-
కశ్మీర్లో 9 దశల్లో పంచాయతీ ఎన్నికలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో పంచాయతీ ఎన్నికలు తొమ్మిది దశల్లో జరుగనున్నాయి. నవంబర్ 17, 20, 24, 27, 29, డిసెంబర్ 1, 4, 8, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి షలీన్ కబ్రా ఆదివారం వెల్లడించారు. 58 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. తొలి దశ ఎన్నికలకు అక్టోబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే సర్పంచ్ ఎన్నిక ఉంటుందన్నారు. 316 బ్లాక్లు కలిపి మొత్తం 4490 పంచాయతీలున్నాయని, డిసెంబర్ 17న పో లింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. -
కొడుకు కొడుతున్నాడయ్యా..
ప్రత్తిపాడు: మండలంలోని వంగిపురం గ్రామానికి చెందిన శిగా ఏసు, నవమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఈ వృద్ధ దంపతుల వయసు 80 ఏళ్ల పైమాటే. వారికి ఉన్న ఎకరం పొలం తెగనమ్మి వచ్చిన నగదుతో అప్పులు తీర్చుకుని, మరికొంత వారి శేషజీవితం నిమిత్తం ఉంచుకున్నారు. మిగిలిన సొమ్మును నలుగురు సంతానానికి సమానంగా తలాకొంచెం పంచారు. తమకున్న పది సెంట్ల స్థలంలో ఒక సెంటు భూమి తాము ఉంచుకుని మిగిలిని తొమ్మిది సెంట్లు ముగ్గురు కుమారులకు పంచి ఇచ్చారు. ప్రస్తుతం వీరు పెద్ద కుమారుడు సుభాకరరావు వద్ద తలదాచుకుంటున్నారు. ఈ పంపకాల విషయం సుభాకరరావు, వృద్ధ దంపతులకు మధ్య మన స్పర్ధలు తలెత్తాయి. తమ వద్ద ఉన్న సెంటు భూమిని కూడా తదనంతరం పెద్దకొడుకుకే రాసిస్తామని చెప్పినా అతడు వినలేడు. తల్లిదండ్రులు దాచుకున్న కొద్దిపాటి డబ్బుతోపాటు ఆ సెంటు స్థలం కూడా తన పేరిట ఇప్పుడే రాసివ్వాలని వేధించడం ప్రారంభించాడు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కొడుతున్నాడు. ఈనేపథ్యంలో కొడుకు పెడుతున్న చిత్ర హింసలు భరించలేని ఆ వృద్ధ దంపతులు శనివారం ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించి తమ గోడును వెల్లబోసుకున్నారు. కొడుకుని స్టేషన్కు పిలిపించి, సర్దిచెప్పిన ఎస్ఐ కె.వాసు వృద్ధులను అతడి వెంట పంపించారు. ఇంటికి వెళ్లాక తన బుద్ధి మార్చుకోని సుభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహంతో మళ్లీ ఆ వృద్ధులపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శనివారం రాత్రి వంగిపురం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. గతంలోనూ ఒకసారి పెద్దకొడుకు తల్లిపై చేయి చేసుకోవడంతో అప్పట్లో కూడా పోలీసులను ఆశ్రయించారు. బాధలు భరించలేక రెండో కొడుకు ఇంటికి వెళ్తే వాస్తు ప్రకారం తన ఇంట్లో ఉండకూడదంటూ బయటకు పంపేశాడంటూ ఆ అభాగ్య తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement