-
అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్ శ్రింగ్లా
సాక్షి, న్యూఢిల్లీ : భారత దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లాను అమెరికాలో భారత రాయబారిగా నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత రాయబారి నవ్తేజ్ సర్నా స్థానంలో త్వరలోనే హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ 1984 బ్యాచ్కు చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో భారత హైకమీషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా రాయబారిగా నియమితులవుతున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో రివా గంగూలీ దాస్ బంగ్లాదేశ్ భారత హైకమీషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
భారత్ మాకు కీలక భాగస్వామి: అమెరికా
వాషింగ్టన్: అమెరికాకు భారత్ ఎప్పుడూ కీలక భాగస్వామిగానే ఉంటుందని అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాకు తెలిపారు. అమెరికాలో భారత్ కొత్త రాయబారి నవతేజ్ సర్నాకు స్వాగతం పలికిన అనంతరం కిర్బీ మీడియాతో మాట్లాడుతూ... ‘ఒబామా పాలనలో భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశామని, భవిష్యత్తులో కూడా పూర్తిస్థాయిలో ఈ అంశంపై దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతం భారత్తో మంచి సంబంధాలను కలిగివున్నామని, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు తాము మరింత కృషి చేస్తామన్నారు. కొత్త రాయబారి నవతేజ్ సర్నాకు తాము అన్నివిధాలా సహకరిస్తామ’న్నారు. -
యూఎస్ లో భారత రాయబారిగా నవ్ తేజ్ సర్నా
న్యూఢిల్లీ: అమెరికాలో తదుపరి భారత రాయబారిగా నవ్తేజ్ సర్నా ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. సర్నా ఎనిమిది నెలల క్రితం బ్రిటన్లో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆయన 1980 ఐఏఎఫ్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం అమెరికాలో రాయబారిగా ఉన్న అరుణ్ కుమార్ సింగ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. గతంలో సర్నా ఇజ్రాయెల్ లో భారత రాయబారిగా చేశారు. 2002 నుంచి 2008 వరకు సర్నా మాస్కో, వార్సా, టెహ్రాన్, జెనీవా, థింపులలో భారత అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2015 అక్టోబరులో ఢిల్లీలో జరిగిన ఇండో,ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ విజయవంత మవడంలో కీలకపాత్ర పోషించారు. -
నెలాఖరులో విదేశాలకు ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశాలకు నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నవతేజ్ సర్నా తెలిపారు. ఈనెల (మే) 31న ఇండియా నుంచి బయలుదేరి తొలుత స్వీడన్కు వెళ్తారు. జూన్ 2 వరకు ప్రణబ్ స్వీడన్లోనే ఉంటారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా భారత్కు వచ్చి.. అదే రోజున అంటే జూన్ 2న బెలారస్ బయలుదేరుతారు. బెలారస్లో జూన్ 4 వరకు ఉంటారని నవతేజ్ సర్నా పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement