-
గృహ కొనుగోలుదారులకు గుడ్న్యూస్
మీరు గృహ కొనుగోలుదారులా? మీ గృహం కోసం బిల్డర్ కు లేదా ఫ్లాట్ ఓనర్ కు ఒప్పందం మేరకు డబ్బు చెల్లించినప్పటికీ మీకు ఫ్లాట్ స్వాధీనం చేయడం లేదా? ఒప్పందం ప్రకారం అలా ఫ్లాట్ స్వాధీన పరచని పక్షంలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా? ఒకవేళ బిల్డర్ లేదా నిర్మాణ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటిస్తే, లేదా నిధులు లేవన్న కారణంగా నిర్మాణాలను వాయిదా వేస్తూ వెళుతున్నప్పుడు ఏం చేయాలి? అలాంటి వారికి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కేవలం బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు మాత్రమే అస్త్రాలుగా వాడుతున్న ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) ఇకనుంచి వినియోగదారులు కూడా ఉపయోగించేలా చట్టంలో సంబంధిత నిబంధనల్లో మార్పులు చేశారు. అంటే ఒప్పందం మేరకు ఫ్లాట్ స్వాధీనపరచనప్పుడు ఈ చట్టం ప్రకారం వినియోగదారులు బిల్డర్ నుంచి క్లెయిమ్ పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిబంధనల మేరకు బిల్డర్ లేదా కంపెనీ ఏదేనీ కారణం చూపిస్తూ ఫ్లాట్ ను స్వాధీనం చేయనప్పుడు తాజా చట్టం మేరకు క్లెయిమ్ కోరవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఫండ్స్ లేవని సాకుచూపుతూ చాలామంది డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు డెలివరీలు ఇవ్వకుండా నాన్చుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు గడువు మించి మరింత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటు రీఫండ్ కోసం కూడా కొనుగోలుదారులు వేచిచూడాల్సి వస్తోంది. చట్టంలో చేర్చిన కొత్త నిబంధనల మేరకు క్లెయిమ్ కోసం ప్రత్యేకంగా ఒక దరఖాస్తును సమర్పించాలి. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజుల్యూషన్ ప్రాసెస్ కింద ఈ దరఖాస్తును అందించాలి. అలా సమర్పించిన దరఖాస్తును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), దివాలా చట్టం కింద కేసును అంగీకరిస్తే, మిగతా ప్రక్రియ ముందుకు సాగడానికి తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్ను నియమిస్తారు. ఇలా దివాలా చట్టం కింద దివాలా కార్పొరేట్ సంస్థ నుంచి గృహ వినియోగదారులు తమ రీఫండ్ను పొందవచ్చు. -
ఉద్యోగులు కూడా ఆస్తుల అటాచ్ మెంట్ కోరవచ్చు
న్యూఢిల్లీ : కొత్త దివాలా బిల్లు ప్రకారం రుణదాతలు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సైతం కంపెనీ దివాలా తీసినప్పుడు ప్రమోటర్ల స్థిర ఆస్తులను (విదేశీ ఆస్తులు సైతం) అటాచ్ చేయమని కోరొచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. రుణాలకు గ్యారెంటీగా, బకాయిలను తిరిగి పొందడానికి ఈ ఆస్తులను ప్రమోటర్లు చూపించాలని పేర్కొన్నారు. ఈ ఆస్తులే కంపెనీ దివాలా తీసినప్పుడు రుణాల పరిష్కారానికి, ఉద్యోగులకు, పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం జరగకుండా గ్యారెంటీగా ఉంటాయని చెప్పారు. రుణ సమస్యల సత్వర పరిష్కారం కోసం.. రుణదాతలకు, ప్రజలకు మేలు కలిగేలా దివాలా బిల్లును ఈ నెల మొదట్లో పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు, రుణదాతలు, పెట్టుబడిదారులు ఎక్కువగా ఆర్థిక ఒత్తిడిలను ఎదుర్కొంటారని దాస్ చెప్పారు. 9నెలల స్పష్టత కాలం అనంతరం కూడా రుణ సమస్య కొనసాగితే, ప్రమోటర్లు రుణానికి గ్యారెంటీగా ఇచ్చిన అన్నీ స్థిర ఆస్తులను(విదేశ ఆస్తులు కూడా కలుపుకుని) అటాచ్ చేయమని ఉద్యోగులు, పెట్టుబడిదారులు ఎవరైనా కోరచ్చని తెలిపారు. ఏ కంపెనీని, ఏ కేసును నొక్కి ఈ కామెంట్ చేయడం లేదన్నారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లను ఎగొట్టి వ్యాపారవేత్త విజయ్ మాల్యా విదేశాల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టంతో ఆర్థిక రంగ రూపురేఖలే మారబోతున్నాయని దాస్ చెప్పారు. ఓ కొత్త, శక్తివంతమైన ఎకో సిస్టమ్ ను ఆర్థిక ఒత్తిడిలో కూరుకుపోయిన కంపెనీల కోసం రూపొందిస్తున్నామని తెలిపారు. రుణ సమస్యలు సత్వరమే పరిష్కరించేలా ఈ సిస్టమ్ తోడ్పడుతుందన్నారు. అయితే మొదట రెజల్యూషన్ ప్రాసెస్ ను ఆరంభించడానికి ప్రతి స్టాక్ హోల్డర్ హక్కు కలిగి ఉంటారన్నారు. రుణదాతలు, ఆర్థిక రుణదాతలు, నిర్వహణ రుణదాతలు, వర్క్ మెన్, ఉద్యోగులు ఈ స్టాక్ హోల్డర్ జాబితాలోకి వస్తారని దాస్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement