-
భూములు పాయ.. పరిహారమూ రాకపాయ!
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): జీవనాధారమైన భూములు కోల్పోయి.. పైసా పరిహారం రాక.. కుటుంబాలు గడవక తల్లడిల్లుతున్న రైతుల బాధలు చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. 2015లో నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు నాలుగేళ్లుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ‘పునరావాసం మాట దేవుడెరుగు.. కనీసం పరిహారం అయినా చెల్లించి ఆదుకోండి’ అంటూ గుండెలు బాధుకుంటున్నా పాలకుల హృదయం కరగడం లేదు. ‘భూములు కోల్పోయాం.. పరిహారం అతీగతీ లేదు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు’ ఇదీ నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల ఆక్రందన. నాలుగేళ్లయినా ఇప్పటికీ పైసా పరిహారం అందక, కుటుంబాలు గడవక రైతులు తీవ్ర వేదన పడుతున్నారు. నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు పంపారు. అలాగే పరిహారం విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పోస్టు, మెయిల్ ద్వారా వినతి పత్రం పంపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 2015లో నిప్పులవాగు విస్తరణలో భాగంగా వెలుగోడు మండలం వేల్పనూరు, అబ్దుల్లాపురం గ్రామాలకు చెందిన 37 మంది రైతుల నుంచి దాదాపు 100 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. వీరికి రూ.91.70 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాల్సి ఉంది. పునరావాసం సంగతి దేవుడెరుగు.. పరిహారం ఇవ్వండంటూ కోరుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. 2016 జనవరిలో అవార్డు ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు భూములు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన భూములకు పరిహారం విడుదల చేసేందుకు కర్నూలు ఆర్డీఓ 2018 నవంబరు 30న బిల్లులను పే అండ్ అకౌంట్స్ అధికారికి సమర్పించారు. మరుసటి రోజునే పీఏఓ బిల్ ఐడీ నంబరు 904684 ద్వారా సీఎఫ్ఎంఎస్ విధానంలో ఆర్బీఐకి పంపారు. అంటే మూడున్నర నెలలుగడచినా రైతుల భూసేకరణ బిల్లులను ప్రభుత్వం పట్టించుకోలేదంటే వీరిపై ఏ పాటి ప్రేమ ఉందో స్పష్టమవుతోంది. ఈ భూసేకరణ బిల్లులను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పెండింగ్లో ఉంచినట్లు స్పష్టమవుతోంది. సీఎఫ్ఎంఎస్ విధానంలో ముందు వెళ్లిన బిల్లులకు ముందుగా నగదు వారి ఖాతాలకు జమచేయాలి. కానీ, బిల్లులు వెళ్లిన తర్వాత పీఏఓ నుంచి వెళ్లిన కాంట్రాక్టర్ల చెల్లింపు బిల్లులు ఆమోదం పొందాయి తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ ఇదేనా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన వారందరూ సన్న, చిన్న కారు రైతులే. వీరు భూములు కోల్పోయి ప్రభుత్వ దయ కోసం ఎదురు చూస్తున్నారు. -
మా కడుపులు కొట్టొద్దు
- కలెక్టర్తో నిప్పులవాగు పరీవాహక రైతుల మొర వెలుగోడు: నిప్పులవాగు విస్తరణకు జీవనోపాధి అయిన భూములను తీసుకొని తమ కడుపులు కొట్టొద్దని బాధిత రైతులు కలెక్టర్ సీహెచ్ మోహన్తో మొర పెట్టుకున్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిప్పుల వాగు విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న బాధిత రైతులతో శుక్రవారం కలెక్టర్ విజయమోహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2009లో సంభవించిన వరదల కారణంగా విలువైన భూములు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. వాటిని సాగులోకి తెచ్చుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఏదోలాగా పంట పొలాలను ఇప్పుడిప్పుడే సాగులోకి తెచ్చుకున్నామని పేర్కొన్నారు. అయితే నిప్పుల వాగు విస్తరణ పనుల్లో నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా భూములు లా క్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10 లక్షలు చెల్లించిన తర్వాతే పను లు చేపట్టాలని రైతులు రామలింగారెడ్డి, మురళీధర్రెడ్డి తది తరులు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటామన్నారు. ఇందు కోసం ఎకరాకు రూ.3.50 లక్షలు పరిహారం, జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.5.50 లక్షలు ప్రోత్సాహకం అందజేస్తామని వివరించారు. రైతులు భూములు ఇవ్వకపోతే చట్ట ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు విస్తరణ పనులకు అవసరమైన భూములు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన రైతులు అంగీకార పత్రం అందజేస్తే 15 రోజుల్లో పరిహారం చెల్లించి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. అయితే ఇందుకు కొందరు రైతులు అంగీకరించగా మరికొందరు వ్యతిరేకించారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ఆర్డీఓ రఘుబాబు, తహశీల్దార్లు అనురాధ, తిరుమలవాణి, కేసీ కెనాల్ అధికారులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
Advertisement