంపెనీకి సొమ్ము ధారపోయడానికి తప్ప రూ. 3కోట్ల మజ్జిగ ఇదా అంటూ వారు ధ్వజమెత్తారు. మంచినీరు తాగడం మేలు! కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలోనే మజ్జిగ ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లోని మజ్జిగ ఇంకెలా ఉంటుందో వేరే చెప్పాలా... ఈ మజ్జిగ తాగేకన్నా మంచినీరు శుభ్రంగా ఉంటుంది. వట్టి నీరులా ఉంది. ప్రజల ధనం ప్రజలకివ్వడంలో కూడా ఇంత లాభాపేక్షా? - ఎం సూరప్పడు, ఒమ్మి, నెల్లిమర్ల మండలం కోట్ల రూపాయల మజ్జిగ ఇదేనా? జిల్లాకు రూ. 3కోట్ల చొప్పున పంపిణీ చేసి మజ్జిగ పంచుతున్నారంటే కాస్త నాణ్యంగా ఉంటుందనుకున్నాం. తీరా తాగాక తెల్సింది మజ్జిగ నాణ్యత! కోట్లు వెచ్చించి ఇస్తున్న మజ్జిగ ఇలానే ఉంటుందా? అధికారులు పర్యవేక్షించి మజ్జిగను నాణ్యంగా అందించాల్సింది పోయి లక్షలాది బిల్లులు కళ్లు మూసుకుని ఇచ్చేస్తే ఇలానే ఉంటుంది. - మర్రాపు గణపతి, బొబ్బిలి -
గోముఖి లింక్ ఛానల్ పనుల్లో నాణ్యత కరవు
విజయనగరం (మక్కువ) : విజయనగరం జిల్లాలో వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని గోముఖి లింక్ ఛానల్ నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని ఆయకుట్టు ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. హుద్ హుద్ తుఫాన్ పునరావాస నిధులతో చేపట్టిన ఈ నిర్మాణ పనుల్లో సరైన నాణ్యత పాటించకపోవడంతో కాలువ సపోర్టింగ్ వాల్ ఇటీవల కోతకు గురైంది. దీంతో నీరు లీక్ అయి వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. -
పామాయిల్ లేనట్టే!
కర్నూలు, న్యూస్లైన్: తెల్లరేషన్ కార్డుదారులకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గత ఏడాది ఉగాది పర్వదినం నుంచి ప్రారంభించిన అమ్మహస్తం పథకం జిల్లాలో మసకబారింది. రూ.185కే తొమ్మిది రకాల సరుకులను ప్యాకెట్ రూపంలో అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో విఫలమయ్యారు. జిల్లాలో సరుకుల కొరత ఏర్పడటంతో అధికారులు తల పట్టుకున్నారు. తూకాల్లో మోసాలను అరికట్టే లక్ష్యంతో అమ్మహస్తంలో ఇచ్చే సరుకులన్నీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేందుకు నిర్ణయించినా అమలులో చిత్తశుద్ధి లోపించింది. కారం, పసుపు, చింతపండులో నాణ్యత కొరవడటంతో వెనక్కు పంపుతూ జాయింట్ కలెక్టర్ కన్నబాబు మూడు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. బియ్యం, కిరోసిన్ మినహా మిగిలిన సరుకులకు డీడీలు కట్టవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు చెప్పడంతో అమ్మహస్తం పథకం పట్ల డీలర్లు కూడా ఆసక్తి చూపని పరిస్థితి. డీడీలు కట్టాల్సిన మొత్తం పెరిగిపోవడం, నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తుండటంతో డీలర్లు డీడీలు తీసేందుకు వెనుకంజ వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన చింతపండు అర కిలో రూ.28లకే లభిస్తుండటంతో చౌకడిపోల్లో రూ.30లకు సరఫరా చేస్తుండటం.. నాసిరకం కావడంతో కార్డుదారులు తిరస్కరిస్తున్నారు. అదేవిధంగా పసుపు 100 గ్రాములు చౌక డిపోలో రూ.10లకు విక్రయిస్తుండగా బహిరంగ మార్కెట్లో రూ.8లకే లభిస్తోంది. 250 గ్రాముల కారం చౌకడిపోలో రూ.20లకు సరఫరా చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో రూ.18లకే లభిస్తుండటంతో కార్డుదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. అలాగే కందిపప్పు, గోధుమ పిండి కూడా నాసిరకంగా ఉంటున్నాయి. నెలల తరబడి గోధుమ పిండి నిల్వ ఉండటంతో ప్యాకెట్లలో పురుగులు పట్టి ముగ్గిపోయిన వాసన వస్తోంది. సంక్రాంతికి సర్కార్ షాక్ సంక్రాంతి పండగకు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. నాసిరకం సరుకుల పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం తాజాగా పామాయిల్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో పండగవేళ సామాన్యులకు పిండి వంటలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేక పేద, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ సరుకులలో కోత పెడుతుండటంపై కార్డుదారులు మండిపడుతున్నారు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే అన్ని సరుకులకు సంబంధించి ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ లోపు డీడీలు చెల్లించాలి. జనవరి కోటాకు సంబంధించి పామాయిల్తో పాటు కారం, పసుపు, చింతపండు తదితర నిత్యావసర సరుకులకు డీడీలు తీయవద్దంటూ అధికారులే ఆదేశించారు. గత నెలలోనూ కోతే... జిల్లాలో ప్రభుత్వం ప్రతి నెల 2,411 రేషన్ దుకాణాల ద్వారా 11.50 లక్షల పామాయిల్ ప్యాకెట్లను పేదలకు అందజేస్తోంది. గత నెలలో పూర్తి కోటా ప్రకారం పామాయిల్ సరఫరా చేయలేదు. 20 శాతం కోత విధించి సరఫరా చేయడంతో కర్నూలు నగరంలోనే దాదాపు 40 దుకాణాలకు పామాయిల్ చేరలేదు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న 9 వస్తువులలో 5 రకాలు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. అలాగే గోధుమలు కూడా పుచ్చుపట్టడంతో కొనుగోలు చేయడానికి కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. సరుకుల నాణ్యతలో డొల్ల, సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో ‘అమ్మహస్తం’ నీరుగారుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement